S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన ఒక కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, మరో 13 మందిపై నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకుగాను అభియోగాలను నమోదు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్ఓ) వడ్డీ రేటును కేంద్రం .1 శాతం పెంచింది. వడ్డీ రేటును 8.7 శాతం నుంచి 8.8 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో తనిఖీలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేవనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ విజిలెన్స్ దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
మహబూబ్నగర్, ఏప్రిల్ 29: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే బంగారు తెలంగాణ కల సాకారం కానుందని భారీ నీటిపారుదల శాఖా మంత్రి టి హరీశ్రావు అన్నారు. ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి తెలంగాణలోని పలు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు ప్రకటించారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 29: పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కల్హేర్ మండలం సుల్తానాబాద్ గ్రామ శివారు నల్లచెరువు వద్ద పశువుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే మారెడ్డి భూపాల్రెడ్డి శుక్రవారం ఉదయం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
వర్ధన్నపేట, ఏప్రిల్ 29: మిషన్ కాకతీయ పనులతో ఎన్నో సంవత్సరాలుగా మరమ్మత్తులకు నోచుకోని చెరువులు కుంటలు పూర్తిస్థాయి పునర్నిర్మాణం జరుగుతున్నాయని వర్ధన్నపేట శాసన సభ్యుడు అరూరి రమేష్ అన్నారు.
వెంకటాపురం, ఏప్రిల్ 29 : మండలంలోని వెంకటాపురం, నారాయణపురం, నర్సాపురం గ్రామాల పరిధిలోని చెరువుల పునరుద్ధరణ పనులను మిషన్కాకతీయ రెండోదశ కింద ఆయా గ్రామాల సర్పంచ్లు శుక్రవారం ప్రారంభించారు.
చేర్యాల, ఏప్రిల్ 29: అత్తింటి వారి వేధింపులకు మరో వివాహిత బలైన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన ఇప్పకాయల మల్లేశం కూతురు ఇప్పకాయల అమరేశ్వరి(25) వివాహం హైదరాబాద్లోని రసూల్పురలో నివాసం ఉంటున్న సామల వెంకటేశ్తో గత 11నెలల క్రితం జరిగింది.
వరంగల్, ఏప్రిల్ 29: పోలీసుల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు దత్తత తీసుకున్న గ్రామం పెంబర్తిలో చెరువు పూడికతీత పనులను కమిషనర్ సుధీర్బాబుతో కలిసి ప్రారంభించారు.
ఏటూరునాగారం, ఏప్రిల్ 29: మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం కెనరాబ్యాంకులో వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్న సురేందర్రెడ్డి(45) పురుగులమందు సేవించి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానిక ఎస్సై మోతె నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్లా సిద్దిపేటకు చెందిన సురేందర్రెడ్డి గత మూడు సంవత్సరాలుగా కెనరాబ్యాంకులో వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు.