S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/31/2017 - 22:43

శ్రమ విలువైనది.. శ్రమ సంపద.. ప్రాచీనకాలం నుండీ మానవుడు శ్రమతోనే మనుగడ సాగిస్తున్నాడు. రాతియుగం నుండీ మనిషి శ్రమపడకుండా చెట్లనుండి దొరికిన కాయలను, భూమిలో లభించిన దుంపలనూ తింటూ కాలక్షేపం చేసుంటే, ఈనాడు కూడా అలాగే వుండేవారు. మేథస్సుతో కష్టపడి పనిచేసే శరీర నిర్మాణం మనిషికుంది. మనిషి శ్రమనుండే ఇంతటి వికాసము, నాగరికత నిర్మించబడ్డాయి. శ్రమతోపాటు శరీరానికి విశ్రాంతి కూడా అవసరం.

12/31/2017 - 00:37

ఏ దేశానికైనా, ఏ ప్రజకైనా, ఏ వ్యక్తికయినా - గతంలేని వర్తమానం - ఉండదుగదా? ఎప్పుడో ఒకసారి, దాని అవసరం కలుగుతుంటుంది, అది తప్పదు. మన వ్యవహారమే తీసుకుందాం. మనకు స్వతంత్రం లభించి, కేవలం 70 సంవత్సరాలే అయింది. ఒక్కటి, నిజం. మనం తరతరాలబట్టీ, స్వతంత్రంగానే ఉన్నాం. ఎన్ని ఒడుదుడుకులొచ్చినా, శాశ్వత ప్రాతిపదికమీద, దేశ విభజనలను ఎరగం. విదేశస్థులు దండయాత్రలు చేశారు.

12/30/2017 - 01:00

తెలుగుభాష పండుగను దిగ్విజయంగా నిర్వహించారు. తెలంగాణ కీర్తిని తెలుగు ప్రపంచ మహాసభల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. స్వయంగా కవి, రచయిత, విద్యావేత్త అయిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తుండడం అదృష్టమని చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ విధానమో, అధికారుల తప్పుడు సమాచారమో తెలియదు కానీ గత మూడు సంవత్సరాలుగా తెలంగాణలో భాషా పండిత శిక్షణ కళాశాలలు మూసివేశారు.

12/27/2017 - 21:23

తరగతి గది లేత మనసుల గుడి.. లేత మనుషుల గుడి. ఇప్పటివరకు మనం పలకాబలపంతో చదువు మొదలుపెట్టాం. ఈనాడు లేత మనసుల కలలను ఆవిష్కరిస్తున్నారు. పాఠశాలకు పలకాబలపంతో రావడం లేదు. కానీ ఎన్నో వేలకొద్దీ భావాలతో ఎగురుకుంటూ పసిపిల్లలు మన తరగతి గదిలోకి ప్రవేశిస్తున్నారు. వారికి అక్షరాభ్యాసం కాలేదు. ఏ మంత్రులు దిద్దించలేదు. కానీ మనసునిండా ఎన్నో భావాలు ఏర్పడ్డాయి.

12/27/2017 - 00:58

న్యాయంగా ఉపఎన్నిక గురించి మాట్లాడటానికేం ఉండదు. యధాలాపంగా అధికారపక్షం గెలిచేస్తూ ఉంటుంది. ఇంకా అధికారంలో ఉన్న పక్షంవైపు ఉంటే పోయేదేముంది అని ఓటర్లు భావించడం వల్ల కావొచ్చు. ప్రభుత్వ వర్గాల సహకారం వల్ల, చేతిలో ఉండే వనరుల వల్ల అధికారపక్షం వైపే త్రాసు మొగ్గుచూపుతుంది. ఇక తమిళనాడులో ఆరేకేనగర్ ఉపఎన్నిక అధికారపక్షం దేవతగా కొలిచే జయలలిత మరణం వల్ల వచ్చింది.

12/25/2017 - 23:11

‘‘విద్య అంటే అత్యంత ప్రధానమైన మూలభూత తత్వాన్ని, మన కళ్ల ఎదుటనున్న సత్యాన్ని యథాతథంగా చూడగల సామర్థ్యం - జీవిత పరమార్ధాన్ని, దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటూ మన మనసులో నుండి ప్రతిఫలాపేక్షను తొలగించుకోవడం విద్యయొక్క పరమ ప్రయోజనం’’ అన్నారు ప్రముఖ విద్యాతత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి.

12/24/2017 - 00:40

పుట్టిన క్షణం నుంచి మరణించేవరకూ ప్రతి ఒక్కరూ వినియోగదారుడే. నగదు చెల్లించి వస్తువులను, సేవలను ఉపయోగించే ప్రతి ఒక్కరూ వినియోగదారుడే. అయితే కొలతలు, కల్తీ, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత హామీలు, ఆశలు రేకెత్తించే దృశ్య ప్రకటనలతో వినియోగదారులు నిత్యం మోసపోతున్నారని తెలిసిన నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ వినియోగదారుల చట్టాన్ని రూపొందించాడు. భారత్‌లో 1986లో ఈ చట్టం రూపుదిద్దుకుంది.

12/22/2017 - 23:53

భారత ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాత్యుడు, ఒకేఒక తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న జన్మించి, 2004 డిసెంబర్ 23న మరణించారు. పివిగా లబ్దప్రతిష్ఠులైన ఆయన బహు భాషావేత్త, రచయిత. స్నాతకోత్తర న్యాయశాస్త్ర పారంగతుడు. అపరచాణుక్యునిగా పేరొందారు.

12/20/2017 - 21:34

శిశువుకు మాటలు రాగానే ఎందుకు? అనే ప్రశ్న మొదలవుతుంది. ప్రశ్నించడం ఒకరు నేర్పేది కాదు. అది సహజసిద్ధమైంది. ఆకాశాన్ని చూస్తాడు. ఈ చుక్కలు ఎట్లా వెలుగుతున్నాయని ప్రశ్నించుకుంటాడు. ఆకాశం నీలిరంగుగా ఎలా ఉంది? ఎందుకు ఉంది? అన్న ఊహల్లోకి పోతారు. శరీరంపై ఈ పుట్టుమచ్చలు ఎలా వచ్చాయని ప్రశ్నించుకుంటారు. కాళ్లు లేని పాము చెట్టు ఎలా ఎక్కుతుందని తండ్రిని అడుగుతాడు.

12/20/2017 - 01:13

మానవాళి ముందున్న ప్రధాన సమస్యలలో వాయుకాలుష్యం ఒకటి. మనుషులకే కాదు జీవరాశి మనుగడకు ఇది హాని కలిగిస్తోంది. పార్టికిల్ పొల్యూషన్ లేదా పార్టిక్యులేట్ మేటర్ (పి.ఎం) అనేది గాలిలో తేలియాడే కణరూపద్రవ్యం. ఇది సూక్ష్మ ఘన, ద్రవ కణాల మిశ్రమం. ఇది వాయు కాలుష్యానికి సూచిక. ఇది సహజంగా లేదా మానవకారకంగా ఏర్పడుతుంది. ఈ మిశ్రమం వివిధ పరిమాణాలలో ఉంటుంది.

Pages