S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 01:27

హైదరాబాద్, మే 2: దేశవ్యాప్తంగా వైద్య విద్య యుజిలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మంగళవారం వాదనలు వినిపించనున్నాయి. ఇదిలావుంటే, తెలంగాణ ఎమ్సెట్ మెడికల్ పరీక్ష సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం స్పష్టం చేశారు.

05/03/2016 - 01:22

న్యూఢిల్లీ, మే 2: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో ఏడవ వేతన కమిషన్ చేసిన సిఫారసుల కంటే అధిక మొత్తంలో వేతనాలను అందుకోనున్నారు. ఏడవ వేతన కమిషన్ సిఫారసులపై సమీక్ష జరిపిన కార్యదర్శుల గ్రూపు ఇప్పటికే తమ నివేదికను సిద్ధం చేసినట్లు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. వేతన కమిషన్ సిఫారసుల కంటే కేంద్ర ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతభత్యాలు ఇవ్వాలని ఈ గ్రూపు తమ నివేదికలో సిఫారసు చేయడం ఆశ్చర్యకరమైన అంశం.

05/03/2016 - 05:03

విజయవాడ, మే 2:‘మేం చేసిన తప్పేంటి? రాష్ట్ర విభజనను మేం కోరుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకోవడం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలి. దాన్ని ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించి 30సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర పెద్దల్ని కలిశాను.

05/03/2016 - 01:17

విజయవాడ, మే 2: ‘కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోంది. ఈ సమస్య రోజురోజుకూ జటిలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నదీ జలాల వివాదంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ తరువాత జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు ఈ వివరాలను విలేఖర్లకు తెలిపారు.

05/03/2016 - 01:15

విజయవాడ, మే 2: రాష్ట్రంలో ఉద్యానవన రైతుల రుణాలను కూడా రద్దుచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల రుణమాఫీపై చర్చ జరిగింది. రాష్ట్రంలో రైతులకు మొదటి విడత రుణమాఫీని విజయవంతంగా పూర్తిచేశామని, రెండోవిడత రుణమాఫీకి 3,331 కోట్ల రూపాయలను విడుదల చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు విలేఖరుల సమావేశంలో చెప్పారు.

05/03/2016 - 01:06

నిడదవోలు, మే 2: వరుసకు కొడుకయ్యే పనె్నండేళ్ల బాలుడిని గొంతు నులిమి హత్యచేసి, మేనల్లుడయ్యే యువకుడిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన ఉన్మాది ఉదంతమిది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

05/03/2016 - 01:02

విజయవాడ,మే 2: విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో సోమవారం మరో ఘోరం జరిగింది. డాక్టర్లు, సిబ్బం ది నిర్లక్ష్య కారణంగా నాలుగురోజుల ఓ పసికందు తీవ్రం గా చీములు కుట్టి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై వామపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. పరామర్శించేందుకు వచ్చిన శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌ను ఘెరావ్ చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించకుండా పరామర్శకు వస్తారా?

05/03/2016 - 00:57

హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండురోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ వైకె రెడ్డి సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ వాతావరణలో వచ్చిన స్వల్పమార్పుల వల్ల చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వివరించారు.

05/03/2016 - 00:45

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సర్వోచ్ఛమైనది లోక్‌సభ- దానిపై పాక్ ఉగ్రవాదుల దాడికి వెనుక అఫ్జల్‌గురు ఉన్నాడు. అతగాడిపై సుదీర్ఘకాలంపాటు విచారణ జరిగింది. చివరికి నేరస్థుడని రుజువైన తర్వాత ఉరితీశారు. మరి ఇలాంటి సుదీర్ఘ ప్రకియ చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాల్లో కాని అరేబియా, పాకిస్తాన్ వంటి మతరాజ్య దేశాల్లో కాని జరగదు.

05/03/2016 - 00:43

పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికార పక్షం ఉదార స్వభావంతో వ్యవహరించాలి తప్ప ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయటం సమర్థనీయం కాదు. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత మొదటి వారం సమావేశాల్లో ప్రతిపక్షం కంటే అధికార పక్షమే కొంచెం అతిగా వ్యవహరించిందని చెప్పకతప్పదు.

Pages