S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/17/2020 - 23:11

ప్రేమ అనే రెండక్షరాలు ప్రపంచ రథ చక్రాలు. దైవ సంకల్పం వల్లే ఈజగత్తు చక్రంలా గిరగిరాలాడుతూ సృష్టి సంహార విలాసాల క్రీడాకేంద్రంగా విరాజమానం అయింది. ఈ సృష్టి కి మూలకారణం అయిన ఆ భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు. ప్రేమే దైవం అయినందువల్ల భూలోకం ప్రేమకు పెన్నిధి. మనం ఈలోకంలో ఆయన ప్రతిరూపాలుగా జీవకోటి అవతరించింది.

03/17/2020 - 23:11

సీ. పంపాసరః ప్రాంతహంపీ విరూపాక్ష
దివ్య కటాక్ష వర్ధిత మనస్వి
హరిహరబుక్కరాయాద్భుత వీర ప్ర
కాశ సముత్తేజ కరతపస్వి
విద్యానగర రాజ్య హృద్య సంస్థాపనా
చార్య ధుర్య ప్రభాస ద్యశస్వి
వేదాంత పంచదశీ దా మపరిమళ
వ్యాపితా ధ్యాత్మైక వరవచస్వి
అనఘగణ్య! 34విద్యారణ్య22 యతివరేణ్య!
తెలుగు వెలుగులుద్దీపించు బళము నిడుమ!
అస్మదీయాభిషేక మహంబువేళ

03/17/2020 - 22:48

పారదర్శక విమర్శ
*
ఆ విషయం మొదట్లో ముని కూడా పట్టించుకోలేదు. పాపం పాలూ నీళ్లూ లేక ఆ పసిపాప ఏడుస్తూ, చంద్రుడు వచ్చినప్పుడల్లా ఆ చంద్రకళల్లో ఉన్న అమృతం త్రాగి బ్రతికింది. అంతలో పారర్షికి దయ వచ్చి తన పాపని ఆశ్రమానికి తీసుకొనివెళ్లి పెంచాడు. చంద్రకళలు పానం చేసి బ్రతికింది గనుక ఆమెకు కళావతి అని పేరుపెట్టాడు. ఆమె కూడా ఎదిగివస్తూ తండ్రిసేవ చేస్తూ వనవంతరాలయింది.

03/17/2020 - 22:44

అపకారం చేసినవాడికి ఉపకారం చేయమని మన పెద్దలు చెబుతుంటారు. అపకారం చేసిన దోషిని క్షమించడమే వానికి పెద్దశిక్ష అని కూడా అంటుంటారు. దీనికి సంబంధించిన ఓ కథ మహాభారతం లో కనిపిస్తోంది. దాన్ని చూద్దాం.

03/16/2020 - 22:59

పారదర్శక విమర్శ
*
వెంటనే ఆ గురువుకి కోపం వచ్చేసింది. ‘మాంసం తింటూ నెత్తురు త్రాగే రాక్షసుడివైపో’ అని శపించేసాడు. అప్పుడు ఇందీవరాక్షుడు కాళ్లావేళ్లా పడితే శాంతించి, ‘నీ కూతురినే నువు మ్రింగబోయి నప్పుడు ఒక ధన్యుని బాణాగ్నికి నీ రాక్షసత్వం తగులబడిపోయి ఎప్పటిలా శుభరూపం వస్తుందిలే పో’ అన్నాడు. జరుగబోయే కథ అంతటికీ ఇది కీలకం అయిన వృత్తాంతం.

03/16/2020 - 22:53

ప్రతి మనిషిలో మంచి చెడు అనే రెండు లక్షణాలుంటాయ. అయతే మంచిని మాత్రమే చేస్తూ ఉండేవాళ్లను మంచివాళ్లు అంటుంటాం. కానీ ఒక్కో సారి వారు చెడు పనులుకూడా చేస్తారు. అటువంటపుడు అయ్యో ఎంతో మంచివాడు ఇలాంటి పని ఎలా చేశాడు. దుర్జనులతో సాంగత్యం చేశాడేమో అందుకే ఈ దుర్గుణాలు వచ్చాయ అంటారు.

03/12/2020 - 22:28

పారదర్శక విమర్శ
*
కథాపరిచయం
మనుచరిత్ర కథ అంతో ఇంతో అందరికీ తెలిసిందే అయినా మళ్లీ నేను వేరే పద్ధతిలో చెప్తాను. తెలిసినవాళ్లు కూడా విసుక్కోకుండా వినండి.

03/12/2020 - 22:27

ధర్మమెప్పుడు అపభ్రంశం చెందినా అవ్యక్తమైన భగవానుడే స్వయంగా తన్ను తాను సృజియించుకుని స్థానభ్రంశం చెందిన ధర్మాన్ని తిరిగి మార్గంలో పెడుతుంటారు. ఇది సృష్టి జరిగినప్పటి నుంచి జరుగుతున్నదే. ఈవిషయానే్న స్వయంగా అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తరూపంలో లీలామానుషవిగ్రహునిగా ద్వాపరయుగంలో పుట్టి సామాన్యులకు, అసామన్యులకు కూడా అర్థమయ్యేవిధంగా అర్జునుడి దుఃఖాన్ని నెపంగా పెట్టుకుని గీతోపదేశం చేశారు.

03/11/2020 - 22:11

అలా నిందించినా ముగ్గురు భార్యలకూ ముగ్గురు బిడ్డలని కని, మూడు రాజ్యాలు సంపాదించి వారికి ఇచ్చి గార్హస్థ్య ధర్మం పూర్తిగావించాడు. తర్వాత వానప్రస్థం కోసం అడవికి వెళ్లబోతే లేడి రూపంలో వచ్చిన వనదేవత కోరిక దయార్త్ర హృదయతతో, ఆర్త్రత్రాణ పరాయణతతో తన కులధర్మం నెరవేర్చాడు. దానివల్లనే స్వారోచిష మనువు పుట్టాడు. ఈ క్రమంలో పెద్దన గొప్ప ఔచిత్యం పాటించాడు (పుట 353-357).

03/11/2020 - 22:10

సహస్ర శీర్షం దేవం, విశ్వాక్షం విశ్వశమ్భువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పద. ............. అంటూ మొదలై

Pages