S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 00:56

దుబ్బాక, ఏప్రిల్ 15: లోకకల్యాణార్థమే సీతారాముల కల్యాణంను శ్రీరామనవమినాడు జరుపుకుంటామని ఎంపి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామం మండలంలోని పోతారం హనుమాన్ ఆలయంలో జరిగిన సీతారాముల కల్యాణంలో ప్రభాకర్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం కల్యాణానికి హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేపట్టారు.

04/16/2016 - 00:55

సిద్దిపేట, ఏప్రిల్ 15 : సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

04/16/2016 - 00:54

మెదక్, ఏప్రిల్ 15: మెదక్ శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం నాడు శ్రీ సీతారాముల కల్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ శాసనససభ ఉపసభాపతి, మెదక్ శాసనసభ్యురాలు ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలను సీతారాముల కల్యాణానికి సమర్పించారు.

04/16/2016 - 00:54

సిద్దిపేట, ఏప్రిల్ 15: సిద్దిపేట మున్సిపాల్టీని అందరి భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సమిష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని ప్రభుత్వ పథకాలు విజయవంతం చేయడంలో అందరు చిత్తశుద్దితో పని చేయాలని సూచించారు.

04/16/2016 - 00:49

మహబూబ్‌నగఠ్‌టౌన్, ఏప్రిల్ 15: పట్టణంలోని కుమ్మరివాడీ కాలనీలో ఉన్న వీరాంజనేయస్వామి ఆలయ అభివృధ్ధికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. రూ.5లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రతాగునీటి ఎద్దడి ఉందని వాటిని నియంత్రించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి ఇంటికి మంచినీరు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు.

04/16/2016 - 00:46

ధన్వాడ, ఏఫ్రిల్ 15: అప్పుల బాద భరించలేక రైతు క్రిమిసంహరక మందును సేవించి మృతి చెందిన సంఘటన ధన్వాడ మండంలో శుక్రవారం చోటు చేసుకుంది. మరికల్ ఎఎస్సై బాల్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన కుర్వ దశరత్ (31) అనే రైతు గురువారం సాయంత్రం తన పోలం వద్ద క్రిమిసంహరక మందును సేవించాడు.

04/16/2016 - 00:45

మానవపాడు, ఆరు నెలలుగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌నంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని మానవపాడు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వ్యక్తిని మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కె.సత్యనారాయణ అనే వ్యక్తి గద్వాలలోని పిజెపి క్యాంప్‌లో డ్రైవర్‌గా విధులను నిర్వహిస్తున్నాడు.

04/16/2016 - 00:44

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 15: కాంగ్రెస్‌లో వలసలు షురూ అయ్యాయి. అందులో భాగంగా ఇటివల మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి తెరాసలోకి వెళ్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్‌లో వలసల కదలిక జిల్లాలో ప్రారంభమైంది. చేయ్యిని వీడేందుకు వివిధ నియోజకవర్గాల్లోని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రంగం సిద్దం చేసుకున్నారు. రాంమోహన్‌రెడ్డి వెంట వెళ్లేందుకు ఇప్పటికే పలు మండలాల్లో రంగం సిద్దమైంది.

04/16/2016 - 00:43

ఆమనగల్లు, ఏప్రిల్ 15: ఆమనగల్లు మండలంలోని మైసిగండి గ్రామంలో ఉన్న శివాలయంతో పాటు ఆమనగల్లు, కడ్తాల వివిధ గ్రామాల్లో సీతారామచంద్రస్వామి కళ్యాణం కన్నుల పండువగా అంగరంగ వైభవంగా జరిగింది.

04/16/2016 - 00:42

కోయిలకొండ, ఎప్రిల్ 15: కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండను మరో భద్రాచలంగా తీర్చిదిద్తుతానని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరామకొండపై సీతారామకల్యాణాన్ని కన్నుల పండుగగా వేదమంత్రాలతో భక్తి భావనతో నిర్వహించడం జరిగింది. శ్రీరామకొండ అభివృద్దికి తాను స్వంతంగా రూ. 25 లక్షలు ఇస్తున్నానని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రకటించడం విశేషం.

Pages