-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
బాటన్ రోజ్, జూలై 17: లూసియానా రాష్ట్రం బాటన్ రోజ్ పట్టణంలో ఆదివారం ఓ సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. ఆగంతకుడు ఆకస్మికంగా జరిపిన ఈ మెరుపుదాడిలో పలువురు అధికారులూ గాయపడ్డారని నగర మేయర్ కిప్ హోల్డెన్ తెలిపారు.
న్యూఢిల్లి:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జిఎస్టి బిల్లు సహా ముఖ్యమైనవాటిని ఆమోదించాలని, ఈ విషయంలో ఎవరికి పేరు వస్తుందన్నది ప్రధానం కాకూడదని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంనుంచి ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఇస్లామాబాద్, జూలై 16: పాకిస్తాన్ మోడల్ ఖాందిల్ బాలోచ్ దారుణ హత్యకు గురైంది. ఆమె సోదరుడే పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్లో బాలోచ్ను హత్యచేశాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించేవారిని ఆమె తీవ్రంగా విమర్శించేది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టుచేస్తూ సంచలన మోడల్గా పేరుతెచ్చుకుంది.
అంకారా, జూలై 16: టర్కీలో అధ్యక్షుడిపై సైన్యం తిరగబడింది. అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి బీభత్సకాండ సృష్టించింది. దేశంలోని అన్ని నగరాల్లో విశృంఖల వీరవిహారం చేసింది. సైనిక ట్యాంకులు విచ్చలవిడిగా వీధుల్లో పెట్రేగిపోయాయి. కాల్పులు, బాంబుల మోతలతో రాత్రంతా జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సివచ్చింది. 250 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడగా 1400 మంది గాయాలపాలయ్యారు.
ఇస్లామిక్ ప్రపంచంలో ఎంతో ఉన్నతభావాలు కలిగిన ఉదారవాద దేశంగా ఉన్న టర్కీలో సైనిక తిరుగుబాటు జరగడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురి చేసింది. అధ్యక్షుడు ఎర్డోగన్ వ్యవహార శైలే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉంది. కొంతకాలంగా టర్కీలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. 1920లో ముస్త్ఫా కెమాల్ పాషా టర్కీని లౌకిక రాజ్యంగా ప్రకటించారు. నేటి నూతన టర్కీ నిర్మాణంకోసం విశేషంగా కృషి చేశారు.
నీస్, జూలై 16: ప్రాన్స్లోని నీస్ నగరంలో శుక్రవారం ట్రక్కు దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముఠా ప్రకటించుకుంది. ఈ మేరకు ఉగ్రవాదులకు చెందిన ‘అముఖ్’ వార్తాసంస్థ తెలియజేసింది. ఐఎస్కు వ్యతిరేకంగా పోరాడాలని సంకీర్ణ దేశాలు పిలుపునిచ్చినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఆ వార్తాసంస్థ తెలియజేసింది. ట్రక్కు దాడి జరిపింది తమ సైనికుడేనని కూడా ఐఎస్ స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూలై 16: హైదరాబాద్లో సంచలనం సృష్టించిన కాంగో (సౌత్ ఆఫ్రికా) మహిళ సింథియా హత్య కేసులో నిందితుడు రూపేష్కుమార్ కస్టడీ ముగిసింది. ఈనెల 4న సింథియాను ఆమె భర్త రూపేష్కుమార్ అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని శంషాబాద్ సమీపంలోని మదనపల్లిలో పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.
అసలే ఉగ్రవాదుల వరుస బాంబు దాడులతో రక్తమోడుతున్న టర్కీ.. ఇప్పుడు ఏకంగా సైనిక తిరుగుబాటుకు అల్లల్లాడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి సగటున నెలకు కనీసం రెండు మానవ బాంబు దాడులతో నిరంతర రుధిరధార పారుతున్న ఈ నాటో కూటమి దేశాన్ని శుక్రవారం రాత్రి అనూహ్యమైన రీతిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో రక్తసిక్తం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 16: నైజీరియాలో అపహరణకు గురైన భారతీయులు శ్రీనివాస్, అనీష్లను ఉగ్రవాదులు విడుదల చేసినట్లు నైజీరియాలో భారత హైకమిషనర్ బిఎన్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్, అనీష్ శర్మలను ఉగ్రవాదులు శనివారం ఉదయం విడుదల చేసినట్లు బిఎన్రెడ్డి ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్కు సందేశం పంపించారు.
ముంబయి: పాకిస్తాన్లో యువతులను, బాలికలను హతమార్చడం దారుణమని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్లో వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ను ఆమె సోదరుడు గఫూర్ హత్య చేయడంతో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇకనైనా మేల్కొనాలని సూచించింది. ఆడపిల్లల సంక్షేమానికి భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘బేటీ బచావ్..