S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/30/2016 - 00:31

తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌సిల వర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్ సముచితమైంది. హిందూ షెడ్యూల్డుకులాల్లో మొత్తం 54 ఉప-కులాలు ఉండగా వీటిల్లో మాదిగ ఉప- కులానికి చెందిన ప్రజల జనాభా అధికం. వెనుకబడిన వర్గాల్లో ఇప్పటికే ఎ, బి,సి,డి వర్గాలున్నాయ. ఇదే సూత్రా న్ని షెడ్యూల్డు కులాలకు కూడా వర్తింపజేయడం న్యాయం.
- డాక్టర్ హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
కరవు భత్యం మంజూరు చేయాలి

07/28/2016 - 23:51

హైకోర్టు తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలన్న రాయలసీమ నేతల డిమాండ్ సహేతుకమైంది. నిజానికి ఇది 1937లో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు నేతలు, రాయలసీమ వారికి ఇచ్చిన హామీ కూడ. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం..ఆంధ్రలో రాజధాని ఉన్నట్లయతే, హైకోర్టును మాత్రం రాయలసీమలో ఏర్పాటు చేయాలి. విశాఖపట్టణంలో విశ్వవిద్యాలయం ఎట్లాగూ ఉన్నది.

07/28/2016 - 03:02

విజయవాడ రేడియో స్టేషన్ నుంచి వార్తలు వస్తూ మధ్యలో ఆగిపోవడం, ఇతర విధాలైన శబ్దాలు రావడం, ఒక కార్యక్రమం చెప్పబోయ ఇంకొక కార్యక్రమం చెప్ప డం, ఉదాహరణకు మధ్యాహ్నం ప్రసారం చేసే పసిడి పం టలు, వేరే కార్యక్రమంలో చెప్పడం. ఉదయం ప్రసార మయ్యే నాదస్వరం ఒక్కొక్కసారి సక్రమంగా విని పించదు. ఇవన్నీ చూస్తుంటే చాలా విసుగ్గా ఉంటోంది. పోనీ కడప కేంద్రం చూద్దామంటే దూరం వల్ల సరీగ్గా రాదు.

07/27/2016 - 04:01

పూర్వం విశ్వమంతా హిందూమతం విస్తరించి ఉండేది. ఏమతం వారైనా వారు పేర్కొనే దేవుళ్లు లేరు అని అనుకుంటే ఆయా మతాలు లుప్తమైపోతాయ. కానీ ఏ దేవుడూ లేడని వాదించినా హిందూమతం మాత్రం తన ఉనికిని కోల్పోదు. భగవంతుడు కాంతి స్వరూపుడు ఆయన్ను మనం చూడటం మనం చేసుకున్న పుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. భగవానుని రూపంపై దృష్టి కేంద్రీకరించడానికి ఒక ఆధారం అవసరం.

07/26/2016 - 00:14

వృక్ష సంపద, అడవులు, సరైన కొండవాలు, గాలి లేకపోతే వర్షాలు పడవు. ఇది సామాన్యంగా బుద్ధెరిగిన ఎవరైనా చెబుతారు. ప్రభుత్వాల నిర్వాకం, పది వృక్షాలు కొట్టి, వంద మొక్కలు నాటు అన్నట్లు ఉంది. పది వృక్షాలు పోతున్నాయ కాని, ఐదు వృక్షాలు కూడ పెరగడంలేదు. నాటిన మొక్కల సంరక్షణను పట్టించుకోకపోతే, అవి పెరగడం కష్టం కదా. అందువల్ల ప్రభుత్వం మీన మేషా లు మాని సక్రమంగా అడవుల పెంపకానికి పూనుకోవాలి.

07/25/2016 - 05:16

విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేత అత్యంత దారుణమైన చర్య. ఈ విషయంలో కొంతమంది నేతలు ఎనలేని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఆలయాలను కాపాడుకోలేనప్పుడు వాటిని నిర్మించడమెందుకు? ఒకవైపు కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్న సమయంలో ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. గోశాలను కూల్చడం, విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేయడం రాజ్యానికి మంచిది కాదు.
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం, గుంటూరు జిల్లా

07/23/2016 - 00:29

దేశంలో సామాజిక అశాంతిని కలుగజేయడానికి అరాచకవాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. ఆ అవకాశం కోసం విచ్ఛిన్నకరవాదులు సిద్ధంగానే ఉంటారు. ఈ పెడధోరణులకు సమాజంలో స్థానం లేదని స్పష్ట పరచడంలో ప్రభుత్వం ముందుండాలి. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, సోదరభావం ధ్యేయంగా రాజ్యాంగం రూపుదిద్దుకొంది. ఆ స్ఫూర్తిని కాపాడేందుకు అవసరమైన వ్యవస్థని స్వతంత్ర భారతం ఏర్పాటు చేసుకుంది.

07/21/2016 - 23:48

కార్లకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వం అనుమతించింది. గ్యాస్ కిట్ల నాణ్యత సరిగా లేకపోవడంవల్ల గతంలో ప్రమాదాలు సంభవించాయి. దీన్ని దృష్టిలోపెట్టుకుని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఆమోదించిన డిజైన్లను మాత్రమే ఆమోదించాలి. గ్యాస్‌ను కార్లకు ఇంధనంగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుంది.

07/21/2016 - 04:53

కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటమే గాక తగ్గడం లేదు. టమాటాలు, పచ్చిమిచ్చి, బెండకాయలు ఒకటేమిటి, చాలా రకాల కూరగాయల ధరలు శరవేగంగా పెరుగుతుండటమే తప్ప తగ్గే సూచనలు కనబడటం లేదు. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇక నిరుపేదలు పస్తులుండాల్సిందేనా? ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల ధరలు తగ్గేలా చూడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
మోదీ దూరదృష్టి

07/20/2016 - 04:44

భారత క్రికెట్ వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. క్రికెట్‌లో సమూల మార్పులను సూచిస్తూ సు ప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను సుప్రీంకోర్టు ఆమోదించింది. లోధా కమిటీ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నామని, ఆరునెలల్లోగా భారత క్రికెట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పేర్కొంది.

Pages