S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2020 - 02:10

మచిలీపట్నం: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనడం హర్షణీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఆయన తన ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం నుండి రాత్రి వరకు ఇంట్లో ఉన్న ఆయన తనను కలిసేందుకు కూడా ఎవ్వరినీ ఇంటికి రావద్దని ముందుగానే చెప్పారు. దీంతో ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉండే తన కార్యాలయం వెలవెలబోయింది.

03/23/2020 - 02:09

గుడివాడ: ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన జనతా కర్ఫ్యూను ఇంకొంచెం ఓపికతో కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 7గంటల నుండి మంత్రి కొడాలి నాని రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

03/23/2020 - 02:09

నూజివీడు: కరోనావైరస్ వ్యాప్తి నివారణకై దేశ ప్రధాని నరేంద్రమోడి ఇచ్చిన పిలుపుమేరకు నూజివీడు డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రతి ఒక్కరూ బయటకు రాకుండా ఇళ్ళకే పరిమితం అయ్యారు. డివిజన్ పరిధిలోని ఆయా మండలాలతో పాటు పట్టణంలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రజలు ఎవరూ బయటకు రాలేదు. పట్టణంలోని వర్తక, వాణిజ్య దుకాణాలను ఎవ్వరికి వారే స్వచ్చంధంగా మూసివేశారు.

03/23/2020 - 02:07

హైదరాబాద్: కోవిడ్-19 వైరస్‌ను కట్డడి చేసేందుకు ప్రదాని నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణను పాటించారు. కొన్ని చోట్ల ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య పాలు, కూరగాయాలు, నిత్యావసర వస్తువుల విక్రయాలు అంతంతమాత్రంగా కొనసాగినా, ఆ తర్వాత జనం ఇళ్లకే పరిమితమయ్యారు.

03/23/2020 - 02:06

ఖైరతాబాద్: కోవిడ్‌ను కట్టడి చేసేందుకు నగర ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనడంతో మహానగరంలో వాయు కాలుష్యం తగ్గింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మరి కరోనాను కట్టేటి చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అనుహ్య స్పందన లభించడంతో ఇది సాధ్యం అయింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సైతం తమకు తాముగా బంద్‌ను పాటించాయి. దీంతో వాహనాలు రోడ్లు ఎక్కలేదు.

03/23/2020 - 02:05

ఖైరతాబాద్: కోవిడ్-19 అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యం బిజీగా గడిపే నగర ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొద్దిపాటి సమయం దొరికితేనే ఫోన్లను చూసుకునే ప్రజలు 24 గంటల పాటు ఎటూ పోలేని పరిస్థితి నెలకొనడంతో ఫోన్లకే అతుక్కుపోయారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే సందేశాలు, వీడియోలను చూస్తూ వాటిని ఇతరులకు ఫార్వాడ్ చేయడంలో బీజీగా మారారు.

03/23/2020 - 02:04

ఖైరతాబాద్: కంటికి కనిపించని సూక్ష్మజీవి బడుగు జీవితాలపై పంజా విసిరుతోంది. ఎక్కడో చెనాలో బయటపడ్డ వైరస్ ఖండాంతరాలను దాటుకొని ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఓ వైపు ప్రాణభయం మరో వైపు బతుకు భయం సగటు నగర జీవిని వెంటాడుతుంది. 30 రోజుల పాటు శ్రమించి పనిచేస్త వచ్చే నెలసరి వేతనం ఇళ్లు గడవడానికి అంతంత మాత్రంగా సరిపోతుంది.

03/23/2020 - 02:04

మేడ్చల్, మార్చి 22: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 (కరోనా) వైరస్ నియంత్రించే క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు మండలంలోని డబిల్‌పూర్, పూడూరు, గౌడవెళ్లి తదితర గ్రామాల్లో వందకు వంద శాతం విజయవంతమైంది. నిజమైన కర్ఫ్యూకు కూడా ఇంతటి స్పందన లభించదేమో అంటే అతిశయోక్తి కాదేమో.

03/23/2020 - 02:03

జీడిమెట్ల, మార్చి 22: దేశ ప్రధాని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుంచి నియోజకవర్గం ప్రజలు బయటికి రాకుండా ఇంటికే పరిమితం అయ్యారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు ఎవరిని బయటికి రాకుండా చర్యలు తీసుకున్నారు.

03/23/2020 - 02:03

ఉప్పల్, మార్చి 22: ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను శాశ్వతంగా తరిమికొట్టేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ పీర్జాదిగూడ పట్టణంలో విజయవంతమైంది. ఉప్పల్ బస్‌డిపో, చెంగిచర్ల బస్‌డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు వెల్లకుండా ఇంట్లోనే బందీ అయ్యారు.

Pages