S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/07/2018 - 22:38

శంతనోపాఖ్యానం
==========

10/05/2018 - 18:54

దేవయాని తండ్రితో ఇలా చెప్పింది ‘‘తండ్రీ! ఇతను నహుషుని కుమారుడు. అరణ్యంలో నా పాణిని గ్రహించాడు. నన్ను ఇతనికిచ్చి వివాహం చెయ్యి’’
శుక్రుడు యయాతితో ఇలా అన్నాడు. ‘‘నరశ్రేష్ఠా! నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన నా కూతురు నిన్ను వరించింది. నేనామెను నీకు దానం చేస్తున్నాను. ఆమెను నీ పట్టమహిషిగా స్వీకరించు’’.

10/04/2018 - 18:51

అప్పుడు కోపంతో శుక్రుడు వృషపర్వుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. ‘‘రాజా! అధర్మం ఆచరిస్తే అది గోవులాగా వెంటనే ఫలితాన్ని ఈయదు. కాని మెల్లగా అధర్మం ఆచరించినవాని మూలాలను నాశనం చేస్తుంది. ఆ చేసిన పాపం తన యందుగాని, పుత్రులయందుగాని మనుమలయందు కాని తప్పక ఫలిస్తుంది.

10/03/2018 - 19:36

అప్పుడు రాక్షసరాజు అయిన వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ సరిగా చూడక దేవయాని వస్త్రం స్వీకరించింది. తర్వాత వారిద్దరికీ ఆ వస్త్రం గురించి విరోధం ఏర్పడింది. దేవయాని శర్మిష్ఠతో ఇలా అంది. ‘‘నీవు రాక్షసకన్యవు. నా వస్త్రాన్ని ఎందుకు తీసుకున్నావు? నీకు ఇది మంచి పని కాదు’’.

10/02/2018 - 22:58

యయాతి - ఉపాఖ్యానం
===============

10/01/2018 - 18:37

ఈ శకుంతలను కోడలుగా అనుగ్రహించు’’.
దుష్యంతుని మాటలు విన్న రాణి వారిద్దరినీ దీవించింది. తర్వాత శకుంతలను ఆభరణాలతో అలంకరించి పట్టమహిషిని చేశారు. శకుంతల పుత్రునికి భరతుడు అన్న పేరు పెట్టి యువరాజును చేశాడు దుష్యంతుడు.

09/28/2018 - 18:15

దానికి రాజు ఒప్పుకొని ఆమెను రాజమందిరానికి తీసుకువెళ్తానన్నాడు. ఇలా పలికి ఆమెను వివాహం చేసుకొని ఆమెతో నివసించసాగాడు. తర్వాత ‘‘నేను రాజధానికి వెళ్ళి నీ కోసం చతురంగ బలాలను పంపి నిన్ను సగౌరవంగా అక్కడికి తీసుకొని వెళ్తాను’’ అని పలికి వెళ్లిపోయాడు. కాని అతనికి మనస్సులో కణ్వ మహర్షి ఏం చేస్తాడో అన్న భయం ఉంది.

09/27/2018 - 18:35

అందమైన ఆమె రూపం, ఇంద్రియ నిగ్రహం చూసి ముగ్ధుడైన దుష్యంత మహారాజు ఆమె నిలా ప్రశ్నించాడు. ‘‘కల్యాణీ! నీవు ఎవరు? ఎవరి కుమార్తెవు? ఈ వనానికి ఎందుకు వచ్చావు? మొదటి చూపులోనే నీవు నా మనస్సును హరించావు. నీ వివరాలు చెప్పు’’.

09/26/2018 - 18:35

అమృతం తెస్తే మా తల్లి దాస్యం తొలగిపోతుందని చెప్పారు కదా! ఇప్పుడు అమృతం తెచ్చాను. నేటి నుండి నా తల్లి దాస్యం తొలగిపోయింది. మీరు వెళ్లి స్నానం చేసి రండి’’అన్నాడు.

09/25/2018 - 18:21

అప్పుడు కశ్యపుడు వారితో ఇలా అన్నాడు
‘‘మహర్షులారా!
బ్రహ్మయొక్క ఆజ్ఞ వలన ఈ ఇంద్రుడు దేవతలకు రాజైనాడు. మీరు ఇప్పుడు ఇంకొక ఇంద్రుని కోసం సంకల్పిస్తే పరమేష్టి ఆజ్ఞ వ్యర్థమగును కదా! అలాగే మీ మాట కూడా వ్యర్థం కాకూడదు. కనుక బలసంపన్నుడైన ఇంద్రుడు జన్మించును. కాని అతడు పక్షీంద్రుడు అగుగాక! మీరు దయతో ఇంద్రుని అపరాధాన్ని క్షమించండి’’

Pages