S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

08/04/2019 - 22:05

దశరథుడు ధర్మసంపన్నుడని ఖ్యాతి వహించాడు. ఆయన రాజ్యం అయోధ్యలో అవిద్య అన్నది లేకుండా ఉండేది. పౌరులంతా ఆనందంతో సుఖసంతోషాలతో కాలం వెళ్లదీసేవారు. దశరథుడు తన బాహు విక్రమ పరాక్రమంతో దేవతలకు రాక్షసులకు యుద్ధం ఏర్పడినపుడు దేవతల వైపు యుద్ధం చేసి వారి విజయానికి కారణమైయ్యేవాడు. అయో ధ్యలో కృషీవలురు ముక్కారు పంటలతో ఆనందించేవారు. దేశ విదేశాల నుండి వచ్చే యాత్రికులు క్రయ విక్రయాలతో సందడి చేసేవారు.

08/01/2019 - 19:10

డమరుకం, మృదగం వాయిద్యధ్వనులకు అనుగుణంగా భృంగి నాట్యమాడుతున్నాడు. ప్రమధగణాలు శివుని గొప్పతనాన్ని కేకలు వేస్తూ చెబుతూ తమలో తాము ఆనందంతో తన్మయులౌతున్నారు.

07/31/2019 - 18:53

అపుడు చిత్రకేతువు లేచి ‘మహానుభావా! మీరు చెబుతున్నది అంతానిజమే. మీరు నాలో జ్ఞానాన్ని పుట్టించడానికే వచ్చారా? అసలు మీరు ఎవరు ఎందుకు నాకు ఇలాంటి జ్ఞానాన్ని బోధ చేస్తున్నారు’అని అడిగాడు.
‘‘చిత్రకేతూ మనుషులు, జంతువులు అసలు ప్రాణికోటి అంతా భగవంతుని ఆధీనంలో ఉంటాం.ఆయన నడిపించినట్టు నడుస్తుంటాం. మనకు ఇచ్చిన బుద్ధి ని ఉపయోగించి భగవంతుని తత్త్వాన్ని అర్థం చేసుకోవాలి.’’ అని అంగీ రసుడు చెప్పాడు.

07/30/2019 - 19:32

ఆ వింత దృశ్యం చూడగానే చిత్రకేతువు, కృతద్యుతి పట్టలేని ఆనందంతో ఆ పిల్లవానిని పట్టుకొని విచారం, సంతోషం రెండూ కలగలసి ఆ పిల్లవానిని ముద్దాడుతూ ఉన్నారు. అంతలో ఆ పిల్లవాడు ‘అయ్యా , అమ్మా ! మీరు ఎవరు ఎందుకింత దుఃఖమూ, ఆనందమూ అనుభవిస్తున్నారు. నన్నుచూసి మీ ఆనందం ఎక్కువ అవుతున్నట్లు ఉంది. మీరునాకు ఏవిధమైన సంబంధం ఉంది ? ’ అని అడిగాడు.

07/29/2019 - 18:37

ఊరు వాడ రాజ్యం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. రాజుగారు నాకు లేక లేక పుట్టిన కొడుకు అందులోను మహర్షి వరం చేత పుట్టిన కొడుకు ఇలా ఎందుకు మృత్యువు పాలయ్యాడో అని వగచారు. కృతద్యుతి సవతులంతా బాధను నటించారు. చివరకు రాజు అంగీరస మహాముని వద్దకు బిడ్డను తీసుకుని వెళ్లి బతికించమని కోరుకుంటాను అనుకొన్నాడు.

07/28/2019 - 21:00

ఒకానొక కాలంలో చిత్రకేతువు అనే రాజు ఉండేవాడు. అతడు భోగభాగ్యాలలో, యజ్ఞాలు చేయడంలో ఇంద్రుడంతటివాడని పేరుతెచ్చుకున్నాడు. అపార ధనరాసులతో తులతూగే అతని రాజ్యంలో ధర్మపాలన చక్కగా సాగేది. ఆయన రాజ్యంలో అవిద్యాపరులు కాని, జారులు, చోరులు, అధర్మపరులు కానీ ఉండేవారు కాదు.

07/25/2019 - 18:56

ఈ మాటలకు మరింత ఆశ్చర్యపోతూ దేవేంద్రుడు వృత్రాసురుడిని చూశాడు. తన అనుచరులంతా పారిపోతున్నా, తాము ఓడిపోతున్నా, నా చేతిలో సంహరించబడుతాడని తెలిసినా కూడా ఎందుకింత ఆనందంగా ఉన్నాడు. తనకు ప్రాణం పోతుందని భయం లేదా? అనుకొన్నాడు ఇంద్రుడు.ఇంద్రుని మనోగతాన్ని తెలుసుకొన్న వృత్రాసురుడు ‘దేవేంద్రా! నీకు నా సంగతి ముందు తెలుస్తుందిలే ఇకనైనా జాగు చేయక వజ్రాయుధంతో నన్ను కడతేర్చు’అంటూనే తన కరవాలాన్ని ఎత్తాడు.

07/24/2019 - 19:51

వారినంతా చూసి వృత్రాసురుడు తన వైపు ఎవరెవరున్నారో అని ఒక్కసారి సైనికుల వైపు చూశాడునముచి, శంబరుడు, అనర్వుడు, వృషభుడు, శంకుశిరుడు, విరూపాక్షుడు, ఇల్వలుడు, దందశూకుడు, కాలనాభుడు, మహానాభుడు, సుమాలి, మాలి, భూతసంతాపనుడు, వృకుడు ఇలా అసంఖ్యాకమైన రాక్షసులు తరలి వచ్చారు.

07/23/2019 - 19:30

అపుడు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు.

07/22/2019 - 18:28

ఇక నీవు అమరావతిపై దండెత్తి ఆ గర్వాంధుడైన ఇంద్రుడిని పదవీ భ్రష్టుడిని చేయు. నీకు నేను చెప్పదల్చుకున్న పని అదే అని చెప్పాడు.
వెనువెంటనే వృత్రాసురుడు దేవతలపై దండెత్తి వెళ్లాడు.

Pages