S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరో వివాదంలో ఇరుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ మేగజైన్కు నగ్నంగా పోజిచ్చినప్పటి మెలానియా ఫొటోలను న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ప్రచురించగా, 1995లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధనలు ఉల్లంఘించారని తాజాగా ఆరోపణలు వచ్చాయి.
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నామని, 17,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం తెలిపారు. 19 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారని, 1300 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని , మరిన్ని బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.
దిల్లీ: తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఏపీకి ఇచ్చిన హామీలను ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చి సభా గౌరవాన్ని కాపాడాలని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ శుక్రవారం డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన హామీలపై 2014, మార్చి 1న అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఆ ముసాయిదా ప్రతిని రాష్ట్రపతికి పంపగా ఎన్నికల షెడ్యూల్ ఉన్నందున ఆగిపోయిందన్నారు.
హైదరాబాద్: ఏడాది నుంచి సకాలంలో జీతాలు అందడం లేదని, విశ్రాంత ప్రొఫెసర్లకు పెన్షన్లు అందడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పారు. వేతనాలు చెల్లించడం లేదని ఓయూ పరిపాలనా భవన్ ఎదుట శుక్రవారం వారు ధర్నా నిర్వహించారు. అలవెన్స్లు ఇవ్వడం లేదని, ఈ నెల ఇంకా వేతనాలు అందలేదని, ఇదే కొనసాగితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఓయూ ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై చర్చ పూర్తయిందని, కోరం లేక ఓటింగ్ వాయిదా పడిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ శుక్రవారం చెప్పారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎప్పుడూ ద్రవ్య బిల్లు కాదని, ఈ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టం అక్కర్లేదని అన్నారు. బిల్లుకు మద్దతిచ్చిన 11 పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: నాగోల్ బండ్లగూడలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను, బండ్లగూడ, పోచారంలో ఉన్న 5వేల ప్లాట్లను విక్రయించాలని గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. ఆ పాట్ల బహిరంగ వేలం ఆగస్టు 7 నుంచి 17 వరకు ఉంటుందని తెలిపారు. నాగోల్ బండ్లగూడలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను మంత్రి పరిశీలించారు.
హైదరాబాద్: ఏపీ ఉద్యోగులకు సహచర తెలంగాణ ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సచివాలయంలో గురువారం ఇరురాష్ట్రాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
హైదరాబాద్: జీవో 123పై తీర్పును హైకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. జీవో 123ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. షెడ్యూల్ 2 ప్రకారం రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. జీవోపై విధివిధానాలు రూపొందించుకుని రావాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
మెదక్: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా గజ్వేల్ సభలో 2లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామని, సభా వేదికపై 18 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. సభా ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ప్రధాని పర్యటన కోసం 4 హెలీప్యాడ్లు సిద్ధం చేశామని చెప్పారు. ఐదు కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు.
హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్టడీ సర్కిల్లో శుక్రవారం కూడా విద్యార్థుల దీక్షలు కొనసాగాయి. నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను గురువారం అరెస్టు చేసినప్పటికీ దీక్షలను కొనసాగిస్తున్నారు. స్టడీ సర్కిల్ ఆవరణలో షామియానాలు వేసేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో విద్యార్థులు ఎండలోనే దీక్షలు చేపట్టారు.