S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/13/2017 - 06:24

వాషింగ్టన్, మే 12: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు భారత్, అప్గానిస్థాన్‌లపై దాడులు చేయడానికి పథకాలు సిద్ధం చేసుకుంటున్నాయని అమెరికా ఇంటెలిజన్స్ ఉన్నతాధికారి హెచ్చరించారు. తమ భూభాగంలోని ఉగ్రవాదులను అదుపు చేయడంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైందని కూడా ఆయన స్పష్టం చేశారు.

05/13/2017 - 06:22

కరాచీ, మే 12: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో శక్తివంతమైన బాంబు పేలి 20 మంది మృతి చెం దారు. 35 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సెనెట్ డిప్యూటీ చైర్మన్ వౌలానా అబ్దుల్ గఫూర్ హైదరీ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయ న సల్పంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా మస్టుంగ దర్గాకు ఆయన హాజరయ్యారు. తిరగి వెళ్తుండగా బాంబు పేలుళ్లు సంభవించాయి.

05/13/2017 - 06:20

కొలంబో, మే 12: ప్రపంచవ్యాప్తంగా హింసాకాండ పెరిగిపోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ నేడు కేవలం దేశాల మధ్య ఘర్షణలే కాకుండా ఆలోచనా ధోరణులు, విద్వేషం, హింసాకాండ వేళ్లూనుకోవడం లాంటి కారణాలవల్ల ప్రపంచ సుస్థిర శాంతికి ముప్పు ఏర్పడుతోందని అన్నారు.

05/13/2017 - 05:53

లండన్, మే 12:యునైటెడ్ కింగ్‌డంలోని అన్ని ఆసుపత్రులు శుక్రవారం జరిగిన భారీ సైబర్ దాడితో శుక్రవారం అతలాకుతలమయ్యాయి. ఒక్కసారిగా ఫోన్లు, ఐటి వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. లండన్ సహా అనేక పట్టణాల్లోని ఆసుపత్రులపై రాన్‌సమ్‌వేర్ సైబర్‌దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. కంప్యూటర్లు, ఫోన్‌లు పనిచేయక పోవడంతో చాలా ఆసుపత్రుల ఉంచి రోగుల్ని వెనక్కి పంచేశారు. అనేక చోట్ల అపాయింట్‌మెంట్లు రద్దయ్యాయి.

05/13/2017 - 01:03

డికోయ (శ్రీలంక), మే 12: ‘చాయ్ (టీ)తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శ్రీలంక పర్యటనకు వచ్చిన మోదీ శుక్రవారం సెంట్రల్ ప్రావిన్స్‌లోని తేయాకు తోటల పెంపకందారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సిలోన్ టీ’ని ఆయన ప్రశంసిస్తూ, ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని అన్నారు.

05/13/2017 - 01:03

డికోయ (శ్రీలంక), మే 12: శ్రీలంకలోని సింహళీయులు, తమిళులు తమ మధ్య ఐక్యతను, సామరస్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల జీవన పరిస్థితులను మెరుగు పరచడానికి లంక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు భారత్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

05/12/2017 - 05:21

కొలంబోలోని గంగరామయ్య బౌద్ధ ఆలయాన్ని గురువారం సందర్శిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, పక్కన శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘె

05/12/2017 - 00:20

ఇస్లామాబాద్, మే 11: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ మేరకు ఇక్కడి ఇండియన్ డిప్యూటీ హైకమిషనర్ (డిహెచ్‌సి) జెపి సింగ్‌కు సమన్లు అందజేశారు. పాక్ విదేశాంగశాఖ (ఎస్‌ఎ, సార్క్) డైరెక్టర్ జనరల్ మహ్మద్ ఫైజల్ డిహెచ్‌సిని కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

05/11/2017 - 03:00

శ్రీలంకలో జరగనున్న వేసక్ వేడుకల సందర్భంగా కొలంబో తీరంలో కొలువుదీరిన
బుద్ధుని సైకత శిల్పం. ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ దీనిని తీర్చిదిద్దారు

05/11/2017 - 02:24

ఇస్లామాబాద్, మే 10: షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఓ)శిఖరాగ్ర భేటీ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాల్గొనే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. భారత్ ఆసక్తి కనబరిస్తే.. మోదీతో నవాజ్ షరీఫ్ సమావేశమయ్యే అవకాశంపై దృష్టి పెడతామని పాక్ దౌత్యవేత్త సర్తాజ్ అజీజ్ తెలిపారు.

Pages