S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/20/2016 - 17:16

ఇస్లామాబాద్‌: చేపల వేటకు వెళ్లి అరెస్టైన భారత జాలర్లలో 86 మందిని పాక్‌ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. వీరిని వాఘా సరిహద్దు అధికారులకు అప్పగించనున్నట్లు కరాచీలోని మాలిర్‌ జైలు సూపరింటెండెంట్‌ తెలిపారు. మరో 363 మంది భారత జాలర్లు పాక్‌ జైల్లో మగ్గిపోతున్నారు.

03/20/2016 - 17:11

స్పెయిన్‌: స్పెయిన్‌లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో 50 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 30 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

03/20/2016 - 17:07

పెషావర్‌: పాకిస్థాన్‌లో మట్టిపెళ్లలు విరిగిపడి ఎనిమిది మంది విద్యార్థులు సజీవసమాధి అయ్యారు. ఆఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన సుసమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యార్థులు పరీక్షలు రాసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన సంభవించింది. ఇటీవల భారీ వర్షాలకు నానిన మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.

03/20/2016 - 07:06

సిడ్నీ, మార్చి 19: వాతావరణ మార్పుపై కార్యాచరణకు పిలుపులో భాగంగా గంటసేపు దీపాలను ఆర్పేయాలన్న ఎర్త్ అవర్ పిలుపునకు స్పందిస్తూ శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని సుప్రసిద్ధ ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జి ప్రాంతాలతో పాటుగా నగరమంతా కూడా చీకటిగా మారిపోయింది. పదేళ్ల క్రితం అంటే 2007లో సిడ్నీ నగరంనుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు 176 దేశాలకు విస్తరించినందుకు నిర్వాహకులు ఎంతో సంతోషిస్తున్నారు.

03/20/2016 - 07:04

వాషింగ్టన్, మార్చి 19: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు 47వ యాత్రలో భాగంగా మరో ముగ్గురు సిబ్బంది శనివారం ఐఎస్‌ఎస్‌కు క్షేమంగా చేరుకున్నారు. వీరు అయిదు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడపడమే కాకుండా అంగారక గ్రహానికి నాసా ప్రయాణానికి దోహదపడే కీలక ప్రయోగాలు నిర్వహిస్తారని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తెలియజేసింది.

03/20/2016 - 06:56

ఇస్తాంబుల్, మార్చి 19: బాంబు పేలుళ్లతో అట్టుడుకుతున్న టర్కీలో మరో పేలుడు జరిగింది. ఇస్తాంబుల్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ విలేఖరులకు తెలిపారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యేనని, పేలుడులో ఆత్మాహుతి బాంబర్ కూడా మృతిచెందాడని ఆయన తెలిపారు.

03/20/2016 - 02:54

రోస్టోవ్-ఆన్-డాన్ (రష్యా), మార్చి 19: ఫ్లై దుబాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం ఒకటి శనివారం తెల్లవారుజామున దక్షిణ రష్యాలో కూలిపోవడంతో ఇద్దరు భారతీయులు సహా విమానంలో ఉన్న మొత్తం 66 మంది చనిపోయారు. ప్రతికూల వాతావరణంలో విమానం రోస్టోవ్-ఆన్-డాన్ విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు.

03/19/2016 - 12:27

మాస్కో: దుబాయ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్ విమానం శనివారం ఉదయం రష్యాలోని రోస్తవ్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురై ఏడుగురు సిబ్బంది సహా 55 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. బోయింగ్ 737 విమానం దుబాయ్ నుంచి వస్తుండగా రోస్తవ్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో రోస్తవ్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు.

03/19/2016 - 04:31

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంకోసం సాగుతున్న రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్ధృతంగా ప్రచారం చేయాలని డెమొక్రటిక్ పార్టీ వ్యూహకర్తలు, ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్న హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు నిర్ణయించారు. మరోవైపు, వివాదాస్పద బిలియనీర్ అయిన ట్రంప్ సొంత పార్టీ నాయకత్వం నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

03/18/2016 - 07:15

విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడి

Pages