S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/11/2016 - 07:10

దార్-ఎస్-సలామ్, జూలై 10: నాలుగు ఆఫ్రికా దేశాల్లో పర్యటనలో భాగంగా టాంజానియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘సోలార్ మామాలు’గా పిలిచే ఆరు ఆఫ్రికా దేశాలకు చెందిన 30 మంది గ్రామీణ మహిళా సోలార్ ఇంజనీర్లతో ముచ్చటించారు.

07/11/2016 - 07:06

మెల్‌బోర్న్, జూలై 10: ఆస్ట్రేలియాలో వారం రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ఎన్నికల్లో తామే విజయం సాధించామని ప్రధాని మాల్కమ్ టర్న్‌బిల్ ప్రకటించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ అధినేత బిల్ షార్టెన్ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని టర్న్‌బిల్‌కు ఫోన్ చేసిన కొద్దిగంటల వ్యవధిలోనే ప్రధాని టర్న్‌బిల్ విజయం మాదేనంటూ ప్రకటించారు. ‘మా ప్రభుత్వ పథకాలే విజయాన్ని చేకూర్చాయి.

07/11/2016 - 07:04

ఢాకా, జూలై 10: భారత్‌లోని వివాదాస్పద బోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ‘పీస్ టివి బంగ్లా’ ప్రసారాలను బంగ్లాదేశ్ ఆదివారం నిషేధించింది.

07/11/2016 - 06:51

ఇస్తాంబుల్, జూలై 10: టర్కీలో ఉగ్రవాదులో మరోసారి తెగబడ్డారు. నిషిద్ధ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్లు ఆదివారం జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో అయిదుగురు సైనికులను, ఒక గ్రామ రక్షకుడిని హత్య చేశారు. ఈ దాడుల్లో కనీసం 15మంది గాయపడినట్లు చెప్తున్నారు. తూర్పు ప్రావిన్స్ దగ్గర మిలిటెంట్లు పేల్చిన కారుబాంబుతో ఒక సైనికుడు, గ్రామ రక్షకుడు చనిపోయారు.

07/10/2016 - 07:21

డర్బన్, జూలై 9: ప్రపంచంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, తమ దేశ ఆర్థికాభివృద్ధి ఫలాలను ఆఫ్రికా ఖండానికి, ముఖ్యంగా దక్షిణాఫ్రికాకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరముందని ఆయన అంటూ, శతాబ్దాలుగా మన రెండు దేశాల ప్రజలమధ్య ఉన్న బలమైన సంబంధాలు నేటి భాగస్వామ్యం నిర్మాణానికి బలమైన పునాది అవుతుందని అన్నారు.

07/10/2016 - 02:22

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పెట్రిచ్‌నుంచి పీటర్ మారిట్జ్‌బర్గ్ స్టేషన్ వరకూ రైలులో ప్రయాణిస్తూ అభివాదం చేస్తున్న దృశ్యం. ఒకప్పుడు పీటర్ మారిట్జ్‌బర్గ్ స్టేషన్ వద్దే మహాత్మా గాంధీని రైల్లోంచి జాతి విద్వేషంతో అమానుషంగా బయటకు తోసేశారు.

07/10/2016 - 02:23

వాషింగ్టన్, జూలై 9: హెచ్-1బి, ఎల్-1 వీసాల ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్న నారతీయ ఐటి కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బే తగలనుంది. ఇకపై ఈ వీసాలకు అనుమతి ఇవ్వరాదంటూ, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ద్వైపాక్షిక సభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

,
07/10/2016 - 01:09

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డర్బన్‌లోని ఫోనిక్స్ ప్రాంతంలో స్థానికులతో ముచ్చటించారు. మహాత్మాగాంధీ మనుమరాలు ఇళా గాంధీని కలిసి జాతిపితకు నివాళులర్పించారు. అనంతరం పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో సత్యాగ్రహంపై రాసిన కొటేషన్లను ఆసక్తిగా చదివారు.

07/10/2016 - 01:04

కిన్షాసా, జూలై 9: హైదరాబాద్‌లో భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో మహిళ సింథియా వెచెల్ ఉదంతం కాంగోలోని ఆమె స్వస్థలమైన కిన్షాసాలో స్థానికులు అక్కడి భారతీయ వ్యాపారులపై ప్రతీకార దాడులకు దిగడానికి కారణమైంది.

07/10/2016 - 01:02

పీటర్‌మారిట్జ్‌బర్గ్, జూలై 9: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డర్బన్ వరకు రైల్లో ప్రయాణించారు. పెట్రిచ్ స్టేషన్‌నుంచి నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్ వరకు ఆయన రైల్లో ప్రయాణించారు. నాడు మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో జాతివివక్ష కారణంగా రైల్లోనుంచి బైటికి తోసేయబడిన సంఘటనకు గుర్తుగా మోదీ శనివారం అదే మార్గంలో ప్రయాణం చేశారు.

Pages