S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూలై 20: మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందని ఆరోపించిన ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పేవరకు ఆయన్ను తెలంగాణలో అడుగు పెట్టనీయమని బిజెపి శాసనసభాపక్షం ఉప నాయకుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు. గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సెతో ఆర్ఎస్ఎస్కు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రభాకర్ బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.
నల్లగొండ, జూలై 20: నల్లగొండ జిల్లాలో సాగర్ టెయిల్ పాండ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం సహాయ, పునరావాసం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టెయిల్పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ నిర్వాసిత గ్రామాల మీదుగా టెయిల్పాండ్ వరకు రెండు రోజుల పాదయాత్రను పెద్దవూర మండలం జమ్మనకోట నుండి ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్, జూలై 20: త్రేతాయుగంలో లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తాటకి, మారీచుడు, సుభాహుడు వంటి రాక్షసులు ప్రయత్నించినట్టుగానే, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను డికె అరుణ, రేవంత్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డిలు అడ్డుకుంటున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.
ఇటిక్యాల, జూలై 20: కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని మంగళవారం చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు ఎర్రవల్లి చౌరస్తాలో ప్రారంభమై బోరవెల్లి వరకు కొనసాగింది.
హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో నాలుగు జిల్లాలను అనుసంధానం చేస్తూ 290 కి.మీ రీజనల్ రింగ్ రోడ్డుకు అయ్యే వ్యయంపై ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ఈ రోడ్డును వీలైనంత త్వరలో చేపడతామని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం 158 కి.మీ పొడువు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసిన విషయం విదితమే.
గజ్వేల్, జూలై 20: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆగస్టు 7న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సుదర్శన యాగంతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఅర్ ప్రారంభించనుండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశమున్నట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
సూర్యాపేట, జూలై 20: గుడ్ మార్నింగ్.. సూర్యాపేట్... వినండి.. వినండి.. ఉత్సాహంగా... ఉల్లాసంగా... అంటూ ఎఫ్ఎం సేవలు నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి అభ్యర్థన మేరకు తక్షణమే సూర్యాపేటలో ఎఫ్ఎం స్టేషన్ పనులను ప్రారంభించాలని కేంద్ర సమాచార పౌరసంబంధాల, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.
విశాఖపట్నం, జూలై 20: విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ను నౌకాదళ సేవల నుంచి త్వరలో ఉపసంహరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఆ నౌకను మ్యూజియంగా తీర్చిదిద్దే వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ నెల 23న ముంబయి నుంచి ఆఖరి సారిగా కొచ్చిన్కు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయవాడ, జూలై 20: తెలుగువారు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని, మనవాళ్లు ఎక్కడ అవకాశాలు ఉన్నా అందిపుచ్చుకుని ముందంజలో ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం సిఎంఓలో విదేశీ విద్యార్థి దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాపు కార్పొరేషన్ ఎంపిక చేసిన 145 మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
విశాఖపట్నం, జూలై 20: పెద్ద నగరాల మాస్టర్ ప్లాన్ను సమీక్షించాల్సిన అవసరం ఉందని పబ్లిక్ అంకౌంట్స్ కమిటీ చైర్మన్ బి రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలో మూడు రోజుల పాటు వివిధ అంశాలపై సమీక్షించిన కమిటీ బుధవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ అవరాలకు అనుగుణంగా నగరాల మాస్టర్ ప్లాన్కు సవరణలు చేయాల్సి ఉందని, ఈ అంశాన్ని తాము ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.