S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

,
08/21/2019 - 18:38

కడుపుతో ఉన్న సమయంలో రోజువారీ కేలరీల కంటే 300 నుంచి 400 కేలరీలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ తీసుకనే ఆహారంలో ఐదు రకాల రంగులున్న పండ్లను తీసుకోవాలి. అంటే అరటి, బత్తాయి, ఆపిల్, ద్రాక్ష, జామ.. వంటివన్నమాట. ఆకలిగా అనిపించకున్నా కడుపుతో ఉన్నవారు తినడానికి ప్రయత్నించాలి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను ప్రతిరోజూ తప్పకుండా తినాలి.

,
08/20/2019 - 18:45

ప్రశంస తిరుగులేని సాటిలేని హార్మోన్ వంటిది. దానివల్ల మనసు, శరీరం రెండూ ఉత్తేజితమవుతాయి. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. అందుకే ఎటువంటివారికైనా ప్రశంస ప్రధానం.

08/16/2019 - 18:38

ఇంట్లో పాపాయి వున్నప్పుడు తల్లికి పని పెరుగుతుంది. ‘‘చంటి పిల్లలు హాయిగా నిద్రపోతారు. అల్లరి చేస్తారా? వస్తువులను పాడు చేస్తారా? ఆకలేస్తే ఏడుస్తారు.. కాసిని పాలు తాగి, కాసేపు ఆడుకుని అలసిపోయి పవళిస్తారు’’ అనుకుంటారు మగవాళ్ళు. కాని ఆ అభిప్రాయం సరికాదు. పాపాయి పెంపకంలో తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఎంతో శుభ్రతను పాటించాలి.

08/15/2019 - 22:33

రాత్రి తీసుకునే భోజనం మితంగా ఉండాలి. నిద్రకు ఉపక్రమించే ముందు డిన్నర్ తీసుకుంటాం.. కాబట్టి భోజనం తరువాత ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అందుకని పరిమితిని మించి తీసుకునే ఆహారం, నిద్రలేచిన తర్వాత కూడా రోజంతా మైకం ఆవరించి ఉండేలా చేస్తుంది. అతిగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది. రాత్రి నిద్రవేళల్లో జరిగే కొన్ని జీవక్రియలు స్థాయిని మించి పనిచేయడం ద్వారా పైత్యప్రకోపాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

08/15/2019 - 22:30

నోరు బాలేనప్పుడు, నాలుక చేదుగా అనిపించినప్పుడు నాలుగు రొయ్యలను నోట్లో వేసుకోకపోతే.. మాంసాహారులకు మనసొప్పదు. అందుకే మాంసాహారులు ఎక్కువగా రొయ్యలను తింటారు. ఎక్కువగా రొయ్యల వేపుళ్లను, ఇగుర్లను తింటారు. తిన్నంతసేపు బానే ఉంటుంది.. తిన్న తరువాత అనారోగ్య భయం వెంటాడుతుంది. కానీ అనవసర భయాలు వద్దంటున్నారు ఆరోగ్యనిపుణులు.. ఎందుకంటే బలానికి రొయ్య చాలా మంచిది అని చెబుతున్నారు వారు.

08/14/2019 - 18:48

‘‘యేన బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబద్నామి రక్షే మా చల మా చల...’’ ఓ రక్షా బంధమా! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు...కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను... సోదర ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఆచరణలో ఉన్న సత్సంప్రదాయం. మహావిష్ణువు, మహాబలి కోరిక మేరకు ఆయనతో పాతాళంలో ఉండిపోతారు.

08/13/2019 - 18:33

‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న సిద్ధాంతం నిజం చేయాలంటే చిన్నారులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అదే విధంగా పిల్లలకు చదువు సంస్కారంతోబాటు వారిలో చిన్ననాటినుండే దేశభక్త్భివం పెంపొందించాలి. భారతదేశం మనదేశం, మన దేశ స్వాతంత్య్రం కోసం కృషిచేసిన మహనీయుల త్యాగఫలితమే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని పెద్దలు పిల్లలకు సవివరంగా తెలియజెప్పాలి.

08/13/2019 - 18:31

మనదేశం భారతదేశం
భావితరాలకు ఆదర్శం

మనదేశం భారతదేశం
జాతీయ సమైక్యతా సందేశం

మనదేశం భారతదేశం
శాంతి సౌభాగ్య సౌభ్రాతృత్వం

మనదేశం భారతదేశం
అమర వీరుల త్యాగఫలం

మనదేశం భారతదేశం
త్రివర్ణ పతాక జైకేతనం
మనదేశం భారతదేశం
ప్రగతి భావాల మనోరంజకం

మనదేశం భారతదేశం
మన అందరికీ ఒక మహోదయం

మనదేశం భారతదేశం
మన జాతికి శుభోదయం

08/09/2019 - 18:38

చాలామంది మహిళలు ముప్ఫై సంవత్సరాలు వచ్చేసరికి డీలా పడిపోతారు. ఎన్నో చేయాలనుకుంటారు కానీ.. ఏమీ చేయలేక బాధపడిపోతుంటారు. అనవరమైన నిస్సత్తువ మనస్సులోకి ప్రవేశిస్తుంది. కారణం లేని బాధ మనస్సును తొలిచేస్తుంది.. అలాంటివారు మనస్సులోని అనుమానాల్ని వదిలేసి ఇకముందు ఎలా ఉండాలో చూసుకోవాలి.

08/08/2019 - 20:23

పేదరికంతో పరితపిస్తున్న ఇల్లాలిని చూసి జాలిచెంది ఆదిశంకరాచార్యులు ‘కనకధారాస్తవము’ను ఆశువుగా చెప్తూ
‘సరసిజ నిలయే సరోజహస్తే ధవళ తమాం శుక గంధమాల్య శోభౌ,
భగవతి హరివల్లభౌ, మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం’
అని లక్ష్మీదేవిని స్తోత్రంచేశారు. సువర్ణామలకవర్షమును వర్ణిపజేసి ఇల్లాలి దారిద్య్ర బాధను బాపిన కరుణామయి, భక్తపరాధీన, జగన్మాత శ్రీమహాలక్ష్మి.

Pages