S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/07/2016 - 23:49

నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగునట. నదులు కొండల పర్వతాలమీద పాయలాగా ప్రారంభమై బలహీనపడిన చోటల్లా వాగు లు, ఉప నదులను కలుపుకుంటూ ప్రవహిస్తూ సముద్రానికి చేరుతుంటాయి. కృష్ణానది కూడా అలాగే అరేబియా సముద్రానికి 64 కి.మీ. దూరంలో సహాద్రి పర్వతాల మీద ప్రారంభమై, ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలోని హంసలదీవి దాటి న తర్వాత బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ ప్రవాహం కొనసాగుతూ ఎందరి దాహాన్నో తీరుస్తోంది.

08/06/2016 - 05:01

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం... దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్.. ఒకటేమిటి స్నేహం విలువ చాటిచెప్పే అద్భుతమైన సినిమా పాటలు, గొప్ప గొప్ప సినిమాలు, కథలు లెక్కకు మించి ఉన్నాయి. వీటన్నిటికి నిత్యప్రేరకాలు మన ఇతిహాసాలు. మన భారతీయ సంస్కృతిలో స్నేహబంధం ఉన్నతి అమూల్యమైనది. రామాయణ మహాకావ్యంలో ప్రతి అడుగునా స్నేహబలం, మిత్రలాభం ప్రతిబింబిస్తుంటాయి.

08/04/2016 - 23:39

ఆ మధ్య రెండు వారాల్లో కేరళ ప్రాంతంలో ఇద్దరు యువతులు మానభంగానికి గురై భయంకరంగా హత్యకు గురయ్యారు. ఇంకా మొన్నమధ్య హైద్రాబాదులో ఒక ఇంజనీరింగు అమ్మాయి యాక్సిడెంటులో చనిపోయిందని, కాదు హత్యేనని ఇంకా ఎటూ తేలలేదు. ఇలా రోజూ వార్తాపత్రికలు తెరవగానే కనీసం వారానికి రెండుమూడు ఇలాంటి సంఘటనలను చదవటం బాధపడటం జరుగుతోంది. ఏదైతేనేం మనుష్యులలోని అమానుషత్వానికి నిండు ప్రాణాలు, మానాలు బలైపోతున్నాయి.

08/04/2016 - 23:39

పంధొమ్మిదవ శతాబ్దంలో ‘గెలివర్ ట్రావెల్స్’అనే నవల వచ్చింది. దానితో కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అది ఇంగ్లీషులో వుండడం వలన ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యాన్ని పొందింది. స్వాతంత్య్రానికి ముందు తరువాత కొంతకాలం మన దేశంలో హైస్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థులకానవలను ఉపవాచకంగా పెట్టేవారు.

08/04/2016 - 04:38

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కరువై మూతపడుతున్న అనుబంధ వ్యవసాయ పరిశ్రమల్లో ఉప్పు తయారీ పరిశ్రమ కూడా చేరిపోయింది. ఎటువంటి యం త్రాల సహాయంలేకుండా కేవలం మానవశక్తితో తయారయ్యే సాధారణ ఉప్పు పరిశ్రమ ఏలికల నిర్లక్ష్యంతో ఏ ఏటికాయేడు కరిగిపోతోంది.

08/04/2016 - 04:36

ఈనాడు విద్యారంగానికి సవాలు ఏమిటంటే పిల్లల ఆలోచనా విధానాన్ని బహిర్గతం చేయటం. అంటే అవగాహన అనే దాన్ని పరిశీలించటానికి ఒక కిటికీని తయారుచేయాలి. పిల్లల అవగాహనాశక్తిని పరిశీలించడానికి ఒక ద్వారాన్ని చూపించాలి. విద్యార్థి పాఠాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నాడు? తాను చూసిన విషయాలను ఎలా పరిశీలించ గలుగుతున్నాడు?

08/03/2016 - 00:14

అడవుల నరికివేతవల్ల వాతావరణం సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో సమతుల్యత లోపించి కాలుష్యం ఏర్పడి మానవకోటి కి నష్టం వాటిల్లుతోంది. దీని నివారణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరం వుంది. అడవుల నరికివేత,గుట్టలు తరిగిపోవడంతో వాతావరణంలో మార్పులు జరిగి అనేక అనారోగ్యాలతో ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయి.

08/03/2016 - 00:07

భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అనేక స్వాతంత్య్రాలలో ముఖ్యంగా చెప్పుకోవలసినది వ్యక్తి స్వాతంత్య్రం. అందువలన ఎవరైనా తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించుకోవచ్చును. అయితే కొందరు మేధావులు, రాజకీయ నాయకులు అభివ్యక్తి స్వాతంత్య్రానికి హద్దులు లేవనుకుంటున్నారు. అవాకులు, చవాకులు ప్రేలుతున్నారు. వ్యక్తి స్వాతంత్య్రానికి, అభివ్యక్తీకరణ స్వాతంత్య్రానికి కొన్ని హద్దులు, పరిమితులు సహజంగానే ఉంటాయి.

08/02/2016 - 00:58

పాకిస్తాన్ పట్ల మెతక వైఖరిని అవలంభించినంత కాలం కశ్మీర్ సమస్య పరిష్కారం కాదనే వాస్తవాన్ని బి.జె.పి నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనిని భద్రతా దళాలు ఈ నెల 8 తేదీనాడు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టిన మరుసటి రోజు నుండి కశ్మీర్ లోయ భగ,్భగ మండుతోంది.

08/02/2016 - 00:57

జలం జీవనాధారం. మన శరీరంలో 90 శాతం నీరు, మిగతా 10 శాతం సేంద్రియ, కార్బనిక పదార్ధాలే ఉన్నాయ. తాగడానికి నీరు కావాలి. శరీరం వాడుకునే వస్తువులకు, శుభ్రతకు నీరు కావాలి. మనం ఇంటి నిర్మాణం దగ్గరనుంచి ఏ పనులు చేపట్టాలన్నా నీరు కావాలి. నాణేనికి రెండో ప్రక్క చూస్తే- నీరు మలినమైతే ఎన్నో అనారోగ్యాలు వచ్చి, ప్రాణాంతకమూ కావచ్చు. అపరిశుభ్ర నీటి ద్వారా అనారోగ్యాలు విస్తరిస్తాయి.

Pages