S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/18/2016 - 23:46

విశాఖ నగరంలో ఆర్.కె.బీచ్ నుండి భీమిలి వరకు గల సముద్ర ప్రాంతం రాత్రిళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. మందు బాబులు మద్యం సేవించడం, మహిళలపై వేధింపులకు దిగడం చేస్తున్నారు. మద్యం మత్తులో తీర ప్రాంతం వెంట కార్లు, బైకులు ఓవర్ స్పీడుతో నడుపుతూ ఇతర వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఋషికొండ- భీమిలి రోడ్డుపై వ్యభిచార కార్యకలాపాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి.

07/18/2016 - 02:55

తెలంగాణ రాష్ట్రం కరువుతో బాధపడ్తుంటే కేంద్ర సాయమందలేదని ఆరోపిస్తున్న ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు అవసరమా అనేది పునరాలోచించి- ప్రతిపాదన విరమించుకోవడమో, వాయిదా వేయడమో మంచిది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తాలూకాల స్థానంలో మండలాలు ఏర్పాటుచేశారు.

07/16/2016 - 08:29

టీమ్ ఇండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామకం హర్షణీయం. అనిల్‌కుంబ్లే అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ స్పిన్నర్. ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించిపెట్టాడు. క్రమశిక్షణ, అంకితభావం ఉన్న మృదుస్వభావి. ఎలాంటి వివాదాలు లేని ఆటగాడు. టెస్టు క్రికెట్‌లో ఇండియా కెప్టెన్‌గా రాణించాడు.

07/15/2016 - 03:01

దొంగతనాలుకాని, మానభంగాలు కాని, దుస్సంఘటనలు కాని, దోపిడీలు కాని ఇంకా ఏ చర్యలైనా అరికట్టాలన్నా, కట్టుదిట్టం చేయాలన్నా రైళ్ళల్లో, బస్సులలో ఇంకా ఇతర వాహనాల్లో కెమెరాలు ఏర్పాటుచేస్తే అందరికీ రక్షణగా సదుపాయంగా వుంటుంది. కెమెరాల సహాయంతో పోలీసుశాఖవారు ఎంతో చాకచక్యంతో నిఘావేసి సగం పైగా నేరాలను అరికట్టారు. వారికి అభినందనలు. ఇలాంటి చర్యలు జరుగకుండా ముందు ముందు ప్రజలను కాపాడతారని ఆశిస్తున్నాం.

07/11/2016 - 23:46

తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఆదాయం లేక నవ్యాంధ్ర రాష్ట్రం సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పెట్టుబడులకోసమంటూ విదేశాల్లో పర్యటించడం ఒకింత ఆశ్చర్యకరమే. ఆయన సింగపూర్ అనేకసార్లు సందర్శించారు. ఇక అమెరికా, జపాన్, చైనా, ఇగ్లాండ్, స్విట్జర్లాండ్ ఇక ఇప్పుడు కజకిస్థాన్ పర్యటన. కజకిస్థాన్ దేశ జనాభా మొత్తం కోటి డెబ్బయ్యేడు లక్షలు మాత్రమే.

07/11/2016 - 05:09

విజయవాడ పరిధిలోని కంచికచర్ల ప్రాంతం తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రధాన రహదారి మురుగునీరు, దుమ్ము, ధూళితో అస్తవ్యస్తంగా ఉంటోంది. నూతన రాజధాని ప్రాంతం కోసం నిత్యం, ఉన్నతాధికార్లు, మంత్రులు ప్రయాణం చేస్తున్నా ఈ రహదారిలో మార్పు లేదు.

07/09/2016 - 07:50

తాజాగా మొజాంబిక్‌తో భారత ప్రభుత్వం పప్పు ధాన్యాల దిగుమతి రెట్టింపు జరిపేలా ఒప్పందం కుదుర్చుకోవడం ముదావహం. దేశంలో పప్పుల కొరతను కొంతమేరకైనా తీర్చే మంచి ఒప్పందమిది. అయితే ఇలా పప్పులకోసం ఆఫ్రికావైపు, అప్పులకోసం అమెరికావైపు చూసే దుస్థితి నుండి ఇండియా బయటపడాలి. అందుకు స్వావలంబన దిశగా కృషి చేయడం ఒక్కటే మార్గం.

07/08/2016 - 03:11

నిత్యావసర సరుకుల ధరలు నింగికెక్కి కూర్చున్నాయి. బడుగుజీవులు రెండుపూటలా కాకపోయినా కనీసం ఒక్క పూటయినా పోషక పదార్థాలు తినలేక, కొనలేక కూలబడ్డారు. ఇంకా వెయ్యిలోపు వస్తున్న ప్రభుత్వ పెన్షనర్లు కూలిపనులు చేయలేక, రాక, అలవాటులేక బడుగు జీవులైపోయారు. బ్యాంకుల్లో వడ్డీనానాటికీ తీసికట్టవుతోంది. బతుకులు బాగుపడతాయన్న ఆశ సన్నగిల్లింది.

07/07/2016 - 07:10

రాష్టవ్య్రాప్తంగా నగరాలన్నిటినీ హరిత నగరాలుగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతోంది. నాటడమేకాదు వాటి సంరక్షణకూ పూనుకోవాలి. ప్రజలందరూ మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలి. పట్టణ ప్రాంతాలనే కాదు. పల్లెలనూ పచ్చదనంతో నింపాలి. పాఠశాలలనూ, కళాశాలలనూ పచ్చని చెట్లతో అలంకరించాలి.

07/06/2016 - 01:02

రాష్ట్రంలోగాని, దేశంలోగాని కుల పోరాటమనేది సమాజానికి కీడు. కులంకోసమే పోరాడే ఏ రాజకీయవేత్తనైనాసరే సమాజం నుండి వెలివేయాలి. తమ కులానికే ప్రభుత్వ ఫలాలు అందాలని కోరటం నీచాతినీచమైన సంస్కృతి. మిగతా కులాలు వీరి దృష్టిలో కనబడవా? వీరికి ఇతర కులాల బాగోగులు పట్టవా? కుల పోరాటగాళ్లను సమాజం క్షమించదు.

Pages