S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

10/02/2018 - 22:15

అన్నపూర్ణా మందిరంలో అమృతాన్నపానాలు, సరస్వతీ మందిరంలో సర్వవిద్యలు లభించడంతో అక్కడున్న వారందరికీ మాతృ మందిరం ఆనందమందిరం అయింది. అయితే అక్కడ నరక నిలయం కూడా వుంది. ప్రబోధానందస్వామి పాపాత్ములను అందులో వుంచి, పశ్చాత్తాపం కలిగేవరకు శిక్షణ కావించి, ప్రబోధమందిరంలో ఆపైన వారిని చేర్చి మనుషులను చేస్తాడు.

10/01/2018 - 19:29

తెలుగు సాహితీ కల్పలతకు పూచిన దివ్యమైన రెండు పువ్వులే వేంకట పార్వతీశ్వర కవులుగా ప్రసిద్ధులైన శ్రీ బాలాంత్రపు వెంకటరావు, శ్రీ ఓలేటి పార్వతీశంగార్లు.

09/30/2018 - 22:23

‘‘యజ్ఞము మాని సర్వభూత సమభావుడవు కమ్ము’’ అని హితవు పలుకుతాడు.

09/28/2018 - 19:22

శంబుకవధను ప్రేరేపించింది వశిష్ఠుడు కాదనీ, నారదుడనీ కాశీభట్ల బ్రహ్మయ శాస్ర్తీగారి వాదన. ఎవరు ప్రేరేపిస్తేనేంలే శంబుకవధ న్యాయమా, అన్యాయమా అనేది ముఖ్యం కదా. పైగా జీతంబత్తెంలేని ఆర్యుల టపాబంట్రోతుగా పనిచేసే నారదుడు మోసగించి శ్రీరాముడితో శంబుకుణ్ణి హత్యచేయిస్తుంటే వంశగురువైన వశిష్ఠుడేం చేస్తున్నట్లు? ఆయన వారించకపోవటనికి కారణం ఏమిటి? అన్నది కవిరాజు ఎదురుప్రశ్న.

09/27/2018 - 18:49

శిక్షాస్మృతుల్ని మిడిమేలంగా మతగ్రంథాలుగా మార్చివేశారు. అందువల్లనే శంబుకుడు ఆనాడే ప్రశ్నించాడు. ‘‘ఋషులకు మాత్రముండవలదే ఋజుమార్గము?’’ అని. అలా ప్రశ్నించేవాణ్ణి ఋషులెలా బ్రతకనిస్తారు? సమానత్వం కోసం శ్రమించే శంబుకుని పని పట్టేందుకు పరుగు పరుగునా పోగయ్యారు. ఆర్యఋషులూ వారి శిష్యగణమున్నూ! ‘ఇంటిలోన పోరు పడలేక విస్తళ్లు గుట్ట’ కొనేవాళ్లు సైతం సలహాదారులుగా మారిపోయారు. ఇంతకూ శంబుకుని తప్పు ఏమిటో?

09/26/2018 - 19:01

మొదటగా మనం కురుక్షేత్ర సంగ్రామము విషయం ముచ్చటించుకుందాం- దీన్ని నిజంగా పాండవ విజయం అనాలి. కానీ పాండవులకు లభించిన విజయం కవిరాజు దృష్టిలో ధర్మసంగతం కాదు. అందువల్లనే దీనికి కురుక్షేత్ర సంగ్రామము అని పేరు పెట్టారు. ఈ నాటక రచనకు రామస్వామిగారిని ఉసిగొల్పిన ప్రశ్నలేవి?

09/25/2018 - 18:43

శాస్ర్తీగారు ఈ నాటికను రాయడానికి ప్రోత్సహించిన సుప్రసిద్ధ సాహితీ వ్యాఖ్యాత శ్రీవాత్సవగారు. ‘‘తెలుగు నాటికల సంపుటాలలో తలమానికం అనిపించుకోదగిన సంపుటం గోరాశాస్ర్తీ గారి ఆశఖరీదు అణా అని శ్లాఘించారు. అది అక్షరాలా నిజం. అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.

09/24/2018 - 18:44

కాని, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో విధమైన సమస్యలు. అన్ని కుటుంబాలూ కలిసి ఒక చిన్న సమాజం. అందరిలో ఏదో నైరాశ్యం, ఏదో నిస్సహాయత- ఒక తాతగారు మినహా. ఆయన మాత్రం ఆశావాది. చలి వణికిస్తున్న ఒక తెల్లవారు ఝామన నిరాశాజీవులు నలుగురినీ కూర్చోబెట్టుకుని ఆయన ఇలా అంటారు.

09/23/2018 - 23:25

మన దేశ స్వాతంత్య్ర పోరాటం, ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో రచించిన శ్రవ్య నాటిక పరువుకోసం పోతే. ఒక జమిందారీ కుటుంబాన్ని ఆధారం చేసుకొని భిన్న దృక్పథాలను ఒకే కాన్వాసుమీద చిత్రించిన అద్భుత వర్ణచిత్రమిది. తరాలు, వర్గాలు, ప్రేమలు, స్వార్థాలు, త్యాగాలు, అధికార దర్పాలు, సెంటిమెంట్లు మొదలైనవి ఎన్నో ఆ నాటికలో తటస్థపడతాయి. అన్నింటికి మించి మానవత్వం శిఖర సదృశంగా కనిపిస్తుంది.

09/21/2018 - 20:09

పెళ్లయిన పిల్ల, కొత్తగా పరిచయమైన యువకుడు కలిసి సినిమాకు వెళ్లిన సన్నివేశం ఆమె నవ్వింది నాటికలోనిది. సంకలనంలో అది రెండవది. మొదటిది ఆశ ఖరీద అణా. రాగద్వేషాలు, తీయని తలపుల, పరువుకోసం పోతే అనేవి మిగిలిన మూడు నాటికలు. శాస్ర్తీగారి రేడియో నాటికలలో ఆశ ఖరీదు అణా కలికితురాయి.

Pages