-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
లండన్, జూన్ 20: భారత్, చైనా వంటి పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకోవలసిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ముఖ్యంగా భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో యూరోపియన్ యూనియన్ (ఇయు)లో బ్రిటన్ కొనసాగి తీరాలని ఆయన పేర్కొన్నారు.
ఇండోనేసియా: ఇండోనేసియాలో వరదల కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 43కి చేరుకుంది. కొండచరియలు విరిగి పడడంతో ఆదివారం ఒక్కరోజే 24 మంది మృతి చెందారు. వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశామని, కొండచరియలు విరిగిపడడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడినట్టు ప్రభుత్వ అధికారి వివరించారు.
బీజింగ్ : చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లో వరదలు ముంచెత్తాయి. వరదల్లో 25 మంది మృతి చెందగా, 15 మంది జాడ తెలియడంలేదు. సుమారు 18 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
మెక్సికో: మెక్సికోలో ఆందోళన చేస్తున్న టీచర్లు, పోలీసులకు మధ్య సోమవారం ఘర్షణల కారణంగా ఆరుగురు మృతిచెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు. అవినీతి ఆరోపణలతో యూనియన్ల నాయకులు అరెస్టు కావడంతో ఓక్సాకా స్టేట్లో టీచర్లు ఆందోళన చేస్తున్నారు. పోలీసులకు, టీచర్లకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
లాస్ఏంజిల్స్: అమెరికాలోని లాస్ఏంజిల్స్లో రగిలిన కార్చిచ్చు కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సిల్వర్ సరస్సు సమీపం వరకు మంటలు వ్యాపించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలిఫోర్నియా మారుమూల ప్రాంతాలు, న్యూమెక్సికోలోని ప్రాంతాలకు కూడా ఈ కార్చిచ్చు వ్యాపించింది. మంటల కారణంగా కాలిఫోర్నియా సమీపంలోని ఓ చిన్న పట్టణం నుంచి 75 మందిని ఖాళీ చేయించారు.
లండన్, జూన్ 19: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయి మనీ లాండరింగ్ కేసులో నేరస్థుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా గురువారం సాయంత్రం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్ఎస్ఇ)లో భారత హైకమిషనర్ నవ్తేజ్ సర్నా సమక్షంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవడంపై ఎదురుదాడికి దిగాడు.
మాస్కో, జూన్ 18: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 186 రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించిన ముగ్గురు వ్యోమగాములు శనివారంనాడు భూమికి తిరిగివచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3.15 గంటలకు వీరు సూయుజ్ టిఎమ్ఏ-19ఎం అనే వ్యోమనౌకలో కజకిస్థాన్లో సురక్షితంగా దిగారు. వీరు స్పేస్ స్టేషన్లో బయాలజీ, బయో టెక్నాలజీ, భౌతికశాస్త్రం తదితర అంశాలపై ఎన్నో ప్రయోగాలు నిర్వహించినట్లు నాసా తెలిపింది.
బీజింగ్, జూన్ 18: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారంనాడు చైనాలో పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బీజింగ్లోని ఛాయాంగ్ పార్క్లో భారత రాయబార కార్యాలయం సహకారంతో ‘యోగి యోగ’ సంస్థ నిర్వహించిన యోగా శిక్షణ శిబిరానికి పెద్దసంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.
ప్రత్యేక విమానం నుంచి, జూన్ 18: పౌర అణు ఇంధన రంగంలో ఘనాకు పూర్తిస్థాయిలో సహకరించడానికి భారత్ అంగీకరించింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆఫ్రికా దేశాల్లో ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుని తిరిగివస్తూ ప్రత్యేక విమానంలో మీడియాతో ముచ్చటించారు. పౌర అణు ఇంధన రంగంలో సహాయ, సహకారాలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
లండన్, జూన్ 18: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా గురువారం సాయంత్రం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్ఎస్ఇ)లో ప్రముఖ సామాజికవేత్త సుహెల్ సేథ్ నూతన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దర్శనమిచ్చాడు.