S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/18/2017 - 22:20

వాషింగ్టన్, అక్టోబర్ 18: అంగారక గ్రహం ఉపరితలంపై ఒక దశలో నీటి ప్రవాహం జరిగిందన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ అరుణ తార ఉపరితలం ఘనీభవ దశలో ఉన్నప్పటికీ కూడా నీటి ప్రవాహం జరిగి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

10/18/2017 - 03:15

వాషింగ్టన్, అక్టోబర్ 17: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (2016) డెమొక్రాట్స్ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రండ్, ప్రత్యర్తి హిల్లరీ క్లింటన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ హిల్లరీ క్లింటన్ పోటీ చేస్తుందేమో. అదే జరిగితే నామీదే పోటీ చేయాలి.. అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు.

10/18/2017 - 03:10

జెనీవా, అక్టోబర్ 17: మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి చేరుకున్న రోహింగ్యా శరణార్థుల సంఖ్య ఒక్క ఆగస్టులోనే సుమారు 5.8 లక్షల వరకూ ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇంకా సరిహద్దుల్లో వేలాది శరణార్థులు పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. గతవారం విడుదల చేసిన లెక్కలతో ప్రస్తుత అంకెను పోలిస్తే, ఒక్కవారంలోనే అదనంగా 45 వేలమంది శరణార్థులు బంగ్లాదేశ్‌లోకి చేరినట్టు తెలుస్తోందని పేర్కొంది.

10/18/2017 - 03:08

ఐరాస, అక్టోబర్ 17: దక్షిణ సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 50 మంది సభ్యులుగల భారత శాంతి రక్షక దళానికి ఐక్యరాజ్య సమితి పతకం లభించింది. అనిశ్చిత పరిస్థితులో కల్లోలంగా మారిన దక్షిణ సూడాన్‌లో ప్రజలకు భద్రత కల్పించడం, శాంతిని నెలకొల్పడంతో ఇండియన్ పీస్ కీపింగ్ టీమ్ (ఐపికెఎఫ్) అంకితభావంతో పనిచేస్తోంది. వారి సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ఇచ్చారు.

10/18/2017 - 03:07

లాహోర్, అక్టోబర్ 17: ముంబయిపై ఉగ్రదాడికి సూత్రధాని హఫీజ్ సరుూద్ గృహనిర్బంధాన్ని పంజాబ్ ప్రభుత్వం పొడిగించనుంది. ప్రజాభద్రతా చట్టం కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జనవరి నుంచి జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ తదితరులు గృహనిర్బంధంలో ఉంటున్నారు.

10/17/2017 - 18:42

సిరియా అంతర్యుద్ధం ఆగేదెప్పుడో తెలియదు కాని ఆ దేశ పౌరుల స్థితి మాత్రం దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా మారింది. ఇటు సిరియా దళాలకు, అటు ఐసిస్ మిలిటెంట్లకు మధ్య వారాల తరబడి జరుగుతున్న కాల్పుల్లో బాల్యం వాడిపోతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న తల్లిదండ్రులు, దారి తప్పిన చిన్నారు లెందరో దిక్కూ మొక్కూ లేక విలవిల్లాడుతున్నారు.

10/17/2017 - 18:40

ఐక్యరాజ్య సమితి ఎన్ని హెచ్చరికలు చేసినా, ముస్లిం మైనారిటీల ఊచకోతను ఆపాలంటూ ప్రపంచ దేశాలు తీవ్ర స్వరంతో హెచ్చరించినా మైన్మార్‌లోని రోహింగ్యాల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. మైన్మార్ నుంచి బంగ్లాకు వేలాదిగా తరలిపోతున్న రోహింగ్యాల కోసం శరణార్థ శిబిరాలు ఏర్పాటు చేసినా అవేమీ పనిచేయడం లేదు. సాయంకోసం దైన్యంతో దీనవదనంతో ఓ చిన్నారి ఎదురు చూపులే ఇందుకు నిదర్శనం.

10/17/2017 - 02:34

కోక్స్‌బజార్, అక్టోబర్ 16: బౌద్ధమత గుంపుల దాడులతో ప్రాణాలకు ముప్పు, బతికి బయటపడ్డా చంపేస్తున్న ఆకలి.. ఇదీ మైన్మార్‌లోని రోహింగ్యా ముస్లింల దీన పరిస్థితి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మైన్మార్ నుంచి పారిపోవడం మినహా రోహింగ్యాలకు మరో అవకాశం లేకుండా పోయింది.

10/17/2017 - 02:31

మొగదిషు, అక్టోబర్ 16: కల్లోల సోమాలియా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఓ భయానక బాంబు విస్ఫోటన సంఘటనలో మరణించిన వారి సంఖ్య 276కు చేరింది. అలాగే ఈ ఘటనలో గాయపడినవారి సంఖ్య 300కు పైనే ఉందని, వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దేశ సమాచార శాఖ మంత్రి అబ్దిరహమాన్ ఉస్మాన్ సోమవారం నాడిక్కడ తెలిపారు.

10/16/2017 - 02:38

వాషింగ్టన్, అక్టోబర్ 15: వేగవంతమైన భారత మార్కెట్ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని రుణాల కేటాయింపులను అంతర్జాతీయ ద్రవ్య నిధి సమీక్షించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్ వెళ్లిన జైట్లీ, అక్కడి ఆర్థిక నిపుణుల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Pages