-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
న్యూయార్క్, జూలై 23: ఐరాస భద్రతా మండలి ఆంక్షల కమిటీ పనిచేస్తున్న తీరు ఎంతమాత్రం వాస్తవికంగా లేదని భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కొన్ని దేశాల సంకుచిత ప్రాధాన్యతలకే ఈ ఆంక్షల కమిటీలు కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టమవుతోందని తెలిపింది.
క్లీవ్లాండ్, జూలై 23: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దశలోనూ వీసా నిరాకరించేందుకు అప్పటి బుష్ ప్రభుత్వం ప్రయత్నించలేదని మాజీ అధికారి ఒకరు తెలిపారు. 2015లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బుష్ ప్రభుత్వం ఆయనకు వీసా నిరాకరించినట్టుగా వచ్చిన కథనాలను స్టీఫెన్ ఏక్స్ తిరస్కరించారు. అప్పట్లో దేశ ఉపాధ్యక్షుడు డిక్చెనికి ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు.
బీజింగ్: వర్షాల కారణంగా చైనాలో 78మంది మృతి చెందగా, 91మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేవారమని బాధితులు అంటున్నారు.
దిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరం మాల్లో కాల్పుల ఘటన మృతుల్లో భారతీయులెవరూ లేరని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. ఓ మాల్లోని రెస్టారెంట్లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన 18ఏళ్ల దుండగుడు కూడా తర్వాత తనను తాను కాల్చుకుని మృతిచెందాడు.
బెర్లిన్, జూలై 22: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఓ ఆగంతకుడి కాల్పుల్లో పది మందికి పైగా మరణించినట్టు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒలిపింక్ స్టేడియం సమీపంలో ఉన్న మ్యూనిచ్ షాపింగ్ సెంటర్లో ఉన్నవారిపై అతడు కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల అనంతరం అతడు మెట్రో స్టేషన్ దిశగా పరుగులు పెట్టినట్టుగా ది బిల్డ్ అనే పత్రిక తెలిపింది.
బీజింగ్, జూలై 22: దక్షిణ చైనా సముద్రంపై తన హక్కులను తోసివేస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు చెందిన ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చైనా మిలిటరీ తాజాగా పలు కొత్త ఆయుధాలను ఆవిష్కరించింది. వీటిలో సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయి.
కాబుల్: కుందుజ్ ప్రావిన్స్లో తాలిబన్ తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య జరిగిన అల్లర్లలో 18 మంది తిరుగుబాటు దారులు, నలుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఖాలా-ఇ-జల్ జిల్లాలో తిరుగుబాటుదారులపై భద్రతా బలగాలు దాడి చేశాయి.
ఇస్లామాబాద్: కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో తన కుమార్తె కందీల్ బలోచ్ను హతమార్చిన తన కుమారుడు వసీంను కాల్చి చంపేయాలంటూ బలోచ్ తండ్రి అన్వర్ అజీం పేర్కొనడం ఇపుడు పాకిస్తాన్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియా సెలబ్రిటీగా, మోడల్గా రాణిస్తున్న బలోచ్ తమ కుటుంబం పరువు తీసిందని ఆమెను సోదరుడు వసీం గొంతు నులిమి ఇటీవల హత్య చేసిన సంగతి తెలిసిందే. పాక్లో ఇటువంటి పరువు హత్యలు సర్వసాధారణమే.
రియాద్, జూలై 21: ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని కుదిపేస్తున్న ‘పోకెమాన్’కు సౌదీ అరేబియాలో బ్రేక్ పడింది. ఈ ఆట ఇస్లాంకు వ్యతిరేకమని, దీన్ని ఆడకూడదంటూ సౌదీ మత పెద్దలు ఫత్వా జారీచేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రపంచమంతా పోకెమాన్ వెంట పరుగులు పెడుతున్న నేపథ్యంలో సౌదీ వాసులకు ఇది పిడుగులాంటిదే.
బీజింగ్, జూలై 21: భారీ వర్షాలు చైనాను కుదిపేస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వందమందికి పైగా మృతి చెందడమో, గల్లంతు కావడమో జరిగిందని అధికార వర్గాల సమాచారం. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.