S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 05:52

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని స్థితి నెలకొంది. ఏరోజు కారోజు జీవనాధారం కలిగిన చిరు వ్యాపారులు వాన ముసురు వల్ల వ్యాపారాలు లేక ఉపాధి కోల్పోయారు. రాజమహేంద్రవరం పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది నగరంలో చిరు వ్యాపారాలు చేసుకునే నిమిత్తం వస్తుంటారు.

09/23/2016 - 22:10

తిరుపతి, సెప్టెంబర్ 22: జార్ఖండ్‌కు చెందిన త్రివేణి ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి టిటిడికి రూ.11 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు విరాళం చెక్కును తిరుపతికి చెందిన పసుపర్తిగోపినాథ్, రాఘవేంద్ర కలిసి గురువారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు.

09/23/2016 - 22:26

రాజుపాళెం, సెప్టెంబర్ 22: రాజుపాళెం - అయ్యవారుపల్లె గ్రామాల మధ్య మడవంకపై నిర్మించిన లో లెవెల్ కాజ్‌వే స్లాబ్ వంక ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో గురువారం ఈ రహదారి గుండా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో కురిసిన వర్షాలకు కాజ్‌వేస్లాబ్‌లు భూమిలోకి కృంగిపోయాయి. దీనివల్ల ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్ల రాకపోకలు నిలిచిపోయాయి.

09/23/2016 - 05:47

చక్రాయపేట, సెప్టెంబర్ 22:మండలంలోని సురభి గ్రామం నాగలగట్టుపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న శివప్రసాద్ తన భార్యను ఈ నెల 9వ తేదీ పంజాబు డ్రస్సు ఓనీతో గొంతును బిగించిన విషయం విదితమే. 8 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరు పట్టణం బాలాజీనగర్‌లో ఆదినారాయణ ఏకైక కుమార్తె శివమ్మను పెండ్లి చేసుకున్నాడు. అప్పట్లో 8 తులాల బంగారు కట్నంగా ఇచ్చారు. శివప్రసాద్‌ది రాయచోటి మాసాపేట సొంత గ్రామం.

09/23/2016 - 05:45

పామిడి, సెప్టెంబర్ 22: వ్యవసాయం కోసం చేసిన అప్పులు అధికం కావటం.. భార్య పుట్టింటికి వెళ్ళిపోవటంతో విరక్తి చెందిన తలారి శివ (30) పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని అనుంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి..

09/23/2016 - 21:57

గుత్తి, సెప్టెంబర్ 22 : గుత్తి పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుండడంతో కొంతమంది వ్యాపారులు అక్రమంగా లేఅవుట్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా అధిక లాభాలు గడించడానికి అలవాటు పడ్డ వ్యాపారులు ఎలాంటి అనుమతులు పొందకుండా లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణం మున్సిపాలిటీగా మారడంతో ఈప్రాంతంలో భూములకు మరింత విలువ పెరిగింది.

09/23/2016 - 05:42

పోలవరం, సెప్టెంబర్ 22: పోలవరం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలువలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం మండలంలో ప్రధాన కాలువైన కొవ్వాడ పొంగడంతో రిజర్వాయర్‌కు భారీగా నీరు చేరుకుంది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 91 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 84.85 మీటర్లు ఉంది. పది రోజులుగా వర్షాలు కురుస్తున్నా కొవ్వాడ కాలువ పొంగకపోవడంతో రిజర్వాయర్‌లోని నీటిమట్టం కనిష్ఠ స్థాయిలోనే ఉంది.

09/23/2016 - 05:42

ఏలూరు, సెప్టెంబర్ 22: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్ధానిక శ్రీ కనె్వన్షన్ సెంటరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో విద్యార్ధినీవిద్యార్ధులతో జగన్ ముఖాముఖి ఆసక్తికరంగా సాగింది. ఒక విద్యార్ధిని ఫీజు రీఎంబర్స్‌మెంట్ విధానాన్ని ప్రస్తావించి ఇప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి మీరు సిఎం అయితే... యువతరానికి ఏం చేస్తారంటూ ప్రశ్నించింది. జగన్ సిఎం అయితే...

09/23/2016 - 05:41

ఏలూరు, సెప్టెంబర్ 22: టెక్నాలజీ సహకారంతో తన కంప్యూటర్ డాష్‌బోర్డులో అన్నీ చూస్తా... ఏ అధికారి ఎక్కడ ఉన్నారో క్షణాల్లో తెలిసిపోతుంది... నిర్దేశించిన పనిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు.

09/23/2016 - 05:41

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 22: ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ సంవత్సరం పైబడి సెలవులో వెళితే వారిని విధుల్లోంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో గురువారం డయాలసిస్ చేయించుకునే రోగితో వచ్చేవారికి వేచి ఉండే భవనాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.

Pages