S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
పర్యావరణం దెబ్బతింటున్నందున ప్రకృతి విపత్తులు పేట్రేగి పోతున్నాయి. ఇది కేవలం ఒక్క దేశానికి పరిమితం అయన అంశం కాదు. విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రథమ కారణం. మానవాళి అడుగడుగునా అనుసరిస్తున్న ప్రకృతిపరమైన విధ్వంసంతో నిత్యప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. భూభాగంపై నిత్యం పెరుగుతున్న జనాభా వల్ల కీడు జరుగుతోంది.
ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలు సమృద్ధిగా కలిగిన, చవకగా దొరికే ఆహారం ఏదైనా ఉందా? అంటే- అది ‘గుడ్డు’ అని వెంటనే చెప్పేయవచ్చు. గుడ్డు చూడటానికి చిన్నగానే ఉంటుంది. అయినా ఇది సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్లో రెండో శుక్రవారాన్ని ‘ప్రపంచ గుడ్డు దినోత్సవం’గా జరుకుంటారు.
అమ్మలకమ్మవై యిల చరాచర సృష్టికి మూలకందమై
ఇమ్ముగ పెన్నిధున్నొపని, ఏడుగదై దయబ్రోచు లక్ష్మివై
క్రమ్మిన చీకటుల్దొలగ కాంతి పథమ్మును జూపు దివ్వవై
మమ్ము తరింపజేయుటకు మాత! నవాంశలు దాల్చి వచ్చితే!
1. శైలపుత్రి
శూలము నొక్కహస్తమున చొప్పడ, రెండవ హస్తమందునన్
గ్రోలగ దాల్చి పద్మమును రమ్యతరమ్ముగ, కానిపించు శం
పాలత భంగి భక్తుల కపారముదంబునన్ శైలపుత్రి గా
పెంపుడు జంతువులు తమ యజమానులు వ్యక్తంచేసే మాటలను, హావభావాలను పసిగట్టి పాటిస్తాయి. ఏ జాతి శునకాలయినా తమ చిట్టి మెదడు ఇచ్చే సంకేతాల మేరకు, యజమానుల సంకేతాలను ఇట్టే పసిగడతాయి. ముఖ్యంగా నాసికా పుటాల ద్వారా వాసన రూపంలో ఎక్కువ విషయాలను పసిగట్టడం, శబ్దం ద్వారా జంతుజాలం ప్రమాదాలను పసికట్టడం, ప్రమాదాల బారినుండి తప్పించుకొనే చాకచక్యం కలిగి ఉంటాయి.
శునకాలకు గ్రాహ్యత ఎక్కువ
దసరా సెలవులు వచ్చాయ. అందరూ సరదాగా అలా అలా తిరిగొద్దా మను కుంటు న్నారా? విహారయాత్రకు వెళ్తున్నారా? అయితే లగేజీ సర్దుకునే విషయంలో కొన్ని మెలకువలు పాటించాలి. దీనివల్ల తెలియని ప్రాంతానికి వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. హాయిగా మనసుకు నచ్చిన ప్రాంతాల్లో విహరించి రావొచ్చు.
అందమైన బొమ్మలను చూసేందుకు పిల్లలే కాదు పెద్దలు ఇష్టపడతారు. అటువంటి వివిధ రకాలైన బొమ్మలు వందల్లో ఒకేచోట దర్శనం ఇస్తే చూసేవారి ఆనందానికి అవధులే ఉండవు అనడం అతిశయోక్తి కాదు. వందలాది బొమ్మలను ఒకచోట చేర్చి చూపరులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగుతుంది. దుర్గాదేవి వివిధ రూపాలను ధరించి దుష్టులైన రాక్షసులను అంతమొందించినందులకు నిదర్శనంగా ఆ చల్లని తల్లిని వివిధ అలంకారాలతో పూజిస్తూ దసరా పండుగను జరుపుకుంటాము.
సత్య, అహింసలే మార్గాలు..
ధర్మక్షేత్రమే బతుకంతా..
కర్మయోగమే తలపంతా..
స్వదేశీ సూత్రమే జీవనంగా..
శాంతిమార్గమే నడవడిగా నడిచిన అసలు సిసలు జగజ్జేత..
తరతరాల యాతన తీర్చిన వరదాదరుడు..
భరతమాత తలరాతను మార్చిన విధాత..
నవశకానికే నాంది పలికిన ఈ శతాబ్దపు సూర్ఫి ప్రదాత..
బోసినవ్వుల గాంధీ తాత..
‘‘వృద్ధాప్యం ఓ శాపం కాదు, వ్యాధి కాదు, అది రెండో బాల్యం’’ అన్నారు తిరుపతి వేంకట కవులు. వయసు పెరిగేకొద్దీ పెద్దరికం పొందాలి కానీ ముసలితనాన్ని కాదు అనేవారు తత్త్వవేత్త జాన్సన్. యువతను శక్తికి మారుపేరంటారు కానీ వారి వద్ద అనుభవమనే శక్తి ఉండదు. జీవిత సత్యాల జ్ఞానం చాలా తక్కువ. ‘అపారమైన అనుభవశక్తి, అసంఖ్యాకమైన సత్యాల సమాహారమే వృద్ధాప్యం’. వార్థక్యం ఎప్పుడూ యవ్వనం పరిధిలోకి రాదు.
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదోక సమయంలో దిగులు తప్పదు. కష్టాలు, కన్నీళ్ళనుంచి బయటకొచ్చేందుకు అదో మార్గం. ఆ సమయంలో ఆత్మీయుల ఓదార్పు స్వాంతననందిస్తుంది. కానీ కొందరు చిన్న విషయాలను భూతద్దంలో చూసి జీవితాన్ని కష్టాలకొలిమిగా భావిస్తారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయే ఈ స్థితే డిప్రెషన్. దేశ జనాభాలో దాదాపు పది శాతం ఇలాంటి డిప్రెషన్తోనే బాధపడుతున్నారని పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి.
మనిషి మనిషిగా పుట్టటం ఒక వరం, అదృష్టం. ఎనె్నన్నో జన్మలెత్తి యిప్పుడే నరజన్మ లభించింది. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, అగాథాలు, ఉన్నతులు, సుఖాలు, దుఃఖాలు- వీటన్నిటిని అనుభవించటానికి ఎదుర్కోవటానికి మనం, మన జీవిత పరమార్థమేమిటో తెలిసికోవాలి. ఈ లభించిన నరజన్మ ఉన్నతమయింది. సూర్యాస్తమయ సూర్యోదయాల మధ్యలో మనిషి ఆయుర్దాయం తగ్గిపోతుంది. వయస్సు పెరుగుతుంది.