S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

03/19/2017 - 09:18

ఆదివారం తీరుబడిగా.. పాత ఆల్బం ఏదో తిరగేస్తుంటే చిన్ననాటి ఫోటోలను చూసి ఆనాటి బాల్యపు స్మృతుల్లోకి మది ప్రయాణించింది. అవి ఎప్పటికి పాతబడని ఊహలు! మదిని రసాలూరించే ఆ పాత మధురాలు! నిజమే కదూ! ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏవైనా వాటి చుట్టూ మనం పోగు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. వాటితో అల్లుకున్న మన స్మృతుల పరిమళం గొప్పది.

03/12/2017 - 02:41

ఉదయం తొమ్మిదయింది..
సెల్ ఫోన్ మ్రోగింది..
రెస్పాండ్ కాకుండా మళ్లీ నిద్రలోకి జారుకున్నా..కాసేపటికి మళ్లీ ఫోన్ మ్రోగింది. ఏంటీ పడుకోనీయకుండా ఏమిటీ ఈ గోల అని..నాలో నేనే గుణుగుతూ..నెంబర్ చూడకుండానే ఫోన్ ఎత్తి ‘హలో’ అన్నాను.
‘హలో డియర్’ అన్న ఆత్మీయ పలకరింపు..కమ్మని స్వరం..నన్ను ఏక బిగిన నిద్రమత్తు వదిలేలా చేసింది.

03/12/2017 - 02:29

నాలోని అనుభూతులు
నాలోని ఆలోచనలు
ప్రశాంతత కోరుకుంటున్నాయి
ప్రలోభాలకు లొంగకుండా
ప్రమోదాలతో పొంగిపోకుండా
విశ్వాసమనే శ్వాసతో
అనంతమైన ఆకాంక్షలతో
ప్రతీక్షణం తలపోస్తుంటున్నాయి
విశాల భావాలను విరబూయిస్తూ
అభ్యుదయపథాన పురోగమిస్తూ
ప్రతీ అడుగులోనూ జాగ్రత్తదపడుతూ
ప్రతీ ఆలోచనలోనూ
ప్రపూర్ణతని కోరుకుంటున్నది

03/12/2017 - 02:17

అనుభూతిని పంచేదే అసలైన కవిత్వమని భావించే ప్రముఖ పద్యకవి శ్రీ జి.వి.కృష్ణమూర్తి వృత్తిరీత్యా ఉద్యోగవిరమణ చేసిన ఉన్నత పాఠశాల ప్రధానచార్యులు. గణితశాస్త్ర బోధకులుగా అందరి మన్నన పొందిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకున్నారు. ఛందోబద్ధ పద్య రచన చేయడంలో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న ఆయన రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్‌కు చెందినవారు.

03/05/2017 - 07:49

ఏడు పదుల వయసుదాటిన కమలమ్మ వృద్ధాప్యంలో..తన సొంతింట్లో ఓ మారుమూల గ్రామంలో జీవనం గడుపుతోంది. ఆ గ్రామంలోని మనుషులందరూ ఆమెను ఆప్యాయంగా నానమ్మ, అమ్మమ్మ అని పిలుస్తుంటారు. బాగా చదువుకోక పోయినా రాయడం, చదవడం తెలుసు..దశాబ్దాలుగా ఆ ఊళ్లో ఉంటున్న ఆమెకు సొంత ఇల్లే లోకం.. తనకున్న నలుగురు కొడుకులు పట్టణాల్లో స్థిరపడ్డారు. భర్త చనిపోయి..నలభై ఏళ్లు కావస్తోంది.

02/25/2017 - 23:21

అప్పటికే ఆలస్యమైందనుకుంటూ వడివడిగా నడుస్తూ సునీత బడిలోకి చేరింది. యుకేజీ చదువుతున్న దినేష్‌కు లంచ్ టైంలో అన్నం తినిపించడానికి ఇంకో నాలుగైదు నిమిషాల సమయమున్నట్లుంది. పిల్లలకు భోజనం పెట్టడానికి అన్నపూర్ణమ్మలు ఒక్కొక్కరు బడిలోకి చేరుతున్నారు. మూడు గంటల సేపు చదివి చదివి ఆకలితో అలమటిస్తున్నట్లుంది బడి.

02/25/2017 - 23:19

పేజీలు: 108, వెల : 50/-
ప్రతులకు: ప్రధానోపాధ్యాయులు
జిల్లా పరిషత్ హైస్కూల్
ముస్తాబాద్-505404
రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్.నం.9440676048
**

02/25/2017 - 23:14

నీ మృదు మధుర స్వరం
తాత్కాలికమే సుమా!
ఎప్పుడు అది మూగబోతుందో
పెన వేసుకున్న
ఆత్మీయతానుబంధాలు
ఏవౌతాయో ఎవరికి ఎరుక?
ఇప్పుడున్న రహదారులన్నీ
మృత్యు లోగిళ్లవుతుంటే..
బయటికి వెళ్లిన వారు
తిరిగి ఇంటికి చేరుతారన్న
భరోసాలేదు!
నీ ఆశను శ్వాసను.
విశ్వంతరాల్లో
ఎప్పుడు ఏకం చేసుకుంటాయో తెలియదు!
నీ ప్రయాణం

02/25/2017 - 23:08

సాహిత్య పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతలను పెంచుతాయని భావించే ప్రముఖ కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం పొందారు. అంతేగాక..అనేక సాహితీ సంస్థల నుండి పురస్కారాలను అందుకున్నారు.

02/19/2017 - 03:30

ఆత్మహత్య చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. ఫ్యాషన్ కూడా అయిపోయింది. ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకునే యువతీయువకులు, పరీక్ష తప్పామని ప్రాణాలు తీసుకునే విద్యార్థులు, వ్యవసాయంలో నష్టపోయామని ప్రాణత్యాగం చేసే రైతన్నలు, ఒకరేమిటి, ప్రాణాలంటే త్రుణప్రాయం అయిపోయాయి ఈ రోజుల్లో.

Pages