S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
లేదా తాను వీరభద్రుని వద్దకు దౌత్యం వెళ్ళకుండానే, ఒక రోజంతా పట్టణంలో గడిపి మర్నాడు వచ్చి అతను అంగీకరించటంలేదని చెపితే?
ఇక్కడ ముక్కూ మొహం ఎరుగని వారి మధ్య జీవితాన్ని గడిపే దౌర్భాగ్యస్థితి ఇప్పుడులేదు. బాగా తెలిసిన, ఎరిగిన తన తోటి రమణులతోనే అనుభవించవలసిన శిక్షాకాలాన్ని గడపవచ్చు.
కాని అనారోగ్యంతో బాధపడుతూ, ఆరోగ్యాన్ని పొందగలిగినప్పుడు మరెంతగానో తాను ఆరోగ్యంగా ఉన్నప్పటికన్నా అత్యధికంగా ఆనందిస్తాడు. మనస్తత్వ పరిణామానికి సంబంధించిన ఈ న్యాయానే్న భగవంతుడు అమలుజరుపుతున్నాడేమో?
అదీగాక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే కదా మానవుడు నిజంగా హృదయపూర్వకంగా, ఆత్మశుద్ధితో ప్రార్థించేది? తనపైన మానవుని విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకుగాను విధి వేసే ఎత్తులివి!
చిత్రం! రాణి, సరస్వతులిద్దరే నిబ్బరంగా వున్నారు. రాజు విధించిన శిక్షను నవ్వుతూ కాకపోయినా, కిమ్మనకుండా అనుభవించేందుకు వారు సిద్ధమయ్యారు.
రాణి తనను ‘ప్రియసఖి’ అని పిలిచేది. ఇతరులు ‘రాణి ప్రాణసఖి’ అనేవారు. అదే నిజమైంది. తన ప్రాణానికీ, రాణి ప్రాణానికీ ఒకే విడివడని లంకె ఏర్పడింది అనుకున్నది సరస్వతి.
‘‘ఎన్నాళ్లుగా జరిపించావు రుూ నాటకాన్ని?’’
సరస్వతి నిర్జీవ ప్రతిమవలె ఉండిపోయింది.
‘‘నాలుగో ముద్దాయిని విచారించవలసిన పనిలేదు!’’ అన్నాడు రాజు.
‘‘నాలుగో ముద్దాయి కూడానా? ఎవరు ప్రభూ!’’ అన్నాడు మంత్రి.
ఆ నిజమేమిటో కక్కించగల సామర్థ్యం మాకున్నదనీ నీకు తెలుసు. సరే నీవిప్పడన్నమాటను కూడా అంగీకరిస్తున్నాను. నీకిస్తున్న ఒకో అవకాశమే నీ పాలిట యమపాశంగా మారుతుందని గుర్తుంచుకో!’’ అన్నాడు రాజు.
రాజు సరస్వతిని ఎందుకు ప్రశ్నించడం లేదో ఎవరికీ అర్థం కావటంలేదు. బహుశా జయపాలుని సాక్ష్యం ఇంకా పూర్తికాలేదని అందరూ అనుకుంటున్నారు.
హఠాత్తుగా రాజు ‘‘వీణ్ని సోదా చేయండి!’’ అన్నాడు జయపాలుణ్ని చూపుతూ.
రాజు నీచులెవర్నీ నమ్మే స్థితిలో లేడు. అందుకనే మంత్రినే స్వయంగా వెళ్లి రమ్మన్నాడు!
‘‘రక్షణ పర్యవేక్షణాధికారి ఎక్కడ?’’ అన్నాడు రాజు.
ఒక యువకుడు సమీపించి ధర్మపాలునికి నమస్కరించాడు.
రాజు అతన్ని తేరిపారజూచి ‘‘నీ పర్యవేక్షణ ఎంత బాగా నిర్వహించబడుతున్నదో వేరుగా విచారించవలసిన పనిలేదు!’’ అన్నాడు. ‘‘దీనికంతకూ నీవు పరోక్షంగా బాధ్యుడివి!’’
ఆ యువకుడు వొణికిపోయాడు.
ఆమె ఒక్కక్షణం రాజు వదనాన్ని సమీక్షించింది. ఆయన ముఖాన్ని కారుమేఘాలు కమ్మినవి. తీవ్రమైన ఆలోచనలలో ఆయన మునిగారని, సత్యాన్ని క్షణంలో, అర్జునుని వాడిబాణంతో పాతాళగంగ పైకి లేచి అంపశయ్యమీది భీష్ముని నోటికి అందినవిధంగా చేయగలరనే నమ్మకం సరస్వతికి ఏర్పడింది.
రాజు నోటినుంచి రాలే ముత్యాలు ఏరుకునేందుకు అందరూ సంసిద్ధులుగా ఉన్నారు. అవి నిజమైన రత్నాలే అవుతవనే ధైర్యంతో జయపాలుడు వేచి ఉన్నాడు.
‘‘నవరాత్రీ ఉత్సవాల్లో చూశాను మహారాజా! ఆ తరువాత నాకు అతనితో పరిచయమూ లేదు. నేను ఎరగనే ఎరగను.. ఇప్పుడు అతని పురుష రూపం బైటపడేదాకా ఎవరో కూడా నాకు తెలియదు!’’
‘‘మరి ఇంతకుముందు ‘ఇతను’ అని పురుషవాచకాన్ని ప్రయోగించావే.. స్ర్తి వేషంలో ఉన్నవాణ్ణి ఎలా గుర్తుపట్టావు? రుూ చీకట్లో అదెలా సాధ్యమైంది?’’ అన్నాడు ధర్మపాలుడు.
ప్రపంచంలో తెలివిగలవాళ్ళు మూర్ఖుల్ని మోసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అది సహజం కూడాను. ఐతే మూర్ఖులు కూడా ఒక్కోసారి అహంభావంతో, తాము కూడా తెలివిగల వాళ్ళమేనని పొరబడి, ఆ తెలివిని తెలివిగా ప్రయోగించబోయి, తమకు తెలియకుండానే బోర్లాపడి, తమ మూర్ఖత్వాల సంఖ్యకు మరొకటి కలుపుకుంటారు. ఇలాటిదే రుజూ అయ్యేందుకు జయపాలుడు ఇప్పుడు మరోసారి కొత్తగా ప్రారంభోత్సవం చేశాడని సరస్వతి పసిగట్టింది.