S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

06/12/2018 - 21:28

దత్తమండలాలుగా పిలవబడే రాయలసీమ జిల్లాలు విజయనగరంలో రాజుల కాలంలో వైభవంగా వెలుగొందేవి. విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా అలలారుతూ ఉండేవి. 1565 రాక్షసి తంగడి యుద్ధం తరువాత గోల్కొండ నవాబుల వశమయింది ఈ ప్రాంతం. వారి ఆధీనంలో ఈ ప్రాంతం ముక్కచెక్కలయి వివిధ ప్రభువుల బందిఖానాలో చిక్కిపోయింది. 1677-78 ప్రాంతంలో ఇది శివాజీకి ఏలుబడి కిందికి వచ్చింది. ఆ తర్వాత నైజాం ముష్కరుల చేజిక్కింది.

06/11/2018 - 21:57

ఇక బైరాగిని కలవరించి పులకరించే వడ్డేపల్లి శ్రీనివాస్ సంభాషణ ఎప్పుడు మొదలుపెట్టినా ముందుగా ‘‘మానస యజనవాటికపై మరల నేడు ముసురుతున్నది సందేహాల మదేహాంధ ఛాయ’’ అంటూ పలవరిస్తాడు. వాక్యంలో ఏదో ఒక ప్రచ్ఛాయ కదలాడుతుంది కానీ విప్పి చెప్పే శక్తి నాకు లేదు.

06/10/2018 - 21:28

ఆయన ఆ గందరగోళ స్థితిలో ప్రత్యామ్నాయ వెదుకులాటలో మానవుడిగా జీవించే హక్కు మానవుడికి నిరాకరించిన నాటి సామాజిక స్థితిలో ఆత్మహననమూ లేక అస్తిత్వ నిరూపణా అన్న కీలక ప్రశ్నాసమయంలో (అదే ప్రశ్న హామ్లెట్‌కీ, అర్జునుడికీ, నికోల్‌కీ) ‘‘శోకాల చీకటిలో మగ్గిమరిగిన’’ సోన్యాను ఆశ్రయిస్తాడు.

06/08/2018 - 21:33

ఒక పక్క వినాశనం మరో పక్క కర్తవ్యం అర్జునుని సంశయగ్రస్తం చేస్తాయి.
‘‘బతుకు చీలుబాటమీద నిలబడి వున్నాను నేను.
ఎటుబోతే వల్లకాడు ఎటుబోతే పూలతోట’’
అనుకుంటున్న అతనిది సమస్త మానవజాతిని గురించిన కవిత.
నిరాశాంధకారంతో మొదలైన కావ్యం ఏదో ఒక దివ్యమైన వెలుగులో అన్ని శాపాలూ తొలగిపోతాయన్న ఆకాంక్షతో అంతమవుతుంది

06/07/2018 - 21:35

చెదిరిన భావాల సందడిలో అతడు ఒక్కోసారి తడబడి సుడిబడి అది అర్థమయ్యే తేటతెలుగా లేక అర్థంకాని దేవభాషా అదా ఇదా ఏదో ఒకటి- ఏదైనా స్ఫురించేది ఏదైతే అది చేతికి తీసుకుని వుండొచ్చు. ఎందుకంటే కావ్య పీఠికను అప్పటి కవులకు విభిన్నంగా సరళమైన తెలుగులో పేరు పెట్టాడు గనుక. కావ్యంలోని ఆ శైలీ సంగతులూ మనల్ని ఒక చోట స్థిమితంగా కూచోనివ్వని అస్థిమితాన్ని కలిగిస్తాయి. అతనిదే అయిన ప్రత్యేక శైలి ఎవరితోనూ పోలికలేనిది.

06/06/2018 - 22:06

అంతటా మరుభూమి, అంతా ఒక వేస్ట్‌లాండ్. మోసం, ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచిన మందారాలు కనిపించని ఒక యంత్ర నాగరికతా యుగం. జీవితాలు బతుకులయి ఛాయల అవమానాల మధ్య మనిషి మనిషిగా మనలేని భయంకర వాతావరణంలో మనిషి దుఃఖానికి మూలకారణం అనే్వషించాలన్న తపన అనాది తత్వవేత్త గౌతముని తలపింపజేస్తుంది.

06/05/2018 - 21:52

సాధారణంగా రాజవంశాలూ, వివిధ రాజ చరిత్రలూ అనగానే పట్ట్భాషేకాలు, వివాహాలు, దండయాత్రలు, కవిగాయక చత్ర శిల్ప కళాపోషణలు, అగ్రహారాది దానాలు, ఇష్టదేవతాలయ నిర్మాణాలు, ఆయా దేవతల ఉత్సవాలు వంటివి దాదాపు- అంతటా పునఃపునఃపునరుక్తములై ఉంటూంటాయి.

06/05/2018 - 21:37

1914వ సంవత్సరంలో పుట్టిన శాస్ర్తీగారు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిన కాల్పనికోద్యమ ప్రభావంలోగాని, అభ్యుదయోద్యమ ప్రభావంలోగాని పడలేదు. ప్రముఖ కాల్పనిక కవుల వరుసలో చెప్పదగిన కృష్ణశాస్ర్తీ, వేదుల, నాయని, విశ్వనాథ వంటివారి ఎవరి ప్రభావమూ ఆయన భావుకత్వ విధానంమీదగాని, శిల్ప సంవిధానంలోగాని లేవని నిరాఘాటంగా చెప్పవచ్చు. విద్యా వ్యాసంగంలోనూ, జీవితంలోనూ ఆయన ప్రాచీన సంప్రదాయదఘ్నంగా గడిపిన వ్యక్తి.

06/03/2018 - 22:11

ఆయన పొందికగా, పుస్తకం లాంటి మనిషి. ఆ పుస్తకం లగువు బిగువుల మనిషిలా చరిత్ర సృష్టించింది.
ఆయన పేరు మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ. ఆ పుస్తకం పేరు ఆంధ్రపురాణం.

05/31/2018 - 21:23

సామాన్యుడే ప్రశ్న- సామాన్యుడే జవాబు. మాయలు లేవు- మమతలు పొంగిపొర్లాయి గీతకు భిన్నంగా.
జీవితం మథియించి
పాప పంపకం నుండి పద్మాలు పుట్టించి
కార్మిక స్వర్గాన్ని కలగన్న బోల్షివిక్ రష్యా
లెనిన్ తపస్సు స్టాలిన్ సేద్యం-
దానివల్ల పెట్టుబడి కూటాలు కట్టకడుతున్నాయి
సప్త కంకాళాలు మేలుకొంటున్నాయి
కార్మికులు కర్షకులు తాడితులు పీడితులు

Pages