S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/09/2017 - 00:01

తెలంగాణలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణించే ఇసుక లారీలు అమాయక ప్రజల పాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మహదేవ్‌పూర్ ఇసుక క్వారీల నుండి ప్రతిరోజూ సుమారు ఐదువేలకు పైగా ఇసుక లారీలు పరకాల, గూడెప్పాడ్, హన్మకొండల మీదుగా హైదరాబాద్‌కి వెళ్తుంటాయి. మితిమీరిన వేగంతో లారీలు వెళ్తున్నందున ప్రమాదాలు జరుగుతూ నిత్యం ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు.

08/07/2017 - 23:27

మన దేశంలో చేనేత రంగం సంక్షోభం ఈనాటిది కాదు. ఆధునిక సమాజ పురోగమనంలో యాంత్రీకరణ మూలంగా- సంప్రదాయ జ్ఞానం, ఉత్పత్తులు నిరాదరణకు గురవుతున్నాయి. సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా ఆనాడు బ్రిటిష్ పాలకులు చేనేత పరిశ్రమ నడ్డివిరిచారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరను నేసారు. వేలి ఉంగరంలో దూరిపోయే చీరలను తయారు చేసి ఆశ్చర్యపరిచారు.

08/05/2017 - 02:18

చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం మంచి ఫలితాలు ఇవ్వాలంటే- కేవలం నినాదాలు చేస్తే చాలదు.. మన వస్తు ఉత్పత్తి సంస్థలు, విక్రేతలు కొంత లాభాపేక్ష తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ ధరలకు వాటిని విక్రయించాలి. సామాన్య ప్రజానీకం అవసరం తీరితే చాలు అనుకుని సహజంగా వస్తువుల నాణ్యత కంటే చౌక ధరలకే మొగ్గు చూపుతారు. ప్రపంచ మార్కెట్‌లో చైనా దూసుకుపోవడానికి ఇదే ముఖ్య కారణం.

08/03/2017 - 00:15

తరగతి గది రెండు చైతన్యరాశుల కూడికే గానీ ఇందులో ఇచ్చేవారు ఒకరు, తీసుకునే వారు ఇంకొరు అని ఎవరూ లేరు. ఇద్దరూ నేర్చుకునేవారే. తరగతి గది ఒక అధ్యయన మందిరం. ఇది ఒకరికి ఒకరు దానం చేసుకునే క్షేత్రం కాదు. జ్ఞానం వేరు, సమాచారం వేరు. విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎంత అవసరమో, ఉపాధ్యాయునికి కూడా విద్యార్థి అంతే అవసరం. ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటేనే జ్ఞాన ఉత్పత్తి జరుగుతుంది.

08/02/2017 - 02:53

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న నేతలకు ఏ సమస్యలూ పట్టడం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లను పెంచుకొనేందుకే తెరాస, తెదేపా అధినాయకత్వాలు ఆరాటపడుతున్నాయి. గత కొద్దికాలంగా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు అధికం కావడంతో ఎమ్మెల్యే సీట్లను పెంచడం అనివార్యమని అధికార పార్టీల నేతలు భావిస్తున్నారు.

08/02/2017 - 02:52

అందరూ ఊహించినట్టుగానే నితీశ్ కుమార్ బిహార్ సిఎం పదవికి రాజీనామా చేసి, మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ప్రత్యర్థుల బలహీనతలను వాడుకొని రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలలో తన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో ప్రధాని మోదీ ఇలా రాజకీయం చేశారు. రాజకీయంగా మోదీ వ్యవహరించిన పద్ధతి సరైనది కావచ్చు. నైతికంగా గీత దాటారనే విషయం సుస్పష్టం.

08/01/2017 - 00:19

కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో అసహనం పెరిగిపోయింది. ఈ అసహనం ఇందిరాగాంధీతో మొదలైందనిపిస్తుంది. ఆవిడ మొదటి నుండి ‘జగమొండి’ అని పేరుపొందారు. ప్రజాస్వామ్యంలో కోర్టులకు ప్రత్యేక గౌరవం ఉంది. శాసనసభ్యులు గానీ, మంత్రులు గానీ ‘లక్ష్మణరేఖ’ దాటితే దేశానికి న్యాయస్థానాలే దిక్కు. ఇందిరాగాంధీకి కోర్టు తీర్పులపై నమ్మకం లేదు.

07/27/2017 - 00:44

గొప్ప పనులు చేసే మహనీయులే గొప్ప నాయకులు కాదు. గొప్ప పనులు చేసే వారిని తయారుచేసేవాడే గొప్ప లీడర్ అవుతాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు లీడర్‌గా మారి తన ఫిలాసఫీని, తన ఆదర్శాలను విద్యార్థుల ముందు పెట్టి వారిని గొప్ప ఆవిష్కర్తలుగా తయారుచేస్తాడు. ఉపాధ్యాయుడు ‘లీడర్’గా మారాలంటే తన ఫిలాసఫీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ‘నేనేందుకు చదువు చెప్పుతున్నాన’నే ప్రశ్న వేసుకోవాలి.

07/23/2017 - 00:38

(పౌరహక్కుల ఉద్యమం ఆరంభమై 55 ఏళ్లు నిండిన సందర్భంగా)
*

07/22/2017 - 00:10

ఎట్టకేలకు ఉపాధ్యాయుల ‘ఏకీకృత సర్వీసు రూల్స్’కు రాష్టప్రతి ఆమోద ముద్ర లభించింది. ఇక అమలులోకి రావడమే ఆలస్యం. ఈ విధానం అమలులోకి వస్తే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. పం చాయతీరాజ్ పరిధిలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ. వారికి రాజకీయ పలుకుబడి ఎక్కువే. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య స్వల్పం. వారికి రాజకీయ అండలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

Pages