S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మిర్చిమసాలా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ తన మంత్రిమండలి నుంచి కపిల్ మిశ్రాను తొలగించడంతో ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ట్విట్టర్లో కేజ్రీవాల్ భార్య సునీత పేరుతో ఒక ట్వీట్ వ చ్చింది. ‘ప్రకృతి ఎప్పటికీ తప్పుచేయదు, కపిల్ మిశ్రా కూడా పోతాడు..’ అనేది ఆ ట్వీట్ సారాంశం. అ యితే- సునీత సెల్ఫోన్ నుంచి కేజ్రీయే అలా ట్వీట్లు చేస్తున్నారన్నది మిశ్రా ప్రత్యారోపణ. ‘కేజ్రీవాల్జీ..
తెరాస అధికారం చేపట్టాక- ప్రజా సంఘాలు, విపక్ష నేతలు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేసే అవకాశమే లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అర్థం ఇదేనా! అని విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొందని టి.జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. తెరాస ప్రభుత్వంలో సమస్యలే ఉండవనీ, దీంతో ధర్నాలు, దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేయాల్సిన పనే ఉండదని అనుకున్నామన్నారు.
వరంగల్లో జరిగిన తెరాస బహిరంగ సభ బిజెపి నాయకులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. రాజకీయాలన్నాక ప్రత్యర్థులను ఘాటుగా విమర్శించడం సహజమే. వరంగల్ సభలో ‘స న్నాసులు, ద ద్దమ్మలు’ అని కాంగ్రెస్ను తెగ తిట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ టిడిపి, బిజెపిలను అస్సలు పట్టించుకోలే దు.
తనైతే ఒకటి , ఎదుటివారైతే మరొకటి అన్నచందంగా ఉన్న ఐటి మంత్రి నారా లోకేష్ బాబు తీరుపై పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో జయంతికి బదులు వర్ధంతి అంటూ లోకేష్బాబు చేసిన వ్యాఖ్యలో సామాజిక మాధ్యమాల్లో రయ్మన్నాయి. దాంతో సామాజిక మాధ్యమాలను కట్టడి చేయాల్సిందేనని హుకుం జారీ చేయడంపై పార్టీ నేతలే తనైతే ఒకటా , ఎదుటివారైతే మరొకటా అంటూ ప్రశ్నిస్తున్నారు.
టిఆర్ఎస్ కూలిపనుల కార్యక్రమంలో భాగంగా మంత్రి కెటిఆర్ సుచిత్ర చౌరస్తాలో ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్క్రీమ్లు అమ్మితే, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి ఏకంగా ఐదులక్షల రూపాయలకు ఓ ఐస్క్రీమ్ కొనుగోలు చేశారు. మల్లారెడ్డి ఉత్సాహంగా ఐదులక్షలకు ఐస్క్రీమ్ కొన్నపుడు అక్కడున్న తెరాస నేతలు ఎంపిగా పోటీ చేసినప్పుడు లక్షలు పెట్టి ఆయన టిడిపి టిక్కెట్ కొన్నాడని గుసగుసలాడారు.
‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్థితి ఎవరికీ రాకూడదు. వస్తే ఏ విషయం తేల్చుకోలేక ఇరకాటమే. ఇదే పరిస్థితి ఏపి సిఎం చంద్రబాబుకు ఎదురైంది. ఆయేషామీరా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు తేల్చిం ది. దీన్ని సవాలు చే స్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని పోలీసు సం ఘాలు చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నాయి. అ లా వెళ్లకపోతే పోలీసుల ఆగ్రహానికి టి డిపి ప్రభుత్వం గురవుతుంది.
ఎమ్మెల్యేలు మాట్లాడేటపుడు అనేక చమత్కారాలు, ఛలోక్తులు సహజం. కొంతమంది సభ్యులైతే- ‘అధ్యక్షా.. ఒకటో పాయింట్, అధ్యక్షా.. రెండో పాయింట్..’-అంటూ ఇక మూడో పాయింట్కు వెళ్లకుండానే రెండోపాయింట్ అంటూ పది విషయాలు చెప్పేస్తుంటారు. ఇలాంటి చమత్కారమే తెలంగాణ శాసనసభలో జరిగింది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం ఉండవన్నది నిజమే. ఏపిలో ఇప్పటికే 21 మంది వైకాపా ఎమ్మెల్యేలు రాజకీయ వైరం వీడి అధికార టిడిపిలో చేరారు. ప్రస్తుతం శాసనసభ ప్రసారాలను టీవీల్లో వీక్షించే వారికి అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన తీరును చూసి వీరంతా ఆగర్భ శత్రువులని అనుకుంటారు. అదే పొరబాటు. ఒక్కసారి నేరుగా గ్యాలరీ నుంచి చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ తెలంగాణ అసెంబ్లీలో నోరువిప్పితే చాలు.. మైకు లేకున్నా ఆయన మాటలు గ్యాలరీ ఉన్న విలేఖరులకు సైతం వినిపిస్తాయి. సభలో ఆయన గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టగానే స్పీకర్ మధుసూధనాచారి- ‘ప్రతిదానికీ గట్టిగా మాట్లాడతారు. సహనానికీ హద్దు ఉం టుంది. ఇలా మాట్లాడితే సహించేది లేద’ని హెచ్చరించే సరిగా ఒక్కసారిగా సీన్ మారిపోయిం ది.
తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో మాట్లాడేందుకు అవకాశం రాని ప్రతిపక్షపార్టీల సభ్యులు ‘మీడియా పాయింట్’లో మా ట్లాడేందుకు తహతహలాడుతుంటారు. మీడియా పాయింట్లో మా ట్లాడితే అక్షరం పొల్లుపోకుండా ఎలక్ట్రానిక్, ప్రిం ట్ మీడియా ద్వా రా తమ అభిప్రాయా లు జనానికి చేరతాయన్నది వారి ఆశ. సభలోపల మాట్లాడితే- ఇక ఆపేయండని చైర్మన్, స్పీకర్ అస్తమానం బెల్ కొడుతుంటారు. మీడియాపాయింట్లో ఈ గొడవలేవీ ఉండవు.