S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/24/2016 - 07:29

కొన్ని పాఠశాలలను సమర్ధవంతమైన స్కూళ్లంటాం. కొన్నింటిని ఎక్స్‌లెన్సీ స్కూళ్లంటాం. కొన్నింటిని విశిష్టమైన స్కూళ్లంటాం. సమాజంలో పాఠశాలల్లో ఈ సున్నితమైన ఈ తేడాకు కారుకులెవరు? ఆ పాఠశాల యొక్క నాయకుడే. కొంతమంది హెడ్‌మాస్టర్ అంటే తలపంతులు అనుకుంటారు. భౌతికమైన ఆకారమే కాదు, హెడ్‌మాస్టర్‌కు ఒక దృక్పథముంటుంది. ఆ దృక్పథాన్ని దీక్షతో అమలుచేస్తే అది మిషన్ అవుతుంది.

03/23/2016 - 00:38

కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లో సయితం ఎనలేని గుర్తింపు పొందిన పొందూరు సన్నఖాదీ పరిశ్రమ నేడు క్లిష్ట దశలో ఉంది. కార్మికులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో పలువురు ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి వెళ్తున్నారు. మరికొందరు పొట్టకూటికోసం సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. తన మనుగడను నిలుపుకొనేందుకు పరిశ్రమ అష్టకష్టాలు పడుతోంది. ఎంతో ప్రాచీనమైన ఈ పరిశ్రమ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది.

03/23/2016 - 00:32

మనదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాణాంతక సమస్య ‘క్షయ’. ఈ వ్యాధి ముఖ్యంగా మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా వ్యాపిస్తుంది. ఇది స్ర్తిపురుష తారతమ్యం లేకుండా, ఏ వయసులో వారికైనా రావచ్చు. ఇది శరీరంలో (తల వెంట్రుకలు, గోళ్లు తప్ప) రక్తప్రసరణ ఉన్న ఏ భాగానికైనా రావచ్చు. క్షయ క్రిమికి ఆక్సిజన్ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది.

03/22/2016 - 00:31

విద్యార్థులకు చక్కని విద్యాబోధన చేసేవారికి, చేయించే వారికి రక్షణ లేదా? సమయపాలన పాటించని టీచర్లకు ఆబ్సెంట్ వేస్తే, దారితప్పిన టీచర్లను దారిలోకి తెస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పీజీ హెడ్మాస్టర్లకు, మండల విద్యాధికారులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు వేధింపులు, సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు తప్పటం లేదు.

03/21/2016 - 01:02

జన్మించి శతవత్సరాలు, మరణించి 55 సంవత్స రాలు గడిచి, తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దాదాపు రెండు వసంతాలు పూర్తయనా గుర్తింపునకు నోచ ని తెలంగాణ తొలి నవలా కారుడు వట్టికోట అళ్వారు స్వామి. నిజాం సర్కారు దమ న నీతిని దునుమాడుతూ, అక్షరానే్న ఆయుధంగా సంధిం చి అళ్వారు చేసిన అక్షర యుద్ధమే ఆయన్ను ‘ప్రజల మనిషి’గా నిలిపింది.

03/19/2016 - 23:36

పూర్తి భావస్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ హిందువులకు ఉంది. ఇతరమతాల్లో లేదు. ఇతర మతాల్లో కొనసాగే అసహనం భావస్వేచ్ఛ ఎట్లా అవుతుంది. హైందవంలో నిరీశ్వర సాంఖ్యం అని ఒక తత్వం ఉంది. భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు సాంఖ్యం- అంటే దేవుడు లేడు అనేవారు కూడా మన్నింపబడ్డారు. ఇదొక ఆలోచనావిధంగా గౌరవించారు. ఇక దేవుడున్నాడనేవాడు ఒకే దేవుణ్ణికాదు మూడుకోట్ల మంది దేవతలను ఆరాధించుకోవచ్చునన్నారు. ఇదే హైందవం.

03/18/2016 - 23:42

రాష్ట్రంలో వేసవి తాపం మొదలైంది. జనం తాగునీటికి అల్లాడుతున్నారు. బిందె నీటి కోసం మైళ్లు నడక. అడుగంటిన భూగర్భ జలాలు.. నదులన్నీ ఎడారులుగా మారాయి. పాపం ప్రజలు కలుషిత నీటినే సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇంకా మార్చి రాకుండానే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్రలో నీటిఎద్దడి ప్రస్తుతానికే తీవ్రంగా ఉంది.

03/18/2016 - 00:07

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. విద్యార్థుల సంక్షేమం రికార్డులకే పరిమితమైంది. వసతులు లేమి, మెనూను పాటించకుండా సమకూరుస్తున్న భోజనం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా అన్ని వసతి గృహాల్లోనూ వీటి కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

03/18/2016 - 00:06

వసుధైక కుటుంబమని మనం గర్వంగా చెప్పుకొనే ప్రపంచ దేశాలలో శాంతికరువై ప్రజలు అభద్రతాభావంతో మనుగడ సాగిస్తున్నారు. ఎప్పుడు ఉగ్రవాదులతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని మానవాళి భయావహ స్థితిలో అట్టుడికిపోతున్నారు. మతోన్మాదులైన జిహాదీలను మట్టికరిపించే విధానాలను కఠినతరం చేయాల్సిన అవసరం ప్రపంచ దేశాల ముందుంది.

03/17/2016 - 06:38

తాము పండించిన పంటకు ఆశించిన మద్దతు ధర ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించక పోవడంతో రైతులలో నిరాశ నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికీ కాడిమేడిని పక్కనపెట్టి వ్యవసాయ రంగంనుంచి తప్పుకుంటున్న రైతులకు కొదవలేదు. భూమిని నమ్ముకొని వృత్తిపరంగా కొనసాగే వ్యవస్థ కొరవడడంతో ‘బ్రతికుంటే బలుసాకైనా తిని బ్రతకవచ్చనే..’ సామెతకు అనుగుణంగా సన్న, చిన్నకారు రైతులు నగరాలకు వలసబాట పడుతున్నారు.

Pages