S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/01/2019 - 19:55

ఉపాయమాస్థితస్యాపి నశ్యస్త్యర్థాః ప్రమాద్యతః
హన్తి నోపశయస్థోపి శయాలుః మృగయుః మృగాన్
అది ‘మాఘ’ మహాకవి కట్టిన అక్షర మణితోరణం..
‘శిశుపాలవధ’ కావ్య ప్రాంగణంలోని దృశ్యమిది-

01/01/2019 - 04:11

వాని చదువు, లలిత కళాలాభిలాష కూడా కేవల తన భౌతికాభివృద్ధికి మాత్రమే ఉపయోగించేటట్లుంటుంది. ఎవడినో సాధించాలనే ఈర్ష్యాద్వేషాలతో చదువుతాడు. వీడు రాక్షస పండితుడే తప్ప సాత్విక పండితుడు కాడు. వీని చదువువలన దేశానికి జాతికి ముప్పే తప్ప ఇంపుండదు.
అందుకని- ఈ చదువులు ఈ కళాభిరతి స్వామిని ఆకర్షించటంలేదు. ముందుకు నడుస్తున్నాడు.
ఆవేళ శుద్ధ త్రయోదశి.
చంద్రుడు గిరి వృక్షాలపైకి వచ్చేడు.

01/01/2019 - 04:10

22.నీరును అందున్న బుడగయునొక్కటియే.బుడగ నీటియందే పుట్టి, నీటిప దేలుచు, తుదకు నీటియందే అడగుచున్నది. అటులనే జీవాత్మయు పరమాత్మయు నొక్కటియే. ఐనను అంశ భేదము మాత్రము కలదు. ఒకటి రెండు ఖండము, రెండవది అఖండము;ఒకటి పరతంత్రము, రెండవది స్వతంత్రము.
23.జీవాత్మ భావము ఎట్టి?గంగా అపవాహమున ఒక భాగమునకు హద్దులేర్పరచి, ఆ నాగమును ‘నా గంగ’ యనుటవంటిది.

12/30/2018 - 23:05

కం భగవద్గీత! నమస్సులు!
జగమునకున్ నీ జయంతి జయకేతనమై
ఎగరవలె శాశ్వతంబుగ
ఖగ వాహన వదనముక్త కావ్యపదంబుల్
సీ వ్యాసర్షి హృదయాన ప్రాదుర్భవించిన
విశ్వమానవ దూత వేదమాత!
భారత రణమందు భగవంతుడే బోధ
చేసిన ఉపనిషత్ సిరుల ప్రోత!
భారతీయ ప్రజావాహినీ రక్తాన
ప్రవహించు గుణదాత ప్రణవమోత!
శోక మోహాల సుషుప్తిలో మునిగిన
‘నర’జాతి దుఃఖాంత నవ్యశాంత!

12/30/2018 - 23:05

ఆమె దర్శనాన్ని కామేశ్వరునితో కలిసి సహస్రారంలో చేయాలి. ఆజ్ఞా కమలంలో ఆ తల్లి యోగినిగా మాత్రమే కనబడుతుంది.
అందుకని వైదేహీ దర్శనోత్సు కుడవుతున్నాడు. విషణ్ణుడవుతున్నాడు. బుద్ధిమంతుడైన సాధకుడు ఈ విషణ్ణస్థితిలోనుంచి బయటపడతాడు. కనుకే-
సమీక్ష్యతు మహాబాహూ రాఘవస్య పరాక్రమం
లక్ష్మణస్యచ విక్రాంతమభవప్రీతి మాన్ కపిః

12/28/2018 - 20:24

అయోధ్యాపుర వర్ణనలో మనుష్యులు కనిపిస్తారు. వారి స్వభావ వైవిధ్యం చెప్పబడుతుంది. సంస్కృతులు సంప్రదాయాలు వర్ణింపబడతాయి. స్వామి లంకాపుర దర్శనం చేస్తున్నాడు. గంధర్వ నగరంలా ఉందిట.
సప్త భౌమష్ఠ భౌమైశ్చ సదదర్శ మహాపురీం
తలై స్పృటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః
అది మహాపురిట. దానికి పదిహేను ప్రాకారాలున్నాయట.

12/27/2018 - 19:54

అహంకారం పెరిగి పెరిగి
చతుర్ణామేవ గతి ర్వానరాణాం మహాత్మనాం
వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః
ఈ సముద్రాన్ని దాటి ఇక్కడ చేరగలగడం అనేది మహాత్ములైన నలుగురు వానరులకు మాత్రమే సాధ్యము. ఎవరువారు?

12/26/2018 - 19:26

ఆ అనుగ్రహాన్ని ఎంతగా పొందింది అంటే, పులో మజార్బితా అని ఆమె పేరును కలుపుకొని తాను నామధారణను చేసింది అమ్మవారు.
ఇక్కడ లంకలో విభీషణ ధర్మపత్ని సరమ ఉన్నది. ఆమె సీతను సేవించుకొంటున్నది. అందుకని లంక అమరావతి. అది స్వామి దృష్టి. నగర సౌందర్యాన్ని చూడటం బాహ్యదృష్టి. ఈ తత్త్వాన్ని దర్శించడం అంతరదృష్టి.
ససాగర మనాధృష్యమతిక్రమ్య మహాబలః
త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హ

12/25/2018 - 19:22

...నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ఈ మొదలుగా దేవతలు ఆ తల్లి గుణ కీర్తనను చేస్తూ ఉంటారు.
బుద్ధిః కీర్తి ర్ధృతిర్లక్ష్మీః శక్తి శ్శ్రద్ధామతి స్సృతిః
సర్వేషాం ప్రాణినాం సాంబ ప్రత్యక్షం తన్నిదర్శనం
అని చెప్పినట్లు ఆ స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఉంటాం. అందుకే ఆంజనేయస్వామి కూడా- సురసను చూసి ఆమె ఆశీర్వరచనాన్ని పొంది ‘దాక్షాయణి నమోస్తుతే’ అంటాడు.

12/24/2018 - 19:43

ఇది బ్రహ్మ నాకిచ్చిన వరం. కనుక నీవు నన్ను దాటి వెళ్ళలేవు.
అంతటి స్వామి కూడా బ్రహ్మ పేరెత్తితే కుంచించుకు పోతాడు.
ఆయనకు బ్రహ్మ వాక్యమందంత గౌరవం.
బ్రహ్మ వాక్యానికి సత్యత్వాన్ని కల్పించటం కోసం.
తాను లొంగిపోతూ ఉంటాడు.
సృష్టికర్త వాక్యాన్ని సృష్టి పాలకులు సత్యం చేయాలి.

Pages