S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/30/2018 - 19:30

‘‘ఇప్పుడు కలియుగం. కలియుగం 4,32,000 సంవత్సరాలు చెప్పబడుతోంది. ప్రస్తుతం 5117 సం.లు కలియుగం, ప్రథమపాదం అని చెప్పుకుంటున్నాం. శే్వత వరాహకల్పం 28వ కలియుగం. కలి ప్రభావంవలన మనుషుల్లో సత్యత, ధర్మం, ప్రేమ, దైవభక్తి, శ్రద్ధ రోజురోజుకి క్షీణించిస్తున్నాయనియంటారు. యజ్ఞయాగాదులు ధ్యానం, తపస్సు ఇవేమి జరగడంలేదని పెద్దల ఆవేదన.

08/29/2018 - 18:39

అనంతమైన విశ్వంలో ఒక జీవి, అదే ఏ జీవికి లేని ఆలోచన, మాట్లాడటం మొదలైన లక్షణాలు కలిగివుండటం విశేషణం. ఈ విశేషమే మనిషిని జ్ఞానమువైపునకు నడిపించాలి. కాని జరుగుతున్నదేమిటంటే పురోగమనం కంటే తిరోగమనమే జరుగుతోంది.
మనిషిగా పుట్టాక జీవించడం కోసం జీవులందరికి ఆహారం అవసరం.

08/28/2018 - 19:19

భగవంతునికి రూపం లేదు. నామం లేదు. భగవంతుడు నిస్సంగుడు. గుణరహితుడు. అవ్యక్తుడు. భక్తుడు కోరుకున్న విధంగా తన్ను తాను సృజియించుకోగల నేర్పరి కూడా ఆ భగవంతుడే.
భక్తి అనే సాధనం చేత రూపనామాలు లేని భగవంతుని మెప్పించి తాను కోరుకున్న విధంగా రూపుకట్టించుకని తన చర్మచక్షువుల ఎదుటి నిలబెట్టుకోగల శక్తి సంపన్నుడు భక్తుడు.

08/27/2018 - 18:53

మానవుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అహంకారం కొద్దోగొప్పో పొడచూపుతుంది. ఈ అహంకారం అటు ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టడంలో వెనక్కు లాగేస్తుంది. అట్లానే లౌకిక ప్రపంచంలోను వెనుకడుగుకు మార్గం అవుతుంది. ఎటువైపు చూసినా ముందుకు పోనివ్వని అహంకారం మాత్రం ప్రతిమనిషిలోను కనిపిస్తుంది.
ఏమీ తెలియకుండానే అహంకరిస్తే విజ్ఞానం ఆమడదూరానికి వెళుతుంది. అన్నీ తెలిసి కూడా అహంకరిస్తే సజ్జనులు కూడా దూరమవుతారు.

08/26/2018 - 21:24

జగన్మాత ఆదిపరాశక్తి భక్తరక్షణార్థమై భూలోకంలో ఆర్యవైశ్య కులములో జన్మించి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీగా అవతరించింది. కామాంధులను అంతమొందించి హింస రహిత విధానంలో భక్తులకు ధర్మప్రబోధము చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో కలియుగంలో అవతరించిన మహామహితాత్మురాలు వాసవీ కన్యకాపరమేశ్వరి. సుమారు 2500 సం.లకు పూర్వమే కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మాణమైందని చరిత్ర చెపుతోంది.

08/24/2018 - 18:21

శ్లో జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతీమ్
ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవ ముపాస్మహే
- అని అమరకోశంలో తొలి శ్లోకం.
వైకుంఠవాసియైన శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో హయగ్రీవ అవతారం ఒకటి. గుఱ్ఱపుతల మిగిలిన భాగమంతా మానవ దేహంలాగా ఈ స్వామి జ్ఞానానికి దేవతగా తెలుపబడినాడు.

08/23/2018 - 19:05

‘‘నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సుర పూజితే; శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మీ నమోస్తుతే’’. శంఖ చక్ర గద ధారణియైన మహాలక్ష్మీ దేవి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లాంటి అష్టైశ్వర్య ప్రదాయిని. అష్టసంపదలు ఒసిగే జగన్మంగళ దాయిని. అష్టైశ్వర్యాలు కలుగజేసే రూపం వరలక్ష్మిగా ఆరాధనీయం. కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలనిచ్చే జగజ్జనని వరలక్ష్మి.

08/22/2018 - 19:38

సృష్టిలో ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరులు భూమిపై కృతయుగం నుండి అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలు తీర్చే భక్తవల్లభులుగా పురాణాలలో పేర్కొన్నారు. ప్రస్తుతం నెల్లూరుగా పిలవబడుతున్న అలనాటి సింహపురిలో 1400 సంవత్సరాల క్రితం నెల్లి వృక్షం క్రింద స్వయంభువుగా కైలాసనాథుడు వెలిసాడు. అందుకే ఈ ప్రాంతానికి నెల్లూరు అని పేరు వచ్చిందని పూర్వీకుల వివరణ.

08/21/2018 - 19:30

రామాయణం మీకు తెలుసా అంటే చాలు ఎవరైనా రామాయణమంటే మాకు తెలియకపోవడమేమిటి? అది సూర్య వంశస్థుల కథ. దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు. నలుగురు పుత్రులు. వారే, రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు. రామలక్ష్మణులు విశ్వామిత్ర ఋషి వెంట వెళ్ళి అతని యాగ సంరక్షణగావించారు. హరివిల్లును విరిచి, రాముడు సీతను పెళ్ళాడాడు. కైకేయి కోరికతో సీతాలక్ష్మణులతో వనవాసం చేశాడు. రావణాది రాక్షసులను సంహరించి సీతను ఏలుకున్నాడు.

08/20/2018 - 20:19

‘‘శివం కరోతి శంకరః’ అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు. తనను ఆరాధించినవారికీ తనను నమ్మినవారికీ శివుడు ఆలోచించకుండానే వరాలిస్తాడు. శివునిపూజించిన వారికి లేనిది అంటూ ఏమీ ఉండదు.నిష్కల్మష మనస్కులై శివుణ్ణి మనసారా స్మరించుకొంటే సంసారసాగరాన్ని అవలీలగా దాటుకొని ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొంది శివసాయుజ్యం తప్పక లభ్యమవుతుంది.

Pages