S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
‘పరుగు’ జీవితంలో అద్భుతమైన అనుభూతినిస్తుందంటారు మాజీ ఏఏస్ అధికారిణి రేచల్ ఛటర్జీ. మారథాన్ మహరాణిగా మారిని ఈ ఆరు పదులు దాటిన మాజీ ఐఏఏస్ అధికారిణి పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఆనాడు పాలనాధికారిణిగా తనదైన ముద్ర వేసుకుంటే ఈనాడు పరుగులో తనదైన సత్తా చూపుతూ నేటి యువతికి సవాల్ విసురుతున్నారు. ఆరవైలో ఇరవై వలే ఈ పరుగు ఏమిటీ అని అనుకుంటున్నారా? నిజమే కదిలే కాలు కామ్గా ఉండదు కదా!
నర్మదా నందకుమార్కు నీరంటే ప్రాణం.‘ప్రకృతి ప్రసాదించిన నీటిని వృథా చేయకండి, కాపాడుకోండి’ అని చెబుతాం కాని ఆచరించం. కాని నర్మద ఆచరించి చూపిస్తుంది. నీళ్లని అపరిశుభ్రంగా చేస్తే చాలు ఆమెకు ఎంతో బాధ. అందుకే ఎక్కడ నీటి ట్యాంక్లు కనిపించినా.. చెరువులు కనిపించినా.. అవి అపరిశుభ్రంగా ఉంటే చాలు వాటిని స్వయంగా బాగుచేసి నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతుంది.
పుట్టుకతోనే ఎవరూ శాస్తవ్రేత్తగా జన్మించరు. పసి మనసుల్లో ఆసక్తి, అభిలాష, సైన్స్పై మక్కువ ఉంటే శాస్తవ్రేత్తలను తయారుచేసుకోవటం పెద్ద కష్టం కాదు. ఈ సంకల్పమే శాస్తవ్రేత్తలయిన ఆ దంపతులను సేవాదృక్పథం వైపునకు మళ్లించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులలో ఆసక్తి కల్పించే సంకల్పంతో ఆ దంపతులు తమ జీవితాన్ని త్యాగం చేశారు. లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు వదులుకున్నారు.
కష్టమైనా, సుఖమైనా అందరికీ సమానమే. ఎదుటి వారు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేం. చాతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తాం. మనలో ఎవరైనా దాదాపు ఇలాగే స్పందిస్తాం. కానీ చాలా ఇళ్లల్లో నూటికి నూరుశాతం ఇలాగే జరుగుతుందని మాత్రం చెప్పలేం. భార్య తలకు మించిన పనులతో సతమతమవుతుంటే ఎంత మంది భర్తలు స్వచ్ఛందంగా ఆమెకి సాయపడుతున్నారు?
‘‘ ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితాః’’- ఈ విశ్వాన్ని పాలించేది ధర్మం. అలాగే ‘‘ధర్మసార మిదం జగత్’’ అని, ‘‘సర్వే ధర్మం ప్రతిష్ఠితం’’ అన్నారు. ‘్ధృ’ అనే ధాతువు నుండి పుట్టిన పదం ధర్మం. ‘్ధృ’ అంటే ధరించుట, ఆధారంగా నిలవటం. ధరించేది ధర్మం. ధర్మమే సమాజాన్ని కుటుంబాన్ని విచ్ఛిన్నమైపోకుండా సంఘటితంగా నిలుపుతున్నది. స్వార్థరహితం, సమిష్ఠి తత్త్వాన్నిచ్చేది ధర్మం.
నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగ నాథుడ్ని మెప్పించిన మహా భక్తురాలు గోదాదేవి. భక్తి విశ్వాసాలు ఉన్నభక్తులను అనుగ్రహించేందుకు భగవంతుడు శ్రీవైకుంఠం నుంచి తరలివస్తాడు. అక్కున చేర్చుకుని సేదతీరుస్తాడు. అలా ఆ భగవానుడి అనుగ్రహం పొంది, చివరకు స్వామిని వివాహమాడి శ్రీరంగనాథునిలో ఐక్యమయన గోదాదేవిని గురించి తెలుసుకుందాం..
‘‘మహిళను గౌరవించే విధానంపైనే మన జాతి ప్రగతి ఆధారపడి ఉంది. ఆమె ఉన్నతికి పాటుపడనంతకాలం ప్రపంచ పురోగతిలో ఎలాంటి మార్పు జరగదు’’
***
‘‘కుటుంబానికే కాదు ప్రపంచానికే శక్తి మహిళ. అందుకే దైవసమానురాలైంది. ప్రపంచమంతా ఆ శక్తిపైనే ఆధారపడి పనిచేస్తుంది’’
-స్వామి వివేకానంద
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని అక్కడి మహిళలు ఎదురు చూడరు!
ఎందుకంటే నిత్యం జీవన్మరణ పోరాటమే.
తమను తామేకాదు గ్రామాన్ని సైతం రక్షిస్తూ ముష్కరలపై మడప తిప్పని పోరాటం చేస్తున్నారు!
ఆ రెస్టారెంట్లో దోశ తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లే. ప్రపంచంలో ఎక్కడా లభించని ఘుమఘుమలాడే దోశ అక్కడ లభిస్తోంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఇడ్లీలు.. మెరిసే వెండి గ్లాసులోకమ్మటి కాఫీ.. ఇలా ఒకటేమిటి ఏది తిన్నా..తాగినా అమ్మచేతి వంట కమ్మగా తిన్నట్లే. ఐటీ నగరంగా ప్రసిద్ధిచెందిన బెంగుళూరులోని పురాతన రెస్టారెంట్ మల్లావి టిఫిన్ రూమ్స్ (ఎంటీఆర్) పేరు ఎంతో సుపరిచితం.
రెండేళ్ల క్రితం అంతరిక్ష విజ్ఞానంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భారతీయ శాస్తవ్రేత్తలు అంగారక గ్రహంపైకి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి తమ సత్తా చాటుకున్నారు. ఇలాంటి అద్భుతాల ఆవిష్కరణలో రాకెట్లు వలే దూసుకుపోయే అతివలు ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆనాడు ఇస్రో విడుదల చేసిన ఫొటోల్లో పురుష శాస్తవ్రేత్తలతో పాటు మహిళలు కూడా కనిపించారు.