S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వినమరుగైన
పెళ్లయిన మూడేళ్లకు కూడా కాపురానికి తీసుకుపోకపోయినా, పెళ్లి వేళ పెట్టిన నగలను తనకు ఈయకపోయినా, కనీసం భర్త అనే ఆ వ్యక్తి తనని తొంగి చూడకపోయినా అక్కనే తలుచుకుంటూ ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలంటే తన అత్తింటివారికి ఓ శాశ్వత గుణపాఠమును చెప్పాలని భావించిన మహోపద్వేష్టి.
‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా, కంఠే బథ్నామి శుభగే సాజీవశరదాం శతం’’-
పాండవ విజయంలో మరొక గొప్ప సన్నివేశం గంగా, యమున, సరస్వతి నదుల సంభాషణ. నిజమునకు ఇదొక విష్కంభ సన్నివేశం. నదులతో విష్కంభ సన్నివేశం నడపడం ఒక ప్రయోగం. భీష్మవధకు గంగాదేవి విలపించడం, వధకు పూర్వాపరాలను నదులతో కలిసి చర్చించడం, హృదయవిదారకమై కరుణరసప్లావితంగా నడుస్తుంది. యుద్ధ సన్నివేశాన్ని గంధర్వులతో చెప్పించడం నాటక ప్రయోగ పరిణతికి నిదర్శనం.
తిరుపతి వేంకట కవుల వంటి అసాధారణ ధారణా సంపన్నుల చేతిలో భారతగాధ ఆరు నాటకాలుగా విరచితమైంది. ఆరు నాటకాలలో వారి శక్తి సామర్థ్యాలకు పరాకాష్ఠగా మిగిలింది పాండవోద్యోగం, పాండవ విజయం నాటకాలే.
ఏదైతేనేం, 19వ శతాబ్దం చివర 20 శతాబ్దం తొలి భాగంలో పౌరాణిక నాటక రచన సాగింది. ఆ నాటకాలు ప్రజాదరణ పొందాయి. బలిజేపల్లివారి హరిశ్చంద్ర, ధర్మవరం వారి సారంగధర, చిలకమర్తివారి గయోపాఖ్యానం ఇవన్నీ తెలుగువారికి రసవత్ దృశ్యకావ్యాలను అందించాయి.
అక్షరం అణువైతే అణుశక్తి సాహిత్యం
అక్షరం సుమమైతే పరిమళం సాహిత్యం
అక్షరం మనిషైతే అంతరాత్మ సాహిత్యం
ప్రశ్నార్థకంగా నిల్చిన మధురవాణి చెవుల్లో, సత్పురుషులు చెప్పిన భగవద్గీత దగ్గర తనకి రక్షణ వుందా? లేక తన స్వానుభవం ‘‘ఒక రైతు కిల్లాలినై వంగ మొక్కలికి, మిరప మొక్కలికీ నీళ్లు పోసుకుంటే నా అన్నవారుండేవారేమో’’ అని చెప్పిన చోట రక్షణ సంరక్షణగా వుంటుందా అన్న సందేహాలు మారుమ్రోగి ప్రశ్నల్నించి ప్రశ్నల్ని పుట్టిస్తూ ఉంటాయి.
సన్నిహితమైన ప్రతి ఒక్కరినీ సంస్కరించాలనుకున్న మధరవాణి వారెవరూ మారలేదు గాని తనకి తానుగా మంచికి మారిందనీ విశాఖ దృశ్యాల్లో సూచితమైంది. పీక్కి ఉరిపడినందువల్ల లుబ్ధావధాన్లు పశ్చాత్తాపపడి కొద్దిగానైనా మంచికి మారడుగాని అవధాన్లు కన్నా ఏడాకులు ఎక్కువ చదివిన అతని తమ్ముడు గిరీశం మాత్రం మారే స్వభావం కలవాడు కాదు గాక కాదని హెడ్తో దొంగ సాక్ష్యాలు కట్టే దృశ్యంలో గిరీశం చూపించిన విశ్వరూపమే నిరూపించింది.
పాత కొత్తల కీడు కలయికగా ఉదయించబోతున్న ఒకానొక సంక్లిష్ట స్వభావం తనని తాను పరిచయం చేసుకుంటూ నాటకాన్ని ఆరంభించింది.
ఈ ఆరంభపు మెలకువలుల అర్థవంతమైన ముగింపు తొలి కూర్పులోనే వున్నాయి. అయితే అందులో పాత కొత్తల కీడు కలయిక జరిగినంతగా మేలు కలయిక జరగలేదు. ఆ గుణ దోషాల్ని బేలన్స్ చేసే ఉద్దేశంతోనే గురజాడ ఆకాశాన్ని పైకెత్తేంత విశ్వ ప్రయత్నం చేసుంటారు. ఫలితంగా నాటకం మహా నాటకమైంది.
గిరీశం ఆషాఢభూతి స్వభావం వ్యక్తమైనంతగా మధురవాణి మేలైన స్వభావం వ్యక్తం కాలేదు. ఇక వాస్తవికత విశదీకరణ వ్యక్తమయ్యే అవకాశమే లేదు.