S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/20/2019 - 00:11

అయోధ్యలోని ‘రామజన్మభూమి వివాదం’పై సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ వార్త వెలువడ్డాక అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు అనుమానిస్తున్నట్లు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ క్రైస్తవ మతానికి చెందినంత మాత్రాన ఆయన సమాజ హితాన్ని విస్మరిస్తున్నారని భావించలేము.

10/18/2019 - 21:26

ప్లాస్టిక్ ఉత్పత్తులతో ప్రధానమైన సమస్య ఏమిటంటే అవి మనకి ఉపయోగంలో ఉండే సమయం కన్నా, వ్యర్థాలుగా మన చుట్టూ పేరుకుపోయే కాలమే ఎక్కువ. సౌందర్య సాధనాలలోని ‘మైక్రోబీడ్స్’ కొద్ది క్షణాలే మనకి ఉపయోగపడతాయి. కానీ ఆ తర్వాత వందల ఏళ్ల పాటు అవి వ్యర్థాలుగా భూమిలో పేరుకుపోతాయి. మనం వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల పరిస్థితి కూడా ఇంతే.

10/17/2019 - 00:09

విభేదం.. వివాదం కారాదంటూ రెండ్రోజుల చైనా-్భరత్ అగ్ర నాయకుల శిఖరాగ్ర సమావేశం ‘చెన్నై సంబంధం’తో ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీచేసేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ సంకల్పం చెప్పుకున్నారు. గత ఏడాది వుహాన్‌లో ప్రారంభమైన స్నేహగీతం సహకార రాగం ఆధారంగా 16 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇది పూర్తిగా మోదీ దౌత్య విజయం. అక్కడ కశ్మీర్ ప్రస్తావన శూన్యం..

10/16/2019 - 01:21

న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినపుడు అప్పటికే పుణ్యకాలం మిం చిపోయిందని ఒక్కోసారి కక్షిదారులు బాధపడుతుంటారు. ఆ బాధలు చెప్పుకోవడానికి వారి చుట్టూ ఎవరూ లేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో న్యాయం వెలువడే వేళకు వారు జీవించి లేకపోవచ్చు. న్యాయం జరగడంలో ఆలస్యమైతే- అసలు న్యాయం జరగలేదనే అర్థం చేసుకోవాలి. ఆలస్యం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది.

10/13/2019 - 02:14

హైదరాబాద్‌కు మరో టెక్నాలజీ ఆణిముత్యం వచ్చి చేరింది. అమెరికాకు చెందిన సెమీ కండక్టర్ సంస్థ ‘‘మైక్రాన్ టెక్నాలజీ ఇన్’’ తన పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించింది. ‘నీతి ఆయోగ్’ సీఈఓ అమితాబ్ కాంత్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10/11/2019 - 21:50

గత వంద సంవత్సరాల్లో ‘దక్కన్’ (హైదరాబాద్, దాని పరిసర ప్రాం తాలు) రూపాంతరంపై ఇటీవల కొన్ని ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. వివిధ మాధ్యమాల ద్వారా ఈ పరిణామాలను ప్రజల దృష్టికి కొందరు తీసుకొచ్చారు. 1920 ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక-వ్యాపార, కుటీర పరిశ్రమల నుంచి ఇప్పుడు బహుళ జాతి సంస్థల కేంద్రాలు, ఐటీ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక అంశాలను తిలకిస్తే దక్కన్..

10/11/2019 - 01:13

‘ఇసుక నుండి తైలమును పిండలేము. కానీ, ధనమును పిండవచ్చు’ అన్నది సర్వజనీన సామెతైతే, ‘ఇసుక పాదం’ మోపి అన్నార్తుల ఆకలి కేకలను ‘దండుపాళ్యం’ దొంగల్లా వినవచ్చు. అరచి యాగీ చేసినా.. ఏమీ ఎరుగనట్లు నటించనూ వచ్చు’ అన్నది కొత్త సామెత. ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడు ఇసుక కోసం బక్కజీవులంతా బజారుకెక్కారు. బడుగులంతా రోడ్లెక్కి ‘పని కల్పించండి ప్రభో’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పండుగ లేదు, పబ్బం లేదు.

10/08/2019 - 01:59

ఆహార పదార్థాలలో కల్తీలవల్ల ఎంతోమంది రుగ్మతల పాలవుతున్నారు. దుకాణాలలోని అద్దాల అల్మారాలలో చూడగానే కళ్లు మిరుమిట్లు గొలిపే తయారీ వంటకాలు, పిజ్జాలు, బర్ఫీలు, గోబీ మంచూరియాలు అప్పటికప్పుడు రుచికరంగా తోచినా వాటి తయారీకి వాడిన పదార్థాలలో కల్తీలతో కూడిన విష రసాయనిక శకలాలు ఏదో రూపంలో చొచ్చుకెళ్ళి బలవర్ధకం కోల్పోయి శరీర జీర్ణప్రక్రియలో ఏదో ఒక రోగానికి కారకమవుతోంది.

10/06/2019 - 02:02

మన దేశంలో ప్రతి ఒక్కరి గుండెలో తరతరాలకు నిలిచిపోయే మహావ్యక్తి పూజ్య బాపూజీ. 150 ఏళ్ల క్రితం జన్మించిన బాపూజీ భారత స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొన్న తీరు, ఎంచుకొన్న మా ర్గాన్ని నేటికీ ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తుంటాయి. మహాత్ముని ఊహల్లో, ఆశయాలలో పల్లెలు గూర్చి, వాటి ఔన్నత్యం గూర్చి చాలా గొప్పగా చెప్పబడింది. పల్లెలు బాగుండాలని, సౌభాగ్యవంతంగా వుండాలని ఆయన కలలు కనేవారు.

,
10/04/2019 - 21:36

(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం)

Pages