S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీనగర్: బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. సోపోర్లో ఉగ్రవాదులు మకాం వేసినట్టు సమాచారం అందడంతో జవాన్లు అక్కడికి వెళ్లారు. జవాన్ల రాకను గమనించి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో సైనికులు కూడా తుపాకులు పేల్చారు. ఓ ఉగ్రవాది మరణించగా మిగతావారంతా తప్పించుకున్నారు.
రాంచీ: ఝార్ఖండ్లోని గిరిధ్ జిల్లా హెసాలో-పిర్టన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్పిఎఫ్ కమాండర్ హరజన్ మరణించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ జరిపేందుకు సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్లారు. వారిని పసిగట్టిన మావోలు తుపాకులు పేల్చారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కమాండర్ మరణించగా ఓ జవాన్ గాయపడ్డాడు.
విశాఖ: ‘నా మరణానికి ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు.. మూడు నెలలుగా విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నా..’- అని రాసిన సూసైడ్ నోట్ను సిబిసిఐడి పోలీసులు పాడేరు ఎఎస్పీ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నారు. ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ప్రారంభించిన సిఐడి పోలీసులు శుక్రవారం ఆయన కార్యాలయంలో క్షుణ్ణంగా సోదాలు చేశారు.
విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
హైదరాబాద్: జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకు శాఖలో గురువారం అర్ధరాత్రి చోరీకి ఇద్దరు దుండగులు విఫల యత్నం చేశారు. షట్టర్ను తొలగించి బ్యాంకు లోపలికి వచ్చిన వారు స్ట్రాంగ్రూమ్ను తెరిచేందుకు యత్నించారు. బ్యాంకు నుంచి వారు వెనుదిరుగుతున్న సమయంలో ఓ ఆగంతకుడు గస్తీ పోలీసులకు చిక్కాడు. దుండగులిద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందినవారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: తాను రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పదవులను చేపట్టినా అందుకు తల్లిలాంటి భారతీయ జనతా పార్టీయే కారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భావోద్వేగంతో అన్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఆయనకు శుక్రవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది.
హైదరాబాద్: పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ నుంచి ఏడు లక్షల రూపాయల నగదు, నగలను ఆగంతకులు దోచుకున్న ఘటన నేరేడ్మెట్ గోకుల్నగర్లో శుక్రవారం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు లాకర్ నుంచి నగదు, నగలు తీసుకుని వస్తుండగా దుండగులు వెంబడించి ఆమె హ్యాండ్బ్యాగును లాక్కుని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆగంతకుల కోసం ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: సెల్ఫోన్ చోరీ చేసిన విషయం చెప్పేస్తారన్న భయంతో ఓ యువకుడు ఇద్దరు పిల్లలను హతమార్చిన ఘటన నగర శివారులోని హయత్నగర్లో శుక్రవారం వెలుగు చూసింది. సోహాన్ అనే యువకుడు రామ్కుమార్కు చెందిన సెల్ఫోన్ను దొంగిలించాడు. ఈ విషయం రామ్కుమార్ పిల్లలు ధన్రాజ్, ముఖేష్లకు తెలిసిపోయింది. దీంతో ఈ ఇద్దరు పిల్లలను బండరాయితో మోది సోహాన్ హత్యచేశాడు.
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో లాభనష్టాలు, తాజా స్థితిగతులపై సిఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో రవాణామంత్రి మహేందర్రెడ్డి, ఆర్టీసీ ఎండి రమణారావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. నష్టాలను అధిగమించలేకుంటే ఆర్టీసీని మూసి వేయడం ఉత్తమమని సిఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై సిబిసిఐడి అధికారులు శుక్రవారం ఉదయం విచారణ ప్రారంభించారు. పాడేరులోని ఆయన అధికారిక నివాసంలో సాక్ష్యాధారాలను సేకరించారు. ఎఎస్పీ ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తూ రివాల్వర్ పేలిందా? అన్న అనుమానాలు రావడంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిబిసిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.