S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/05/2016 - 04:44

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు నరకాన్ని తలపింపజేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడుగడుతునా ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు స్పీడ్ బ్రేకర్లతో నింపివేశారు. ఇక రోడ్లు ఎక్కడెక్కడ బాగుంటాయో ఎక్కడ గుంతల మయమై ఉంటాయో తెలియని పరిస్థితి. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమై ఈ నీళ్ళలో స్పీడ్ బ్రేకర్లు, గుంటలు అర్ధంకాక వాహనాలు పల్టీ గొట్టడంవంటి సంఘటనలు కోకొల్లలు.

07/04/2016 - 04:36

రాష్ట్ర విభజన తర్వాత అండగా నేను వున్నాను, అధైర్య పడకండి! తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు. తల్లిని నేను తిరిగి బ్రతికిస్తాను! అంటూ భారీ సెంటిమెంట్ డైలాగులు చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు కనుక కాన్పు తర్వాత తల్లిని రోడ్డుపై పడేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకూ ప్రమాదకరంగా తయారౌతోంది.

07/02/2016 - 02:37

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయనా ఇప్పటికీ డిఎస్‌సి పోస్టు లను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. లక్షల మంది అభ్య ర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టెట్ ఫలితాలు విడుదలైనా ప్రయోజనం లేకుండా పోయంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని గురుకులాలు పెట్టినా, లక్షల మంది విద్యార్థులు చేరినా, డిఎస్‌సి నిర్వహించకపోతే విద్య చెప్పే ది ఎవరు? విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నారు.

06/30/2016 - 23:45

మోదీ ప్రభుత్వం వస్తే మైనారిటీల ఊచకోత, వారిని అణగద్రొక్కటం జరుగుతుందని కాంగ్రెస్, కమ్యూనిస్టు లాంటి పార్టీలు, ములాయంసింగ్, నితీష్ లాంటి నాయకులు కూడ భావించారు. అలాంటి పరిస్థితి ఉండి ఉంటే దాన్ని చూపి లబ్దిపొందవచ్చని కుహనా సెక్యులర్ పార్టీలు భావించాయి. అలా జరగలేదు. మైనారిటీలు పైకి వ్యక్తం చేయకపోయినా మోదీ ప్రభుత్వం తమకు ఏ విధంగా హానికరం లేదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయం.

06/30/2016 - 05:03

హైదరాబాద్, ఇతర పట్టణాల్లో గణేశ నిమజ్జనాలు, వూరేగింపుల వల్ల ప్రభుత్వంపై పాలనా పరంగా, ఆర్థిక, భ ద్రతా పరంగా భారం పడుతుంది. అంతేకాదు చెరువుల లో కాలుష్యం మరింత పెరిగిపోతుంది. వీధులు చెత్తగా తయారవుతాయ. చందాల వసూళ్లకోసం, బల ప్రదర్శన కోసం, రాజకీయ ప్రయోజనాలకోసం, జరుపుతున్నట్టుగా గణేశ్ వూరేగింపులు ఉంటున్నాయ తప్ప, భక్త్భివంతో జరుగుతున్నట్టు లేదు. టివి ఛానళ్లు నిమజ్జనాల తాలూకు ప్రసారాలను మానడం మంచిది.

06/29/2016 - 00:22

రాజధాని మార్పిడికంత తొందరెందుకు? దుర్మార్గమైన రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వుండవచ్చు కదా. మొగ్గలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేయాలా? ఆంధ్రా ప్రజలు పెంచి పెద్దచేసిన హైదరాబాదును కనీసం ఇంకా పది సంవత్సరాలైన వారు రాజధానిగా భావిస్తు కొద్దిగానాన్న సంతోషంగా వుండకూడదా?

06/27/2016 - 23:23

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలకోసమో, రాజకీయ ప్రయోజనాలకోసమో అర్థం కావడంలేదు. ఎందుకంటే అవసరం ఉన్నా లేకున్నా, కాస్త కంటికి నదరుగా కనిపి స్తున్న ప్రతి పట్టణాన్ని జిల్లా చేయాలని ప్రయత్నించడమే ఇందుకు నిరద్శనం. నిజానకి పది జిల్లాల్లో కొత్త జిల్లాలు విభజన అయదారు అదనపు జిల్లాలుగా పెంచితే సరిపోతుంది. జిల్లాలు విభజన అనేది పరిపాలనా సౌల భ్యం కోసమే తప్ప మరో ప్రయోజనాన్ని ప్రతిఫలిం చకూడదు.

06/27/2016 - 03:47

మంత్రాలకు చింతకాయలు రాలేకాలం, మరణించిన వారిని బ్రతికించే యుగాలు గతించాయి. పాత యుగాలలో అవి చెల్లుబడి అయ్యాయి. మైదాస్ టచ్ అనే కథ చిన్నప్పుడే చదువుకున్నాం. నీతికి ధర్మానికి, న్యాయానికి, కట్టుబడి బతికిన రోజులవి.

06/25/2016 - 02:31

ఒక దేశానికి వంద దేశాలు సభ్యత్వం ఇవ్వాలని తమ అభిప్రాయం తెలిపితే ఒక్క దేశం వ్యతిరేకించిందని సభ్యత్వాన్ని నిరాకరించడం సరైన పద్ధతి కాదు. చట్టాన్ని అప్పుడు ఏ సందర్భంలో చేశారో దాన్ని పునఃపరిశీలన చేయాలి. ఇప్పుడు చైనా ధర్మ సూత్రాలు చెబుతున్నది. 1962లో భారత్‌పై ఏ ప్రాతిపదికపై యుద్ధం ప్రకటించిందో చెప్పాలి. దేశంలోని చాలా భాగం ఆక్రమించుకుంది. ఇది ఏ పద్ధతి?

06/24/2016 - 23:38

ఒక దేశానికి వంద దేశాలు సభ్యత్వం ఇవ్వాలని తమ అభిప్రాయం తెలిపితే ఒక్క దేశం వ్యతిరేకించిందని సభ్యత్వాన్ని నిరాకరించడం సరైన పద్ధతి కాదు. చట్టాన్ని అప్పుడు ఏ సందర్భంలో చేశారో దాన్ని పునఃపరిశీలన చేయాలి. ఇప్పుడు చైనా ధర్మ సూత్రాలు చెబుతున్నది. 1962లో భారత్‌పై ఏ ప్రాతిపదికపై యుద్ధం ప్రకటించిందో చెప్పాలి. దేశంలోని చాలా భాగం ఆక్రమించుకుంది. ఇది ఏ పద్ధతి?

Pages