-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
వాటికన్ సిటీ, డిసెంబర్ 25: క్రైస్తవుల పవిత్రమైన పండుగ క్రిస్మస్ను పురస్కరించుకొని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం వాటికన్ సిటీలో చేసిన ప్రసంగంలో ఉగ్రవాద బాధితుల కుటుంబాలను గురించి ప్రస్తావించారు.
ఇస్లామాబాద్, డిసెంబర్ 24: పాకిస్తాన్ అధ్యక్షుడు మెమ్నూన్ హుస్సేన్పై ఓ చిత్రమైన కేసు దాఖలైంది. దేశాధ్యక్షుడు తన ప్రసంగాన్ని కాపీ కొట్టారంటూ 11 ఏళ్ల బాలుడు కోర్టును ఆశ్రయించాడు. ఆరో తరగతి విద్యార్థి మహ్మద్ సబీల్ హైదర్ తరఫున అతడి తండ్రి నసీం అబ్బాస్ నజీర్ ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు.
వాషింగ్టన్, డిసెంబర్ 24: అమెరికా వచ్చే సంవత్సరానికి రూపొందించిన రక్షణ బడ్జెట్ భారత్తో భద్రతా సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తోంది. 618 బిలియన్ డాలర్లతో కూడిన అమెరికా రక్షణ బడ్జెట్ బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం సంతకం చేశారు. ఈ జాతీయ రక్షణ ధ్రువీకరణ చట్టం (ఎన్డిఎఎ) 2017లో పాకిస్తాన్కు చేసే ఆర్థిక సాయంపై దాదాపు సగం నిధులకు అమెరికా నాలుగు షరతులు విధించింది.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులు శాంటా టోపీలను ధరించి
ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర చర్చి వద్ద ప్రార్థనల కోసం బారులు తీరిన దృశ్యం
వలెట్టా, డిసెంబర్ 23: కొన్ని గంటల పాటు తీవ్ర స్థాయిలో ఉత్కంఠ రేకెత్తించిన లిబియా వాణిజ్య విమానం హైజాక్ ఉదంతం చివరికి సుఖాంతం అయింది.
వాషింగ్టన్, డిసెంబర్ 23: అణ్వస్త్రాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఈ విషయంలో అమెరికా విధానం తీవ్రంగా మారబోతోందన్న సంకేతాలను సూచిస్తోంది. అణ్వస్త్రాలను తగ్గిస్తూ చివరకు నిర్మూలించాలన్న ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా పాలనా యంత్రాంగం అనుసరించిన వైఖరికి వ్యతిరేకంగా ట్రంప్ వైఖరి ఉన్నట్లు ఈ ట్వీట్ వెల్లడిస్తోంది.
టుట్లెపెక్, డిసెంబర్ 21: మెక్సికో సిటీ శివార్లలోని టుట్లెపెక్లో దేశంలోనే అతిపెద్ద బాణాసంచా మార్కెట్లో సోమవారం జరిగిన భారీ పేలుడులో కనీసం 29 మంది చనిపోగా, 70 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకోసం బాణాసంచా కొనుగోలు చేయడానికి పెద్దసంఖ్యలో జనం ఈ మార్కెట్కు వచ్చినప్పుడు ఈ పేలుడు సంభవించింది.
ఇస్లామాబాద్, డిసెంబర్ 21: భారతదేశం పాకిస్తాన్ పట్ల శత్రుత్వానికి స్వస్తిచెప్పి వందలాది కోట్ల డాలర్ల వ్యయంతో చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో చేరడంద్వారా తమతో కలిసి దాని ప్రయోజనాలను పొందాలని పాకిస్తాన్కు చెందిన ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు పిలుపునిచ్చారు.
వాషింగ్టన్, డిసెంబర్ 20: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ధ్రువీకృతమైంది. అత్యంత కీలకమైన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ఆయన సంపాదించుగోలిగారు. రిపబ్లికన్ సభ్యులను రెచ్చగొట్టి ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేసేలా చేసేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
బెర్లిన్, డిసెంబర్ 20: జర్మనీ రాజధాని బెర్లిన్లో క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ చేయడానికి మార్కెట్కు వచ్చిన వారిని మృత్యువు ఓ ట్రక్కు రూపంలో కబళించింది. నగరం నడిబొడ్డున రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లోకి ఓ ట్రక్కు దూసుకు రావడంతో కనీసం 12 మంది చనిపోగా, మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.