S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 07:32

గురజాల/దాచేపల్లి, ఏప్రిల్ 29: పంట సంజీవని పథకం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్రంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలోని నడికుడిలో పంట సంజీవని పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, కూలీలతో కొంత సమయం ముచ్చటించారు.

04/30/2016 - 07:31

విజయనగరం/విశాఖపట్నం, ఏప్రిల్ 29: మావోయిస్టు కార్యకలాపాలను అణచివేయడంలో ప్రభావిత రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణ అమలు చేయాలని నాలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

04/30/2016 - 07:28

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ‘దేవాలయాల్లో నిత్యం భగవంతునికి ధూప దీప నైవేధ్యాలర్పించే అర్చకులు ఉపాధి కూలీల పాటి చేయరా!, అర్చకులకు కనీస వేతనం అమలు చేయకుండా పాలకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం’ అంటూ విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మండిపడ్డారు. నవ్యాంధ్ర అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు స్వామీజీని శుక్రవారం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

04/30/2016 - 07:22

లండన్, ఏప్రిల్ 29: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్‌కు తిరిగివచ్చేది లేదని తేల్చిచెప్పేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను దేశం విడిచిరావల్సి వచ్చిందని ఆయన చెప్పారు. పాస్‌పోర్టు రద్దుచేయడం లేదా అరెస్టు చేయడం ద్వారా తన నుంచి బాకీ ఎలా వసూలు చేయగలరని ఆయన ప్రశ్నించారు.

04/30/2016 - 07:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన 25 రహస్య ఫైళ్లను ప్రభుత్వం బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ పేరుతో ఓ స్మారక మందిరం నిర్మించనున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది.

04/30/2016 - 07:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ-వాఘ జాయింట్ చెక్‌పోస్టు వద్ద 350 అడుగుల జాతీయ పతకాన్ని బిఎస్‌ఎఫ్ ఏర్పాటు చేయనుంది. అంతేకాదు పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి చూస్తే కనిపించేటంత ఎత్తులో త్రివర్ణ పతకం కొలువుతీరనుంది. అట్టారీ-వాఘ సరిహద్దులోనే బిఎస్‌ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు రిట్రీట్ నిర్వహిస్తుంటారు.

04/30/2016 - 07:18

న్యూయార్క్, ఏప్రిల్ 29: భారత్‌తో సం బంధాలను మెరుగుపర్చుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, అయితే భారత్ మాత్రం కేవలం ఉగ్రవాదంపై మాట్లాడడానికే ఆసక్తి కనబరుస్తోందని, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబందాల మెరుగుకు అది ఎంతమాత్రం తోడ్పడజాలదని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి మలీహా లోధీ అన్నారు.

04/30/2016 - 07:15

విజయవాడ, ఏప్రిల్ 29: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలోని ఈ-సేవా కార్యాలయం పైఅంతస్తులో ఐటి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న శుక్రవారం ప్రారంభించారు.

04/30/2016 - 07:13

గుంటూరు, ఏప్రిల్ 29: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి తెలుగుదేశం గూటికి చేరారు. శుక్రవారం గుంటూరు టుబా కో మర్చంట్స్ అసోసియేషన్ హాలు లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాదె వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడు గాదె వెంకటేశ్వరరెడ్డి, తనయుడు మధుసూదనరెడ్డి మరో 300 మందికి పైగా అనుచరులు, కార్యకర్తలకు పచ్చకండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

04/30/2016 - 07:11

హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో విద్యార్థులు అయోమయంలో పడగా, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలపై పూర్తిస్థాయి బెంచ్‌కు అప్పీలుకు వెళ్తామని ప్రకటించాయి.

Pages