S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

01/07/2019 - 19:59

సాంప్రదాయక విద్యలకు దూరమైనప్పటికీ లోకానుభవం చేత, విజ్ఞతచేత తాను గ్రహించిన విజ్ఞానాన్ని ఆ వూరి ప్రజల అభ్యున్నతికి వినియోగించటానికి ఆయన సమకడతాడు. ముఖ్యంగా ఇందులో గమనించవలసిన విషయం తెలంగాణ ఉద్యమానికి ఆలంబనమైనటువంటి గ్రంథాలయోద్యమం మనకు అనుశ్రుతంగా కనిపిస్తుంది.

01/07/2019 - 02:11

తెలంగాణాలో జరిగిన మహోద్యమానికి సంబంధించి వచ్చిన సాహిత్య సంబంధమైన రచనలలో ప్రజల మనిషి అగ్రస్థానంలో వుంటుంది. ప్రజల మనిషి రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి స్వయంగా ఆ ఉద్యమంలో పాల్గొన్నవాడు. సాంస్కృతిక, రాజకీయ నేపథ్యం నుండి చూసినపుడు నవలకున్న ప్రాధాన్యం సుస్పష్టం.

01/04/2019 - 20:04

కానీ నా కొడుకు బతికే ఉన్నాడు. నేను చేసిన వడ్డీ వ్యాపారమే వాడూ చేస్తాడు. నా ఆస్తి దోచేస్తే తరిగేది కాదు. నా భూమి నాకే వుంది.
నువ్వు నమ్ముకొన్న జనం నీ వెంట రారు. నావైపు ప్రభుత్వం ఉంది. సిఆర్‌పి వుంది. నువ్వు ననే్నం చెయ్యలేవు’’ అంటుంది.

01/03/2019 - 19:47

అలాగే ఏ ఉద్యమం పట్లగానీ, పోరాటంవైపుగానీ తొందరగా ఆకర్షితులయ్యేది యువతరమే. సంఘంలో మార్పు కోరుకుంటూ కొత్త బాటలు వేసుకొంటూ ముందుకుపోయేది వారే.
ఈ మరీచిక నవల యువతరానికి చెందిన నవల. దీనిలో ముఖ్యమైన పాత్రలు శబరి, జ్యోతి (లేదా ప్రతిభ) వీరిద్దరు కాలేజీ విద్యార్థులు. తాను నివశిస్తున్న సంఘంలో ఇమడలేక నవ సమాజ స్థాపన కోసం జ్యోతి కలలు కంటుంది.

01/02/2019 - 19:48

చెదపట్టిన నిత్య జీవిత పుస్తకం పుట లక్షణాలనుంచీ కట్టుకొయ్యక్కట్టిన పశువుల్లాటి విసుగెత్తించే రోజుల్నుంచీ, రూపాయిల వాసన వేసే మనుషులనుంచీ, బిగుసుకుపోయిన పొడిబారిన ముఖాలనుంచీ తప్పించుకొని కాసేపు సంతోషంగా గడపాలంటే సాహిత్యమే శరణ్యం.

01/01/2019 - 18:40

చలం స్ర్తి గురించి చేసిన ఈ వ్యాఖ్యలకు అక్షర రూపమే రంగనాయకమ్మగారి ఈ విప్లవ రచన జానకి విముక్తి. ఈ రచన ఇప్పటి ఛాందసవాదుల్ని మూర్ఛపోయేలా చేసింది.

01/01/2019 - 04:02

కృత్రిమత్వం, అహజత్వం ఎక్క డ వెదికినా కనిపించవు. ఎంతో నిజాయితీతో ప్రజల మధ్యకొచ్చిన రచనగా స్పష్టపడుతుంది జానకి విముక్తి.
ఈ దోపిడీ సమాజమే స్ర్తి బ్రతుకునిలా ఛిద్రం చేసిందనే స్పష్టమైన, నూతన అవగాహన పాఠకుడికి నవల పూర్తయ్యేసరికి కలుగుతుంది.

12/31/2018 - 00:22

ఆ పుస్తకాల జ్ఞాన ప్రభావంతో, జానకి తన జీవితంలోని దౌర్భాగాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతుంది. తనకు మేలు చేసే ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకుంటుంది.

12/28/2018 - 19:59

అమ్మా నాన్నల చాటున అల్లారు ముద్దుగా పెరిగిన జానకి ప్రపంచంలోని స్ర్తి పురుషులంతా తన అన్నలా, తండ్రిలా, తల్లిలా, స్నేహితురాళ్లలా స్వచ్ఛంగా, ప్రేమగా, స్నేహంగా ఉంటారనుకుంటుంది.
అందరు మధ్య తరగతి తల్లిదండ్రుల్లాగానే పిల్ల సుఖపడుతుందనే ఆశతో, ఎర్రగా బుర్రగా ఎంఎస్సీ చదివి, ఉద్యోగం వెలగబడుతున్న వెంకట్రావుకి జానకినిచ్చి కట్టబెడతారు ఆమె తల్లిదండ్రులు.

12/27/2018 - 18:56

రంగనాయకమ్మగారి జానకి విముక్తి నవల తెలుగు నవలా చరిత్రలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న నవల. ఈ నవలని రంగనాయకమ్మగారు మూడు భాగాలుగా రాశారు. మొదటి భాగాన్ని 1977లో, 2వ భాగాన్ని 1980లో, మూడవ భాగాన్ని 1981 జనవరి నుండి 1982 జూన్ వరకూ రాశారు.

Pages