S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/01/2019 - 22:25

‘‘పశ్చిమాకాశ నికష సువర్ణరేఖ
లొకటొకటి చెరుపుచు బోవుచుండె ప్రొద్దు
గగన దుర్గపు తూర్పు బంగారు తలుపు
తెరువబడియె చంద్రుడరుదెంచు నంచు’’
దివ్య శోభా నివాసమై తేజరిల్ల
ప్రకృతి హృదయాంతరమున ప్రతిఫలించె
నవ నవోనే్మష రాగమ్ము నాదు దృష్టి
పథము
దైహిక శిల్ప నిర్మాణ రహస్యపు లోతులో
పడిపోయింది
నాకు తెలుసు జీవన తరు శాఖల్లో చేరి
పక్షి పాడే పాట

11/28/2019 - 22:56

బహుమతులుగా వచ్చిన ఆభరణాలను వేలం వేశాడు. గాంధీకి సొంత ఆస్తులు, వస్తువులు వుండేవి కావు. ఒక పేద ఆశ్రమవాసిగా ఆయన ఒక సామూసిక నిధికి ఒక రాగి పైసా విరాళమిచ్చాడు. దాన్ని ఒక అభిమాని 500 రూపాయలకు కొన్నాడు.
యాచకుడు

11/28/2019 - 22:53

ఉనికి ఊహ కలసి అనుభవించే దార్శనిక ‘సత్యం’
కాలపు దారులు తొక్కుకుంటూ
తోటలోకి వస్తోంది గాలి అడుగుల్ని మోస్తున్న గంధం
రాగము రంగులు కలబోసుకున్న
ఒక బింబాత్మక ప్రతీకల దృశ్య బారిమ
జీవన వనంలో తొణికిసలాడే హిరణ్య సంపద...
పక్షిగొంతులో ఉదయం పల్లవించటం
పూవు గుండెలో తేనె ప్రవహించటం
సుప్రభాత సంజ్ఞగా సూర్య కంజాతం
అరుణ తరంగాలమీద తేలటం

11/28/2019 - 22:53

‘సంతోషం సగం బలం’ అన్నారు పెద్దలు. భాగవతంలో పోతన ‘‘సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగును సుఖము....’’.. అని పద్యంలో వివరించినట్లు సంతోషంగా వుండేవాడు ముల్లోకాలలోనూ గౌరవింపబడతాడు. సంతోషం కలవానికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోతే తిరిగి జన్మ ఎత్తవలసి వస్తుంది. సంతోషంగా వుంటే సౌఖ్యం కూడా సమకూరుతుంది. సంతోషంగా వుండాలంటే ముందు సంతృప్తిగా వుండాలి.

11/27/2019 - 22:14

అందుకే ఆయన తనకు వచ్చిన బహుమతులను ముఖ్యంగా తక్కువ జీవితకాలం గల బహుమతులను వేలం వేయాలని నిర్ణయించాడు. బహిరంగ సమావేవాశాలలో ఆయన వేదికమీద కూర్చుని ‘నా ప్రియమైన బాలికలు ఇక్కడ ఎవ్వరూ లేరు. కాబట్టి నాకు ఈ దండలను ఎలా వినియోగించాలో తెలియడంలేదు. ఎవరైనా ఈ దండను కొనుక్కుంటారా?’’ అని అడిగేవాడు. ‘‘రెండు రూపాయలు ఒకటోసారి, మూడు రూపాయలు, ఐదు రూపాయలు...’’ ఆయన సరదా ధోరణిలో సాగిపోయేవాడు.

11/27/2019 - 22:11

22
తలెత్తి చూశాను- వెలుగు చీకట్ల చిన్ముద్ర
‘‘నీవు నాలోనె యున్నావని తెలియుటకు
పట్టెనిన్నాళ్ళు నా మనోభ్రాంతి వీడె
జ్ఞాన నేత్రము దెరచు ప్రకాశ లవము
దోచె! దుఃఖ జీమూతమ్ము తొలగిపోయె
లలిత మృదుభావ సుకుమార లాలసతను
మైమరపు జెంది, ఏదొ యున్మాదమొంది
భ్రమణమొనరించితిని శూన్య వలయమందు
మిగిలినది స్వాంతమొక్కటె మిన్నుదవిచి

11/27/2019 - 01:37

పేరుపొందిన అహింసా ప్రవక్త చేసిన ఈ హింసాత్మక కార్యం పెద్ద వివాదానికి దారితీసింది. ఒక జైనుడైతే గాంధీ పాపాన్ని ఆయన రక్తంతోనే కడుగుతానని బెదిరించాడు కూడ. గాంధీ ఈ విమర్శల తుఫానును వౌనంగా, ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు.

11/26/2019 - 22:07

శ్రమ, తెలివితేటలు తప్ప మరో పెట్టుబడిలేకుండా సేంద్రియ ఎరువును తయారుచేయవచ్చును. ఆయన ఆశ్రమాలలో మలమూత్రాలను ఒక లోతు తక్కువ పొడుగాటి గోతులలోకి పంపి మట్టి కప్పేవారు. అడుగు లోతులోపల మట్టిలో వుండే సూక్ష్మజీవులు మలాన్ని వేగంగా ఎరువుగా మార్చేయగలవు. లోతుగా పాతేసిన మలం, చెత్త చెడు వాయువులను ఉత్పత్తి చేస్తాయి. గాలిని కలుషితం చేస్తాయి.

11/26/2019 - 22:04

17
మీరు నాకోసం వేసిన కేకకు ప్రతిగా
నా సర్వేంద్రియ శక్తిని ఒక పద్యం చేసి- ఱెక్కలు తొడిగి
నిన్నటి మీ శిశిర వనం మీది వొదిలాను
ఋతువుగా మారిపోయిన క్షణాలన్నీ
మీ కన్నుల కొమ్మలమీద
కందువ నిలిపిన చైత్ర స్వరాలయ్యాయి
అదృష్టవంతులు మీరు- శబ్ద పల్లవాన్ని చేజిక్కించుకున్నారు
నా పాట చరణాలను పక్షయుగ్మం చేసుకుని
తోటంతా కలయతిరుగుతున్న సీతాకోక చిలుకలు

11/24/2019 - 23:21

భూమికి సారం లేదని కానీ మంచి పనిముట్లు లేవని కానీ, నీటి సరఫరా తగినంతగా లేదని కానీ వచ్చే ఫిర్యాదులను గాంధీ కొట్టిపడేసేవాడు. తన భూమిని చక్కగా ఉపయోగించుకొనే తెలివితేటలే రైతుకు అన్నిటికంటే పెద్ద ఆస్తి అని ఆయన అనేవాడు. రైతనేవాడు శక్తివంతుడిగా, తన మీద తాను ఆధారపడేవాడుగా, రకరకాల పనులు చేయగలవాడిగా ఉండాలని ఆయన భావించేవాడు.

Pages