S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

05/22/2018 - 00:29

కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడి అక్కడ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రముఖ బిజెపి నాయకుడు షానవాజ్ హుస్సేన్ మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘2024 వరకు ప్రధాని పదవి ఖాళీలేదు’అని ప్రకటించారు. అంటే నరేంద్రమోడీకి రాహుల్‌గాంధీ ప్రత్యామ్నాయం కాదు- అని అర్ధం. ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది.

05/14/2018 - 23:55

కేరళలోని వైనాడ్‌లో ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆకలితో ఒక వనచరుడు కిలో బియ్యం దొంగిలించాడు. అతణ్ణి స్థానిక మావోయిష్టులు హత్యచేయడం కేరళలో కలకలం సృష్టించింది. ‘నేరం నాది కాదు ఆకలిది’ అనడానికి వీలులేదు. షాపులో బియ్యం గాని, బ్రెడ్ గాని దొంగిలించినా నేరమే. కాని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఈ దేశంలో నేరం కాదు. వివిధ జాతీయ బ్యాంకుల్లో సామాన్యులు డబ్బు దాచుకుంటారు.

05/07/2018 - 23:51

ఇటలీకి చెందిన దౌత్యవేత్త, రాజ్యాంగ సిద్ధాంతకర్త మాకియావెల్లీ తన ‘ప్రిన్స్’ గ్రంథంలో ‘సాధనం కన్నా సాధ్యమే ముఖ్యమ’ని ప్రతిపాదించాడు. కానీ, మన దేశంలో మహాత్మా గాంధీ దీన్ని అంగీకరించలేదు. ‘సాధనము-సాధ్యము’ రెండూ ముఖ్యమే అని ప్రతిపాదించాడు. ఇప్పుడు భారత్‌లో గాంధీ యుగం పరిసమాప్తమైంది, రాజకీయాల్లో విశ్వసనీయత కొరవడింది. 2014 ఎన్నికల వేళ నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాలు ఆచరణకు నోచుకోలేదు.

05/01/2018 - 00:01

విభజన’ హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. వివిధ రూపాల్లో ఆయన తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ఇటీవల విజయవాడలో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. తాజాగా తిరుపతిలో ‘్ధర్మపోరాటం’ పేరిట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

04/16/2018 - 23:55

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదట రెడ్ ఇండియన్లు ఉండేవారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణానికి ఆఫ్రికా వంటి దేశాల నుండి నల్లజాతి వారిని రప్పించారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం భారత్, చైనా, కొరియా తదితర దేశాలవారూ అమెరికా చేరారు. అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ఉన్న కాలంలో శే్వత, శే్వతేతర జాతుల మధ్య సంగ్రామం తీవ్రస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా విజయానికి నల్లజాతివారు కారణం.

04/09/2018 - 23:55

ప్రపంచంలోనే అమెరికా, ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. ప్రజలు ఓటుహక్కుతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు. అతడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయాలి. నేతలు పొరపాట్లు చేస్తే వారిని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు సరిదిద్దాలి. బ్రిటన్‌లో ఒకవేళ పాలకపక్షం పడిపోతే పరిపాలనకు అంతరాయం లేకుండా ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియను బ్రిటన్ నుండి భారత్ స్వీకరించింది.

04/03/2018 - 02:03

‘నేను గోమాంసం తింటే తప్పేమిటి?’ అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఇదివరకే ప్రశ్నించాడు. లక్షలాది హిందువులను చంపటమో, మతం మార్చటమో చేసిన హైదరాలీ కొడుకు జయంత్యుత్సవాలను ఈ ముఖ్యమంత్రి పోలీసు రక్షణతో బలవంతంగా జరిపించాడు. తమిళనాడుకు నదీ జలాలు పోకుండా కృష్ణరాజసాగర్ వద్ద రైతులు కృష్ణానదీ ప్రవాహాన్ని ఆపివేశారు. ఆంధ్రుల నోట్లో మట్టికొట్టి ‘అల్మట్టి’ డ్యామ్ ఎత్తుపెంచారు.

03/27/2018 - 02:54

సమాజంలో కొన్ని ఆర్థిక వర్గాలున్నాయి. అవి- 1. నిరుపేదలు 2.మధ్యతరగతి వారు 3. ఉన్నతవర్గం 4. కుబేరులు. ఈ వర్గాలనే ‘పూర్ - మిడిల్ క్లాస్ - అప్పర్ మిడిల్ క్లాస్ - రిచ్’ అని పిలుస్తారు. వర్గరహిత సమాజం స్థాపించాలంటే ధనికుల సంపదను నిరుపేదలకు పంచాలి. గనులు, కర్మాగారాలు, పరిశ్రమలపై ఆధిపత్య వర్గం ఒకటి ఉంటే శ్రామిక వర్గం మరొకటి వుంది. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ అనివార్యం.

03/20/2018 - 01:26

ఆలులేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం అని తెలుగులో ఒక సామెత ఉంది. కాంగ్రెసేతర- బిజెపి ఇతర-ప్రాంతీయ పార్టీల సంఘటనతో తృతీయ ఫ్రంట్‌కు రూపం కల్పిస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు ఒక ప్రకటన చేయగానే దేశవ్యాప్తంగా తర్జన భర్జనలు గర్జనలు మొదలైనాయి. సీమాంధ్ర ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ ఈ తృతీయ ఫ్రంట్ ప్రతిపాదనను స్వాగతించటం లేదు.

03/13/2018 - 00:04

ఈసృష్టిలో నిప్పు కనిపెట్టిన క్షణం ఒక దివ్య ముహూర్తం. చక్రం కనిపెట్టిన క్షణం చిరస్మరణీయం. ఇవాళ విద్యుత్తు మీద విద్వత్తు ఆధారపడి వుంది. కంప్యూటర్, ఇంటర్నెట్, యూ ట్యూబ్, సెల్‌ఫోన్- ఇవన్నీ మానవ మేధ చేసిన మహావిష్కరణలు. ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్సు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న షెపర్డ్ కంచె ఐలయ్య ‘వార్తల్లో వ్యక్తి’ అయినాడు.

Pages