S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఏప్రిల్ 13: దేశం కాని దేశం అమెరికాలో గడచిన నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పడుతున్న కష్టాలను ఇప్పటికైనా గుర్తించి స్వస్థాలకు రప్పించే విషయంలో తక్షణం దృష్టి నిలపాలని కోరుతూ టీడీపీఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి పారిశ్రామికవేత్త కె బుచ్చిరాంప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
విజయవాడ, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉన్నందున తక్షణమే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డికి లేఖ రాశారు.
విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: సీఎం జగన్ ఇచ్చే మాస్కులు పేద ప్రజల ఆకలి తీర్చవని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న తెలిపారు. మాస్కులతో పాటు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం ప్రతీ ఒక్కరికీ వేయాలని సోమవారం ట్విట్టర్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు. మూడు మాస్కులతో పాటు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం పంపితే ప్రజల ఆకలి తీరుతుందన్నారు.
విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: అప్పుడు లక్షలాది మంది చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగా మనం ఈరోజు సేచ్ఛను అనుభవిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్లో కాల్పుల్లో అమరులైన వారికి నివాళులు అర్పిద్దాం అంటూ సోమవారం ట్విట్టర్లో ది గార్డియన్ - లండన్ అనే కథనాన్ని పోస్టు చేశారు.
విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మూడేసి చొప్పన ఎన్ 95 మాస్క్లను అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కరోనాపై ఓ బ్రహ్మాస్త్రం వంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కరోనాపై జరుగుతున్న పోరులో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడగమంటూ సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పలు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన రాష్ట్రప్రభుత్వం కొత్త కమిషనర్గా మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.
పెనమలూరు, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని కోటీ 40లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పూర్తి స్టాక్ ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.
విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినా అధికారులు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ వి కనగరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, పరిస్థితులు కుదుటపడిన తరువాత ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాల్సి వొచ్చినా అందుకు సర్వ సన్నద్దంగా ఉండాలన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: గత మూడు వారాలుగా భారత దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ వల్ల అనూహ్య రీతిలో దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. మంగళవారం ముగుస్తున్న ఈ 21 రోజుల లాక్ డౌన్ కాలంలో దాదాపుగా భారత దేశం అంతా మూత పడింది. ఫ్యాక్టరీలు పని చేయలేదు, వ్యాపారాలు నడవలేదు, విమానాలు తిరగలేదు, రైళ్ళు పట్టాలు ఎక్కలేదు. వాహనాల రాకపోకలు కూడా దాదాపుగా ఆగిపోయాయి.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వివిధ క్లబ్లు మూతపడ్డాయి. ఆటగాళ్లు తమతమ ఇళ్లకు లేదా వసతి గృహాలకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇబ్రహిమోవిచ్ ప్రాక్టీస్ సెషన్కు హాజరుకావడం చర్చనీయాంశమైంది
*చిత్రం... తనకు వాటా ఉన్న హామర్బీ ఫుట్బాల్ క్లబ్ ఆటగాళ్లతో కలిసి స్టాక్హోమ్స్లో ప్రాక్టీస్ సెషన్కు హాజరైన సాకర్ లెజెండ్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్.