S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
జ్ఞానదానం చేసిన సద్గురువుకు దృష్టాంతం మూడు లోకాలలో కనపడదు. ‘స్పర్శమణి ఇనుప ముక్కను బంగారంగా మారుస్తుంది. దానిని దృష్టాంతముగా చూపవచ్చు కాదా’ అంటే అది యుక్తం కాదు. ఎందువల్లనంటే బంగారంలా మారిన ఇనుప ముక్క మరొక ఇనుప ముక్కను బంగారంగా మార్చలేదు. కాని గురువు పాదాలు ఆశ్రయించిన శిష్యుని తనంతటి వాడిగాను, మళ్లీ మరొకరిని కూడా అలా చేయగలవానిగాను తీర్చిదిద్దుతాడు. అందువల్ల సద్గురువుకు ఉపమానం అనేది లేదు.
హిందూసమాజంలో భక్తికి ఎంతో ప్రాధాన్యం ఉంది. విశ్వాసాలకు, నమ్మకాలకు అంతే విలువ ఉంది. గురువుకు విశిష్టస్థానం ఉంది. సామాన్యులకు మంచి చెప్పి, సన్మార్గంలో నడిపించేవాడే గురువు. అందులోభాగంగా శాస్త్రాలను ధర్మసూక్ష్మాలను సహేతుకంగా నేర్పేవాడు, వాటి అర్థాన్ని విడమర్చి చెప్పేవాడు ఆచార్యుడు. అలాంటి గురువులను ఎవరూ, ఎప్పుడూ విస్మరించరు. విస్మరించలేరు.
ప్రతి కార్యంలోనూ తొలి పూజలందుకునే దైవం, విఘ్న నాశకుడు శ్రీ వినాయకుడు. ఈయనకి 64 రూపాలున్నాయంటారు. వాటిలో 32 రూపాలు ముఖ్యమైనవనీ, మళ్లీ అందులో షోడశ రూపాలు అతి ముఖ్యమైనవని చెబుతారు. వీటిలో శే్వతార్క గణపతిని ఎక్కడా చెప్పకపోయినా తెల్ల జిల్లేడు వృక్షాలు 100 సంవత్సరములపైన వున్నట్లయితే వాటి మూలంలో గణపతి ఆకారం తయారవుతుందని ప్రశస్తి. అయితే ఇలాంటి గణపతి రూపం దొరకటం దుర్లభమని పెద్దలు చెబుతారు.
అరయ పుత్రకామేష్టియందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము శ్రీరామావతారము. యజ్ఞప్రసాదంగా చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యానందవర్థనుడై, దశరథ సుతుడై మానవ రూపంలో అవతరించాడు. శ్రీరాముని తళుకు చెక్కులపై ముద్దుపెట్టడానికి కౌసల్య తల్లి ఏమి తపము చేసిందో కదా! శ్రీరామా! రారా! అని పిలవడానికి దశరథ మహారాజు ఎంత తపస్సు చేశాడో కదా!
దశరథుని యజ్ఞ సమాప్తి చేశారు. సంవత్సరం గడిచింది. నవనవోనే్మషముగా చైత్రమాసం వచ్చింది. సృష్టిలోని సర్వ ప్రాణులల్లో చైతన్యం వచ్చినట్లుగా ఉంది. ప్రకృతి వసంతాగమనంతో పులకరిస్తోంది. అందులో శ్రీరాముని జననం. కౌసల్యాదశరథులతోపాటుగా సర్వలోకాలు, ప్రకృతి అంతా ఆనందమయంగా శ్రీరాముని పుట్టుకకు ఎదురుచూస్తున్నాయ. మంచి మూ హూర్తం రానేవచ్చింది. అంతఃపురంలో కౌసల్య శ్రీరామునికి జన్మనిచ్చింది.
కోరికలు బహు విచిత్రమైనవి. ఒక్కో కోరిక మనుజుని అధఃపాతాళానికి పడవేస్తుంది. మరో కోరిక ద్వారా అత్యున్నతమైన పదవి అంటే భగవంతుని సానిధ్యాన్నికూడా దరిచేరుస్తుంది. కనుకనే మనుజులు బాగా ఆలోచించిమాత్రమే కోరికలను కోరుకోవాలి. ఇహలోక సుఖాలన్నీకూడ క్షణభంగురమైనవి. జీవితం బుద్భుదప్రాయం. ఇక అందులో కోరికలు బహుస్వల్పకాలికమైనవి. జ్ఞానులు ఈవిషయాన్ని తెలుసుకొన్నవారు కనుక వారే కోరికలను కోరుకోరు.
జైమినీ మహర్షి పూర్వమీమాస ప్రవర్తకుడు, కుమారుల భట్టు ఈయనకు ప్రథమ శిష్యుడు. ఈయన కుమారస్వామి అంశతో జన్మించి ప్రసిద్ధిగాంచాడు. కుమారుల భట్టు వేదకర్మ మార్గాన్ని పునరుద్ధరించాలని, గట్టిగా కృషిచేసిన కర్మిష్టి. ఇతడు సాక్షాత్తు మతాన్ని ఉద్ధరించడానికి అరుదెంచిన కుమారస్వామి అవతారం. అయితే నాస్తికులైన బౌద్ధతత్త్వాన్ని తెలుసుగొనగోరి, ఒక బౌద్ధమతాచార్యుని ఆశ్రయించి, బౌద్ధమత తత్త్వాన్ని గ్రహించాడు.
స్తంభోద్భవుడు లక్ష్మీనరసింహుడిగా కొలువైన యాదాద్రిలో బ్రహ్మోత్సవ సంబరం భక్తజనులకు దివ్యానూభూతినిస్తుంది. లోక కల్యాణం, విశ్వశాంతులను కాంక్షిస్తూ ముక్కోటి దేవతలే ఆహుతులుగా 11రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో అత్యంత శుభప్రదమూ, లోకకల్యాణ కారమూఐన లక్ష్మీనరసింహుల తిరు కల్యాణోత్సవం ఈ 6న ఉదయం 11గంటలకు వైష్ణవ పాంచారాత్ర ఆగమశాస్తన్రుసారం కన్నుల పండువగా నిర్వహించబోతున్నారు.
ఆలయ ముఖ మండపం, సప్త రాజగోపురాలు, శిఖరాలు, ప్రాకారాలు, స్తంభాలు అన్ని నల్లసరం కృష్ణశిలలతో నిర్మితమవుతున్నాయి. ఇందుకు వేయి మంది శిల్పులు ఆహార్నిశలు పనిచేస్తున్నారు. వచ్చే దసరా నాటికి ప్రధాన ఆలయంలో భక్తులకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి.