S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 02:14

నూజివీడు, ఏప్రిల్ 30: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాలల పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

05/01/2016 - 02:13

నందిగామ, ఏప్రిల్ 30: అధికారుల తీరుపై నగర పంచాయతీ చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం 2.30 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మెజార్టీ సభ్యులు వచ్చినప్పటికీ ఇన్‌చార్జి కమిషనర్, ఎఇ రామకృష్ణ సమయానికి రాకపోవడంతో అరగంట ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది.

05/01/2016 - 02:07

జి.కొండూరు, ఏప్రిల్ 30: రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని కెడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు అన్నారు. జి.కొండూరు పిఎసిఎస్‌లో పినపాక గ్రామానికి చెందిన దొప్పల మంగయ్య అనే రైతుకు రుణం కింద మంజూరు చేసిన ట్రాక్టర్‌ను శనివారం ఆయన అందజేశారు.

05/01/2016 - 02:07

మచిలీపట్నం, ఏప్రిల్ 30: చిత్తశుద్ధితో పనిచేసి జిల్లాకు పేరుప్రతిష్ఠలు తీసుకురావాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులకు విజ్ఞప్తి చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి.

05/01/2016 - 02:06

కలిదిండి, ఏప్రిల్ 30: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, గ్యాస్ సిలెండర్ పేలిన కారణంగా నాలుగు పూరిళ్లు, మూడు బడ్డీకొట్లు దగ్ధమైన సంఘటన శనివారం మండల పరిధిలోని ఆరుతెగలపాడులో జరిగింది. గ్రామానికి చెందిన కందుల పాపారావు, చిలుకూరి కోటేశ్వరమ్మ, పేకేటి నాగమణి, లంకా చిన్నయ్య పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాలిపర్తి శోభనాద్రి, దేవదాసి నక్కబాపనయ్య, నీలపాల మహంకాళి బడ్డీకొట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

05/01/2016 - 02:05

మచిలీపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో పట్టణీకరణ, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి నారాయణ అన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించనున్న పురపాలక సంఘ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ చేశారు.

05/01/2016 - 02:04

మైలవరం, ఏప్రిల్ 30: సినీఫక్కీలో ఐదున్నర లక్షల రూపాయలు దోచుకొని పరారైన నిందితుల ఉదంతమిది. ప్రకాశం జిల్లా వెల్దుర్తి మండలం సింగిరిపాడు గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వరరావు అనే రైతు ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన హనుమంతరావు అనే రైతు వద్ద పనిచేస్తూ సీజన్‌లో అతని మిరపకాయలను గుంటూరు తీసుకెళ్లి అమ్ముకొస్తుంటాడు. ఎప్పటిమాదిరిగానే హనుమంతరావుకు చెందిన మిర్చిని శనివారం గుంటూరు తీసుకెళ్లి విక్రయించాడు.

05/01/2016 - 01:59

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 30: మండలంలోని వేగవరం సమీపంలో హైదరాబాద్ నుండి పెద్దాపురం వెడుతున్న గోల్డెన్ ట్రావెల్ బస్సు, కాకినాడ నుండి జగ్గయ్యపేట సిరామిక్ లోడుతో వెడుతున్న లారీ శనివారం తెల్లవారుజాము ఎరురెదురుగా ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కు పోవడంతో స్థానికులు చాకచక్యంగా అతన్ని బయటకు తీయగలిగారు.

05/01/2016 - 01:59

మొగల్తూరు, ఏప్రిల్ 30: విజయవాడ రైల్వే డివిజన్ సలహా సంఘ సభ్యునిగా మొగల్తూరు గ్రామానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు చెల్లుబోయిన వెంకట శ్రీనివాస్‌వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రసాద్‌కు విజయవాడ రైల్వే డివిజన్ డిసిఎం ఎన్ సత్యనారాయణ శనివారం నియామక పత్రం అందజేశారు.

05/01/2016 - 01:58

ఏలూరు, ఏప్రిల్ 30 : ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుడివాడ రామచంద్రకిషోర్‌ను మేయర్ షేక్ నూర్జహాన్ ఘనంగా సత్కరించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కిషోర్‌ను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి మేయరు శుభాకాంక్షలు తెలిపారు.

Pages