-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
ఢాకా: బంగ్లాదేశ్లోని గజిపూర్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున టెంపకో ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బాగ్దాద్: సెంట్రల్ బాగ్దాద్లోని ఓ షాపింగ్ మాల్ వద్ద శుక్రవారం అర్థరాత్రి రెండు కారు బాంబులు పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో బక్రీద్ ఉండడం, వారాంతం కావడంతో షాపింగ్ మాల్ అర్థరాత్రి కూడా తెరిచే ఉందని పోలీసులు చెప్పారు.
సియోల్, సెప్టెంబర్ 9: అతిపెద్ద అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించుకుంది. ఒక నూక్లియర్ వార్హెడ్ను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రభు త్వం ధ్రువీకరించింది. ఉత్తర కొ రియా తాజాగా మరో అణు పరీక్ష నిర్వహించినట్లు దక్షిణ కొరియా మీడియాలో కథనాలు రాగా ఉత్తర కొరియా ప్రభుత్వం వాటిని ధ్రువీకరించింది.
సూళ్లూరుపేట, సెప్టెంబర్ 8: వరుస రాకెట్ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్ ) ప్రపంచ దేశాలలోనే మంచి గుర్తింపు సంపాదించుకొంది. ఇక్కడి నుండి ప్రయోగించే ప్రతి రాకెట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది కావడం ఒకటైతే వినూత్న ప్రయోగాలు చేపట్టి మన శాస్తవ్రేత్తలు ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్నారు.
వియంటియానె, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమై పౌర అణు సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వాతావరణ మార్పు సహా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో తక్షణ ప్రాధాన్యత అంశాలపై చర్చలు జరిపారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఈ ఇరువురు నాయకులు లావోస్ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు.
లండన్, సెప్టెంబర్ 8: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో విమాన ప్రమాదంలోనే మరణించారని జపాన్ ప్రభుత్వం ధ్రువీకరించినట్లు బ్రిటన్కు చెందిన ఒక వెబ్సైట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి అమెరికాకు జపాన్ 1945లో ఇచ్చిన నివేదిక మధ్యంతర నివేదిక అని, తుది నివేదికను 1956లో భారత ప్రభుత్వానికి అందించారని బోస్ఫైల్స్.ఇన్ఫో పేర్కొంది.
వియెంటియాన్, సెప్టెంబర్ 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశాల వేదికపైనుంచి పాకిస్తాన్పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మా పొరుగు దేశం ఒకటి ఉగ్రవాదాన్ని సృష్టించి, ఎగుమతి చేస్తోంది’ అంటూ ఆయన పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే, అది అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టారు.
వియంటియానె ( లావోస్) : లావోస్ రాజధాని వియంటియానెలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గత రెండేళ్లలో మోదీ, ఒబామా భేటీ అవడం ఇది ఎనిమిదోసారి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇటీవల చైనాలో జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులోనూ ఒబామాతోప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు.
జార్జియా: రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు కారోల్టన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా గాల్లోనే ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. ఒక విమానాన్ని దించుతున్న సమయంలో మరో విమానం కూడా అదే దిశలో వచ్చి ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఒక విమానంలో మహిళా ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి ఉండగా, మరో విమానంలో 79 ఏళ్ల లిండ్సే ఉన్నారు.
వియన్టియాన్, సెప్టెంబర్ 7: ఉగ్రవాద నిరోధన, పౌర అణు ఇంధన సహకారం, వ్యాపార వాణిజ్య సహకారం విస్తృత స్థాయిలో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, జపాన్లు నిర్ణయించాయి. ఆసియాన్ ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షింజో అబేతో దాదాపు 45 నిముషాల పాటు చర్చలు జరిపారు.