S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/16/2016 - 05:23

నేను గణితపు ఉపాధ్యాయుణ్ణి కావటంవల్ల ప్రతి ప్రిన్సిపల్ నాకు టైంటేబుల్ తయారుచేసే బాధ్యతను అప్పగించేవారు. స్కూలు నిర్వహణలో అదొక కీలకమైన కార్యక్రమం ఆ టైంటేబుల్ తయారుచేయటంలో ప్రతి ఉపాధ్యాయుణ్ణి లెక్చరర్‌ను కలిసేవాణ్ణి. ప్రతి లెక్చరర్ లేదా ఉపాధ్యయుణ్ణి ఆప్షన్స్ కనుక్కునేవాణ్ణి. ఎవరు కూడా వారానికి 20 పిరియడ్లకన్నా ఎక్కువగా చెప్పలేరు.

06/15/2016 - 03:57

భారతదేశంలో జనాభా దాదాపు 124 కోట్లకు చేరుకొంది. ధనవంతులు మరింత ధనవంతులు కావడం తప్ప, దశాబ్దాలుగా పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. వారు అభివృద్ధి దిశగా ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు వారికి ఏమాత్రం చేయూతనందించలేక పోతున్నాయి.

06/15/2016 - 03:51

మద్యం అనేది ఒక రక్కసి. అది ప్రజలను అటు ఆరోగ్యపరంగా ఇటు ఆర్థికపరంగా చిదిమి వేయడమే కాకుండా, సమాజంలో పలు హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణవౌతున్నది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, గృహహింసలు నానాటికీ పెరిగిపోవడానికి మద్యం మహమ్మారి కారణమన్న సంగతి సర్వవిదితమే. అయితే, పాలక పక్షాలు మాత్రం మద్యం అమ్మకాలను మాత్రం ఒక ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూండటం దురదృష్టకరం.

06/13/2016 - 23:55

నేడు శతజయంతి ఉత్సవాల ముగింపు‘అనాగరికులైన స్ర్తిలపట్ల సానుభూతి, ఇష్టం నాకు ప్రబలంగా ఉన్నాయి. నా రచనలలో తరచూ అలాంటి స్ర్తిలు దర్శనమిస్తుంటారు. వారి శరీరాలను మూగ మనస్తత్వాలను వర్ణించడంలో ఒక వింత ఆనందాన్ని పొందుతాను’’ అన్నారు బుచ్చిబాబు.

06/13/2016 - 04:51

మానసిక పూజ కేవలం జ్ఞానులకే సాధ్యమవుతుంది. సామాన్యులకు నిరక్షరాస్యులకు అట్టి భక్తిసాధ్యమవడం కష్టం కనుక మన పూర్వులు అట్టి వారికి కూడా భక్త్భివం కలగడానికి వివిధ దేవతా పూజలు ప్రవేశపెట్టారు. మనది ఒక మతం కాదు. ఒక సనాతన ధర్మం. దీనికి కూడా ఏదో పేరు ఉండాలని దీనిని హిందూ మతం అన్నారు. ఏ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో కొన్ని పద్ధతులు నియమాలు ఉన్నాయి.

06/10/2016 - 23:52

తెలుగు రాష్ట్రాల్లో తామరతంపరగా పెరిగిపోతున్న ప్రైవేటు ఆసుపత్రులు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎక్స్‌రే అవసరమున్నా అవసరం లేకున్నా ఎక్స్‌రే రాస్తారు. స్కానింగ్, ఎంఆర్‌ఐ, సీటి స్కాన్, తర పరీక్షలు కూడా యదేచ్ఛగా రాసేస్తున్నారు. పరీక్షలో రోగి జబ్బు ఏమిటో తెలిసిపోయినప్పటికీ ప్రిస్క్రిప్షన్ రాయకుండా అక్కరలేని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు రాస్తున్నారు.

06/10/2016 - 05:36

అభివృద్ధిపేరుతో పాలక పక్షాలు బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్ చేయాలన్న అంశం బహుళజాతి సంస్థలకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదనడంలో సందేహం లేదు. అది ఆ సంస్థలకు వెన్నతో పెట్టిన విద్య. బహుళజాతి సంస్థల దాటికి తట్టుకోలేక పలు స్వదేశీ వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

06/10/2016 - 05:35

కకన్యాశుల్కం నాటకంలో కరటక శాస్ర్తీ శిష్యునికి పాఠం చెబుతూ చదువన్నది ఎందుకు? అని ప్రశ్నించగా పొట్టపోసుకునేందుకు అని జవాబు చెప్పి తన సంస్కృత చదువు నిష్ప్రయోచనమైనదని ఇంగ్లీషు చదువు ఘనమైనదని అంటాడు. సుమారు వంద ఏళ్ల క్రితమే చదువుయొక్క ధ్యేయం ఇలా వివరింపబడింది. అదే అభిప్రాయం నేడు ఇంకా బలపడిపోయింది. చదువుకి కొలబద్దలు డిగ్రీలు. నేటి విద్యాలయాలలో చదువులు పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంగా మారాయి.

06/09/2016 - 05:38

భారతదేశ జనాభా అపరిమితంగా పెరిగిపోతోంది. 1950లో 40 కోట్ల నుంచి ప్రస్తుతం 130 కోట్లకు పెరిగి, అనతికాంలోనే చైనాను అధిగమించి, ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా పరిగణింపబడనున్నది. మనదేశ వైశాల్యం చైనాలో మూడోవంతు. చైనా ప్రజల తలసరి ఆదాయం మనకన్నా ఆరురెట్లు అధికం. చైనా జనాభా పెరుగుదలను ప్రతి కుటుంబం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవాలనే నిబంధనను 1978 నుంచి అమలు చేసింది.

06/09/2016 - 05:37

హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటుచేసుకున్న తరువాత చాలాసార్లు సైకాలజిస్టు బి.వి.పట్ట్భారామ్‌తో మీటింగులలో కలిశాం. మీటింగ్‌లలో ఆయనతో కలిసి ఉండటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. తరగతి గదిలో అడుగు పెట్టకముందే మానసిక శాస్త్రానికి సంబంధించిన అవగాహన ఉంటే ఉపాధ్యాయులు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

Pages