-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
ఔగాడ్వావొ, ఆగస్టు 14: ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఇస్లామిక్ మిలిటెంట్లు బీభత్సం సృష్టించారు. రాజధాని ఔగాడ్వాగొలోని ఓ టర్కీష్ రెస్టారెంట్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 18 మందిన పొట్టనబెట్టుకున్నారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఏడు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. విదేశీ రెస్టారెంట్పై ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఇది రెండోసారి. కాల్పులు తమపనేనని ఇప్పటి వరకూ ఏ సంస్థా ప్రకటించుకోలేదు.
ఫ్రీటౌన్, ఆగస్టు 14: ఆఫ్రికా దేశమైన సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్ను సోమవారం తెల్లవారుజామున భారీ వరదలు ముంచెత్తడంతో కనీసం 312 మంది మృతి చెందగా, 2 వేల మంది నిరాశ్రయలుగా మారారు. మృత దేహాలతో శవాల గదులు నిండిపోవడంతో జనం జాడ తెలియకుండా పోయిన తమ ప్రియతముల కోసం వెతుకుతూ ఉండడం కనిపించింది.
జకార్తా, ఆగస్టు 13: ఇండోనేసియాలోని సుమిత్రా దీవిలో ఆదివారం తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. అయితే దీనివల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారవర్గాలు ప్రకటించాయి. భూకంప తీవ్రతకు ఇళ్లల్లో ఉన్నవారు భయకంపితులయ్యారు. ఉదయం 10.08 గంటలకు సంభవించిన ఈ భూకంపం భూమికి 35 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్టు తెలిపారు.
వాషింగ్టన్, ఆగస్టు 13: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శే్వత జాతీయవాదుల ప్రదర్శన హింసాత్మకంగా మారింది. శే్వతజాతీయ వాదులకు, వారిని వ్యతిరేకించే వారి మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా మరో 19 మంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రంలోని చార్లొట్టీస్విల్లే పట్టణం అట్టుడికిపోయింది.
వాషింగ్టన్, ఆగస్టు 12: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ అన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అమెరికా భూభాగంపై గానీ, మిత్రదేశాలపైగానీ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా అందుకు కిమ్ తీవ్రంగా చింతించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ‘కిమ్, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్ల నుంచి బెదిరింపులకు దిగుతున్నారు.
వాషింగ్టన్, ఆగస్టు 12: అణ్వాయుధాలతో పొంచి ఉన్న ప్రమాద తీవ్రత గురించి అర్ధం చేసుకునేలా పాంగ్యాంగ్ నాయకత్వానికి తోడ్పాటును అందజేయడం ద్వారా ఉత్తర కొరియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించగలదని అమెరికా నావికాదళ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
క్వెట్టా, ఆగస్టు 12: పాకిస్తాన్లోని క్వెట్టాలో శనివారం రాత్రి జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 17మంది మరణించారు. 30మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ఎలా జరిగిందనేది కారణాలు తెలియరాలేదు. ఆర్మీ వాహనానికి సమీపంలోనే పేలుడు జరిగింది. మృతుల్లో 8 మంది జవాన్లు ఉన్నారు. ఘటన తర్వాత క్వెట్టాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
వాషింగ్టన్, ఆగస్టు 12: డోక్లామ్ ప్రతిష్ఠంభన విషయంలో భారత్ ‘ఎంతో పరిణితి చెందిన శక్తి’ మాదిరిగా వ్యవహరిస్తోందని, దీంతో భారత్ ముందు చైనా చిన్నబోతోందని అమెరికాకు చెందిన రక్షణ విభాగ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.
మనీలా, ఆగస్టు 11: ఫిలిప్పీన్స్లో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత కలిగిన భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.28 గంటలకు లియాన్ పట్టణం తీరానికి దగ్గర్లో సముద్రంలో 173 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ప్రభుత్వ అదికారులు తెలిపారు. దీని తీవ్రత 6.2 పాయింట్లుగా యుఎస్ జియాలజికల్ సర్వే అంచనా వేసింది.
ఇస్లామాబాద్, ఆగస్టు 10: తాము ఇచ్చిన తీర్పును కాపాడుకోవాలని, తద్వారా అప్రజాస్వామిక మార్గాల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులను తొలగించకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇటీవల పదవీచ్యుతుడైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశ ప్రజలను కోరారు. పదవీచ్యుతుడైన తర్వాత తన రాజకీయ బలాన్ని చూపించడానికి షరీఫ్ ఇస్లామాబాద్నుంచి తన సొంత పట్టణమైన లాహోర్ దాకా భారీ కాన్వాయ్తో రోడ్డు షో నిర్వహించారు.