S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/13/2016 - 23:53

తొంభై ఒక్క ఏళ్ల వయసు.. అందులో 64 ఏళ్ల జర్నలిస్టు జీవితం.. తుదిశ్వాస వరకూ రాస్తూనే బతుకు పుస్తకాన్ని అక్షరమయం చేసుకున్న నిండైన పాత్రికేయ జీవితం వి. హనుమంతరావు సొంతం. ‘డిఎన్‌ఎఫ్’ హనుమంతరావుగా ప్రసిద్ధి చెందిన ఆయన రాస్తూనే జీవించారు. చివరి వరకు రాయడానికే ఇష్టపడ్డారు. 80 ఏళ్ల వయసులోనూ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. బడ్జెట్ పుస్తకాలను అమితంగా ప్రేమించేవారు.

12/12/2016 - 23:52

బాలల న్యాయబద్ధమైన హక్కులు, వారి సంక్షేమ లక్ష్యాలు, పౌష్టికాహారం వంటి అనేక అంశాలపై గత అర్ధ శతాబ్దంగా దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ విస్తృత చర్చ జరుగుతోంది. హక్కుల కోసం బాలల కమిషన్లు, బోర్డులు , లక్ష్యాలను చేరుకునేందుకు బాలల దినోత్సవం, విద్యాసంస్థల్లో బాలలపై అకృత్యాలు, హింసను నివారించేందుకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి.

12/11/2016 - 23:58

ప్రపంచంలో విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే వనరులను మనం అత్యంత వేగంగా వాడేస్తున్నాం. కానీ ఆ వనరులు తయారీకి కోట్లాది సంవత్సరాల సమయం పడుతుంది. విచ్చలవిడిగా విద్యుచ్ఛక్తి వినియోగించడం వల్ల భవిష్యత్ అవసరాలకు కొరత ఏర్పడబోతోంది. కోట్లాది సంవత్సరాల కాలంలో తయారైన బొగ్గు, ఇతర ప్రకృతి ప్రసాదించిన వనరులను మనం విచ్చలవిడిగా వాడి విద్యుచ్ఛక్తిని తయారు చేసుకుంటున్నాం.

12/11/2016 - 07:24

దేశంలో అవినీతి, నల్లధనం నియంత్రించడానికే మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. అనేక రంగాల్లో అవినీతి పెచ్చుమీరడంతో నల్లధనం గుట్టలకొద్దీ పేరుకుపోయింది. మరోవైపు నకిలీ కరెన్సీని నివారించేందుకు మోదీ నిర్ణయం దోహద పడుతుంది. పెద్దనోట్లను రద్దు చేయడం మంచిదే అయినా తగిన ముందస్తు ప్రణాళికలు లేనందున దేశవ్యాప్తంగా ప్రజలు ఇపుడు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు.

12/10/2016 - 01:00

పెద్దనోట్ల రద్దు రూపంలో నల్లకుబేరులపై ప్రధాని నరేంద్ర మోదీ ‘సర్జికల్ దాడి’ చేశాక దేశ సామాజిక, ఆర్థిక రంగం రూపురేఖలే మారిపోయాయి. నల్లధనం మీద దాడి చేయవద్దని, అవినీతిని అరికట్టవద్దని ఎవరూ అనరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉండే వారు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. గతంలో అధికారం చలాయించినవారూ చాలా నిర్ణయాలు తీసుకున్నారు.

12/09/2016 - 00:54

జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం, జాతీయ ఎంపిక పరీక్షల్లో టాపర్లుగా నిలవడం కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల ఆధిపత్యాన్ని రుజువు చేస్తోంది. ఏదో ఒక సంవత్సరానికి అది పరిమితం కాకుండా ఏకంగా గత పదేళ్లుగా అన్ని ఎంపిక పరీక్షల్లోనూ, ప్రవేశపరీక్షల్లోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చూపుతున్నారు.

12/08/2016 - 05:19

మన దేశంలో జనానికి సెంటిమెంట్లు ఎక్కువ. అందులోనూ ఆడవాళ్లకు అవి మరీ ఎక్కువ. ‘ఆడవాళ్లు గడపదాటి బయటకు రాకూడద’న్న అతి సాంప్రదాయ సంస్కృతిలో పుట్టిపెరిగిన స్ర్తిలు నాలుగు గోడల మధ్యే కాలం గడపడంతో అటువంటి భావజాలానికి అనాదిగా అలవాటుపడిపోయారు. ‘బొట్టు, కాటుక, పసుపు, కుంకాలు, పుస్తెల తాడు, నల్లపూసలు, మె ట్టెలు’వంటి మాటలు తప్ప..

12/08/2016 - 05:17

గణితం అన్ని సబ్జెక్టుల కన్నా ఉత్తమమైనటువంటి ప్రక్రియకు మూలం అంటారు. గణితం మనం ఏ విధంగా క్రమబద్ధంగా ఆలోచించాలో చెబుతుంది. ఈనాడు గణాతాన్ని సమస్యా పరిష్కారానికి వేదిక అంటున్నారు. గతంలో కన్నా ఇప్పటికి తేడా ఏమిటంటే? గతంలో గణితాన్ని ఎక్స్‌ర్‌సైజ్ కోసం ఉపయోగించారు. సమస్యను ఎలా పరిష్కరించాలో నియమితమై ఉంటుంది. ఆలోచనలో కలిసిన సమస్యా పరిష్కారం వల్లనే ఈనాడు సమస్యలకు విరుగుళ్లు దొరుకుతాయి.

12/07/2016 - 02:51

‘సిపిఎం ఎప్పుడూ భారత జాతీయవాదానికే మద్దతు పలుకుతుంది తప్ప, హిందూ జాతీయవాదానికి కాదు. హిందూత్వ ఎజెండాను పెద్దఎత్తున అమలుచేస్తున్నది వేరేవాళ్లు. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందంటే- దేశభక్తికి ఆర్‌ఎస్‌ఎస్ వారు సర్ట్ఫికెట్లు జారీచేసే వరకూ వెళ్ళింది. హిందూత్వమే భారత జాతీయవాదం అనే రీతిలో వాళ్లు ప్రచారం చేస్తున్నారు.’
- సిపిఎం అగ్ర నాయకుడు సీతారాం ఏచూరి

12/05/2016 - 23:28

నల్లధనం నిర్మూలనలో భాగంగా దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెను మార్పులను తీసుకొస్తున్నది. నగదు కొరతతో, చిల్లర సమస్యతో ప్రజలు ఇపుడు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. పెద్దనోట్ల రద్దు తర్వాత కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రం వేసినట్టుగా అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయి. మూడు మాసాలకు పైగా కర్ఫ్యూ, రాళ్లు విసరడం, బంద్‌లు..

Pages