S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

07/29/2019 - 18:56

శ్రీపాద వారి భాష గురించి ఎక్కువ చెప్పవలసిన పనిలేదు. అక్షరజ్ఞానం ఉండి సాహిత్య పరిచయం ఉన్నవారికెవరికైనా ఆ విషయం విదితమే. శ్రీపాద వారి వాడుక భాషా సౌందర్యం ఆస్వాదయోగ్యమే కాని దాన్ని గురించి ఎంత చెప్పినా చాలదు. ఒక అక్షరం.. పదం.. అది ప్రతిభావంతుడైన వాడి చేతిలో.. అక్షర శక్తి తెలిసినవాడి చేతిలో పడితే దానికి రంగు, రుచి, వాసన సంక్రమిస్తాయి. శ్రీపాదవారిది ప్రతిపద పరిమళభరితమైన భాష.

07/28/2019 - 22:30

కొందరైతే కీర్తికండూతి ప్రబలి అనేక అయదార్థ విషయాలు వ్రాయడం కూడా కద్దు. కాని శ్రీపాదవారి రచనలో కొట్టవచ్చినట్టు కనిపించే అద్భుత లక్షణం సత్యనిష్ఠ. తాను చిన్నతనం నుంచి అనుభవించిన కష్టనిష్ఠురాలను, పడిన అవమానాలను, ఎదుర్కొన్న ఆకలి దారిద్య్రాది జీవిత సమస్యలను ఎక్కడా ఏమీ దాచలేదని ఒప్పించే రీతిలో చెప్పుకొచ్చారు. ఇందులో మరో మెచ్చదగిన అంశం నిర్భీతి. తమకు ఏవి ఇష్టమో వాటిని అమితంగా ఇష్టపడటం..

07/28/2019 - 22:24

తే.గీ. శక్తిపీఠాలఁ జుట్టంగ శక్తిలేదు
అమ్మతోఁ జెప్పి దయఁ జూపమనవె శివుడ!
ఓ యుమాపతీ! మమ్మేలు మోయి భవుడ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ శివుడా! భవుడా! పరమేశ్వరా! పార్వతీశ! శక్తిపీఠాలన్నీ తిరిగి వచ్చే శక్తినాకు లేదయ్య. ఆ జగదీశ్వరి యైన పార్వతీదేవితో దయజూపమని చెప్పవయ్య. మమ్మేలుకోవయ్య స్వామీ.

07/26/2019 - 19:38

అదొక అంధకారయుగం. కాదు కొత్త వెలుతురు ప్రసరిస్తన్న కాలం. మన సమాజం అజ్ఞానంలో, అవిద్యలో కునారిల్లుతున్న దశ. కాదు కాదు కొత్త విజ్ఞాన సంపద విస్తరిల్లుతున్న యుగం. ఆ వైజ్ఞానిక మూఢ విశ్వాసాలు గుర్రపు డెక్కవలె వ్యాపించి జాతిని నిర్వీర్యం చేస్తున్న రోజులు. కాదు కాదు దుష్ట సంప్రదాయాలకు, వ్ఢ్యౌనికి వ్యతిరేకంగా యువతరం పోరాటం సాగిస్తున్న రోజులు. అది ఒక యుగ సంధి.

07/25/2019 - 20:03

సముద్రం నదీనదాలవలె శుష్కించదు. దాని జలబలం జవసత్వాలు తగ్గవు. అలాగే శ్రీపాదవారి సాహిత్యం తెలుగువాడున్నంతకాలం, తెలుగు ఉన్నంతకాలం నిత్య పఠనీయమై నిత్య నూతనమై జీవించి ఉంటుంది. తరాలుగా తెలుగువారి ఇంట వాడుక భాషలోని గడుసుదనాన్ని వినిపించిన అమేయ ప్రతిభాశాలి. పుంభావ సరస్వతి.. శ్రీపాదవారు.

07/24/2019 - 20:03

అప్పుడే కళ్లు తెరిచి కిలారించే పసికూన వంటి ఆధునిక తెలుగు కథా శిశువును క్షీరమందించి లాలించి పాలించి జవసత్వాలిచ్చి పోషించిన మహా సాహిమూర్తి ‘ఉత్తమకథాకథన శిల్పి.. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు’’. పసితనంలోనే అలవడిన ఆ అమృతధార సేవించి తెలుగు కథా శిశువు సర్వాంగసుందరంగా పెరిగి నేటికి కళ్లు మిరుమిట్లు గొలిపే సొబగులు సంతరించుకుని ఇతర సాహిత్య ప్రక్రియలలో రాణిగా రాణిస్తున్నది.

07/23/2019 - 19:40

సీనియర్ వకీలు ఒద్దిరాజు రాజేశ్వరరావుది 49 మంది సభ్యులున్న కుటుంబం. ఎవరికీ దోమతెర లేదు. ఒకరోజు కాళోజి ఆయనతో మాట్లాడుతూ ‘దోమతెర కొనుక్కోరాదా’ అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు గదా 49 మందికీ కొనగల్గే శక్తి వచ్చిన్నాడే కొనుక్కుంటానన్నాడు. ఆయనకు 49 మందిపైన సమగ్రమైన, సమానమైన దృష్టి వుంది. కాళోజీ అలా ఆలోచించలేదు. ఈ సందర్భంగా కాళోజి అంటారు కదా- నా ఆలోచనా ధోరణికి, జీవితంలో ఆచరణకి ఎంత తేడా? ఎంత బూటకం.

07/22/2019 - 18:37

మిగిలినవారి మాండలీకాలు తెలుగు కావు అనే వాదనను కాళోజీ నిశితంగా ఖండించారు. అయితే అన్ని మాండలీకాలలోని పదాలను తనలో కలుపుకుంటూ ఒక సాధారణ వ్యవహారిక భాష రూపొందితే అది సాహిత్య భాషగా అందరికీ అర్థమయ్యేటట్లు తయారౌతుంది. నా గొడవలో కాళోజీ ఇలా అన్నారు.
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలింపు ఆంధ్రుడా- చావవెందుకురా?
అంతేగాక-
రెండు జిల్లాలదీ
దండి భాష అయినప్పుడు

07/21/2019 - 22:39

ముస్లిములలో కూడా ఎక్కువ తక్కువలు ఎలా వుండేవో వివరించారు. గ్రంథాలయోద్యమాన్ని చూసి బెదిరిపోయి నైజాం సర్కార్ గస్తీ నిషాన్ తిరపన్ (రాజపత్రం నెం.53) జారీ చేసింది. ఇది వాక్స్వాతంత్య్రాన్ని నిరాకరించింది. దీనితో సంస్థాన ప్రజలు తమ కష్టసుఖాలు ఎవరికీ చెప్పుకోలేని వారయ్యారు.

07/18/2019 - 19:30

9-9-1914న జన్మించిన కాళోజీకి ఈ ఆత్మకథ ప్రచురించేనాటికి 81 ఏళ్లు కాగా, ప్రస్తుతం ఆయన 87సంవత్సరాల వృద్ధ యువకుడు. ఆయన అన్నయ్య రామేశ్వరరావు ఏడవ ఏటనే, కాళోజీ తన ఏడవ నెలలో ఆయన భుజాలమీద ఎక్కాడు. రామేశ్వరరావు ఇటీవల మరణించేవరకు ఆయన తన అన్న అండలోనే కొనసాగాడు. రామేశ్వరరావు కవి. ఆయన ఉర్దూలోనూ, హిందీలోనూ కవిత్వం రాసేవాడు. తన 14వ ఏట నుంచీ కుటుంబ సంరక్షణ భారం వహించాడు. అడ్వకేటు వృత్తిలో వుండేవాడు.

Pages